Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా, ఇజ్రాయెల్‌’ ఇరాన్ ప్రజల హంతకులని’ ఆరోపించిన ఇరాన్‌!

టెహ్రాన్‌: ఇరాన్ పౌరుల హత్యలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని ఇరాన్ ఆరోపించింది. ఇటీవలి నెలల్లో వేలాది మంది ఇరానియన్లు – పిల్లలు, శాస్త్రవేత్తలు, కమాండర్లు, సాధారణ పౌరులు హత్యకు గురయ్యారని, ఇది తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమన్నారు. ఈమేరకు హింసాత్మక నిరసనలలో జోక్యం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికపై ఒక సీనియర్ ఇరాన్ అధికారి స్పందించారు. ప్రభుత్వ సంస్థలను “స్వాధీనం చేసుకోమని” ఇరానీయులను కోరుతూ ట్రంప్ […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ అమలు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్న అధికార టీఎంసీకి ఇప్పడు బీజేపీ కూడా జత కలిసింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో పార్టీకి చెందిన కీలక నాయకుడు సువేందు అధికారి ఇటీవల ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించడం లేదా చేర్చడంపై తమ పార్టీ కార్యకర్తలు సమర్పించిన […]
Read more

చార్మినార్‌ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించిన పోలీసులు!

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు చార్మినార్ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ కింద భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజా భద్రత, నేరాల నివారణ , విజిబుల్ పోలీసింగ్‌పై ఈ ప్రత్యేక డ్రైవ్ దృష్టి సారించింది. చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే పర్యవేక్షణలో, దాదాపు 200 మంది పోలీసు సిబ్బందితో ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ల నుండి సైదాబాద్ ఎక్స్ రోడ్ల వరకు పెద్ద […]
Read more

గాజా శాంతి ప్రణాళిక అమలుకు మద్దతును పునరుద్ఘాటించిన స్పెయిన్, గ్రీస్!

మాడ్రిడ్‌: అమెరికా మద్దతుతో కూడిన గాజా శాంతి ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలుకు స్పెయిన్, గ్రీస్ తమ మద్దతును పునరుద్ఘాటించాయి. ఈమేరకు మధ్యప్రాచ్యంలో పరిణామాలు, వెనిజులాలో పరిస్థితి, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను చర్చించడానికి రెండు దేశాల నాయకులు మాడ్రిడ్‌లో సమావేశమయ్యారు. ఈమేరకు స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ను కలిసిన తర్వాత సంయుక్త వార్తా సమావేశంలో గ్రీకు ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ మాట్లాడుతూ… రెండు దేశాలు శాంతి ప్రణాళికను సమర్థిస్తున్నాయని, దాని తదుపరి దశ వైపు పురోగతికి పిలుపునిచ్చారని […]
Read more

ముంబైని బీజేపీ, అదానీల ఆధీనంలోకి పోనివ్వం… థాకరే బ్రదర్స్‌!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ థాకరే బీజేపీని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ విభజన రాజకీయాలను అనుసరిస్తోందని, ముంబైలోని మరాఠీ మనూస్‌ను క్రమపద్ధతిలో “ఒంటరి” చేస్తోందని ఆరోపించారు. జాతీయ పార్టీ అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భూ కబ్జాకు పాల్పడుతుందని, […]
Read more

అసంబద్ధమైన ఆధారాలతో నా భర్తను నిర్బంధించారు…సుప్రీంకోర్టుకు తెలిపిన వాంగ్‌చుక్‌ భార్య!

న్యూఢిల్లీ: సరైన అధారాలు లేకుండానే తన భర్తను నిర్బంధించారని జైలులో ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో నిన్న సుప్రీంకోర్టుకు తెలిపారు. నిర్బంధ అధికారి చెబుతున్న నాలుగు వీడియోలను వాంగ్‌చుక్‌కు అందించలేదని, ఇది అతని హక్కును ఉల్లంఘించడమేనని ఆమె కోర్టుకు తెలిపారు. ఆంగ్మో తరపున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, జస్టిస్‌లు అరవింద్ కుమార్, ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనానికి వీడియోలను అందించకపోవడంతో… సలహా మండలి ముందు, అలాగే ప్రభుత్వం […]
Read more

వార్తా ఛానెళ్లపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం!

హైదరాబాద్: మహిళా ఐఏఎస్ అధికారులు, ఒక రాష్ట్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని “అపమానకరమైన, నిరాధారమైన కంటెంట్”ను ప్రసారం చేసిన అనేక ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు NTV, తెలుగు స్క్రైబ్, MR మీడియా తెలంగాణ, ప్రైమ్9 తెలంగాణ, PVNews, సిగ్నల్ టీవీ, వోల్గా టైమ్స్, మిర్రర్ టైఆఫీషియల్, Tnews తెలుగు ఛానల్‌లపై కేసులు నమోదు […]
Read more

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షకు కమిటీ ఏర్పాటు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను అహేతుకంగా చేపట్టారని అన్నారు. “జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణపై మాకు వినతులు వస్తున్నాయి. రాజకీయ కారణాల ఆధారంగా (జిల్లాలపై) నిర్ణయాలు తీసుకుంటే న్యాయం […]
Read more

అధిక జనాభా ఉన్న పట్టణాల్లో అదనపు తహసీల్దార్ల నియమిస్తామన్న మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: జనాభా అధికంగా ఉన్న పట్టణాల్లో ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం 1.5 లక్షల నుంచి 2 లక్షల జనాభా ఉన్న అనేక పట్టణాల్లో కేవలం ఒకే తహసీల్దార్ ఉన్నారని, దీనివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఒకే తహసీల్దార్ ఇంత పెద్ద జనాభాను సమర్థవంతంగా నిర్వహించలేరని అంగీకరించిన మంత్రి, ఈ విషయాన్ని తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత, […]
Read more

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు లేఖలు రాసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క!

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, తెలంగాణ విద్యుత్ డిస్కామ్‌లు… విద్యుత్ వినియోగదారులతో సంబంధాలు బలోపేతం చేయడానికి ఓ వినూత్నయత్నానికి నడుం బిగించాయి. ఇందులో భాగంగా… నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపే లేఖలు, ఉప ముఖ్యమంత్రి సందేశాన్ని 83 లక్షల మంది గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు, వ్యవసాయ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుల పేరు,సేవా కనెక్షన్ నంబర్‌ను కలిగి ఉన్న ఈ వ్యక్తిగత చిరునామా లేఖలను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ […]
Read more
1 26 27 28 29 30 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.