Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఏప్రిల్ 22 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఈమేరకు నిన్న ఆర్టీసీ ప్రతినిధులు, కార్మిక శాఖ కమిషనర్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన సమావేశం విఫలమవడంతో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంయుక్త కార్యాచరణ సమితి (JAC) ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. “మా డిమాండ్లు నెరవేర్చకపోతే, ఏప్రిల్ 21- 22 తేదీల మధ్య రాత్రి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత డిపో నుండి బయలుదేరాల్సిన మొదటి బస్సు డిపోలోనే ఉంటుందని” TGSRTC […]
Read more

ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ వాడుతున్న అల్గారిథంను రూపొందించింది ఎవరు?

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ఆల్ట్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోల్‌కతాలోని సబర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సాబిర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలోని ఫలితాలు రూపకల్పనలో పక్షపాతాన్ని, పెద్ద ఎత్తున ఓటర్లను మినహాయించడాన్ని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆల్ట్ న్యూస్, సాబర్ ఇన్‌స్టిట్యూట్ రెండూ బెంగాల్ SIRకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం (ECI) డేటాను విశ్లేషించి, ఆందోళనకరమైన ధోరణులను గుర్తించాయి. రాష్ట్రంలో SIR ప్రక్రియ […]
Read more

డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌…భారత రాజ్యాంగ నిర్మాత!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి ఏటా ఏప్రిల్ 14న ఆ మహనీయుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును ‘సమానత్వ దినోత్సవం’గా కూడా పిలుస్తారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, దళితుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడిగా చిరస్మరణీయులు. మధ్యప్రదేశ్‌లోని మహౌ (MHow) ప్రాంతంలో 1891లో జన్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్… భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. చిన్నప్పటి నుంచే […]
Read more

ఢిల్లీ హైకోర్టు జడ్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించిన కేజ్రీవాల్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరనా కాంత శర్మ, ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న న్యాయవాదుల సంఘం ‘అధివక్త పరిషత్’ నిర్వహించిన ఒక కార్యక్రమానికి నాలుగు సార్లు హాజరయ్యారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఢిల్లీ మద్యం విధానం కేసును ‘రాజకీయమైనది’ అని ఆయన అభివర్ణించారు. “అధివక్త […]
Read more

శాంతి చర్చల్లో ప్రతిష్టంభనకు ప్రధాన కారణం ఇరాన్‌ అణు కార్యక్రమమే!

వాషింగ్టన్: పాకిస్తాన్‌లో ఇరాన్, అమెరికాల మధ్య వారాంతంలో జరిగిన చర్చల్లో టెహ్రాన్ అణు కార్యకలాపాలపై ఉన్న విభేదమే ప్రధాన ప్రతిష్టంభనకు కారణమైంది. వాషింగ్టన్ తన ప్రతిపాదనలో ఇరాన్ యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని సూచించగా, కేవలం ఐదేళ్లకు మాత్రమే అంగీకరించగలమని టెహ్రాన్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదికలు పేర్కొన్నాయి. నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్ చర్చల సందర్భంగా ఇరాన్ అణు కార్యకలాపాలను నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్‌లు ప్రతిపాదనలు మార్చుకున్నాయి, కానీ […]
Read more

తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు…ఒక విశ్లేషణ!

హైదరాబాద్‌: తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు-2026 ప్రకారం…మతసామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య అసమ్మతి, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలను నేరుగా ఎదుర్కొని, నివారించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించడం దీని ప్రాథమిక లక్ష్యం. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపులకు అతీతంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష ప్రసంగ సంఘటనల నేపథ్యంలో ఈ బిల్లు వచ్చింది. ఈ […]
Read more

ఉజ్జయినీ విశ్వవిద్యాలయ పరీక్షలో మతపరమైన ప్రశ్నపై వివాదం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఉన్న సమ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం, బి.కామ్, బిబిఏ, బిసిఏ ప్రోగ్రామ్‌ల మూడవ సంవత్సరం విద్యార్థుల ఫౌండేషన్ కోర్సు పరీక్ష పేపర్‌లో మతపరంగా సున్నితమైన ప్రశ్న రావడంతో ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన, విద్యా రంగంలో మతపరమైన పక్షపాతం ఉందంటూ, విస్తృతమైన ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. హిందీలో ఉన్న వివాదాస్పద ప్రశ్న ఏమిటంటే… “అల్లాహ్ కే శివ దూస్రా కోయీ నహీ హై” (అల్లాహ్ తప్ప వేరే […]
Read more

ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ‘ఎస్‌ఐఆర్‌’…సీఎం మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ భారీ సభలో ఆమె మాట్లాడుతూ…బీజేపీ ఓటర్లకు లంచాలు ఇస్తోందని, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఓటర్లకు నగదు, ప్రలోభాలతో లంచాలు ఇవ్వడం మామూలేనని, కానీ ఓటింగ్ ముగియగానే ఇచ్చిన హామీలన్నింటినీ సౌకర్యవంతంగా మరిచిపోతుందని బెనర్జీ ఆరోపించారు. ఇటీవలి బీహార్ ఎన్నికలను ఆమె దీనికి ప్రధాన […]
Read more

ఇరాన్‌ ఓడరేవులను దిగ్బంధించనున్న అమెరికా!

వాషింగ్టన్‌: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను భారీగా దెబ్బతీసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఇరాన్‌ ఓడరేవులను పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఇది ఈరోజు రాత్రినుంచి ప్రారంభమవుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. ఇరాన్ పోర్టులను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలకు ఇది వర్తిస్తుందని సెంట్‌కామ్ స్పష్టం చేసింది. అయితే, ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకల […]
Read more

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే ఆధిపత్యం…అగ్రస్థానంలో మెదక్!

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచి బాలురను అధిగమించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 89.07 శాతం నుండి 69.04 శాతం మధ్య ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 79.14 శాతం నుండి 39.42 శాతం మధ్య నమోదైంది. రాజన్న (సిరిసిల్ల) జిల్లాలో బాలికల ఉత్తీర్ణత శాతం 69.04 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం […]
Read more
1 27 28 29 30 31 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.