Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువును పొడిగించిన ట్రంప్!

వాషింగ్టన్‌: హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఈ దాడులను వాయిదా వేయాలన్న అభ్యర్థన టెహ్రాన్ నుండే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌‌లో చేసిన తాజా ప్రకటలో… ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు చాలా బాగా సాగుతున్నాయని అన్నారు. ‘‘ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు విద్యుత్ ప్లాంట్ల విధ్వంసాన్ని 10 రోజుల పాటు.. అంటే 2026 ఏప్రిల్ […]
Read more

హైదరాబాద్, వరంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 10 వేల పడకలు!

హైదరాబాద్: వరంగల్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు అదనంగా 10వేల పడకలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రులను నిమ్స్‌, సనత్‌నగర్, అల్వాల్, ఎల్.బి. నగర్, వరంగల్ టిమ్స్‌ ప్రాంగణాల్లో నిర్మించనున్నారు. ఈమేరకు సీఎం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ… రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడి ఆసుపత్రుల్లో స్వచ్ఛంద సేవలు అందించడానికి, విదేశాల్లో నివసించే తెలంగాణ వైద్యులు నమోదు చేసుకునేలా ఆరోగ్య […]
Read more

యుద్ధ ముగింపుపై అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌…ప్రతిగా ఐదు షరతులు!

టెహ్రాన్‌: యుద్ధాన్ని ముగించాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తమ షరతుల ప్రకారమే “యుద్ధాన్ని ముగిస్తామని” పేర్కొంది. ఈ ప్రతిపాదన వివరాలు తెలిసిన ఒక సీనియర్ ఇరాన్ అధికారి ప్రెస్ టీవీతో మాట్లాడుతూ, వాషింగ్టన్ ప్రతిపాదన “అతిశయోక్తి” అని అభివర్ణించారు. “తాను నిర్ణయించుకున్నప్పుడు, తన షరతులు నెరవేరినప్పుడు మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తుంది” అని ఆ అధికారి అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా తన రక్షణను కొనసాగించాలని ఇరాన్ ఉద్దేశిస్తోంది. తన షరతులు నెరవేరే వరకు తీవ్రమైన దాడులు” […]
Read more

బీజేపీ-ఈసీల మధ్య ఉన్న బంధంపై ఎన్డీయేతర పార్టీలు ఐక్యంగా ఉండాలి… మమతా బెనర్జీ!

కోల్‌కత: బీజేపీకి, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) మధ్య ఉన్న ‘అపవిత్ర బంధానికి’ వ్యతిరేకంగా, సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి ఎన్డీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ఈ కూటమి భారతదేశాన్ని ఏకపక్ష పాలన వైపు నెడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆమె హెచ్చరించారు. “మీరు కుడిపక్షమా లేక ఎడమపక్షమా అన్నది ముఖ్యం కాదు… ఆ విషయాన్ని మర్చిపోదాం” అని బెనర్జీ అన్నారు. “కేంద్రం, దాని ఏజెన్సీల […]
Read more

ఇస్రోను సందర్శించనున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

హైదరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) చేపట్టిన “హర్ ఇండియన్ కా మూన్‌షాట్” కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల నుండి 59 మంది విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి ఎంపికయ్యారు. అగస్త్య ఫౌండేషన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో SCERT నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళ, వ్యాస పోటీల ద్వారా ఈ విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ విద్యార్థులతో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు కూడా […]
Read more

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం… మోదీ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక సెమినార్‌లో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో, విదేశాంగ విధానం “దిశను కోల్పోతోందని” దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పాత్రికేయులు, మేధావులు ఆరోపించారు. “జన్ హస్తక్షేప్” అనే పౌర హక్కుల సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ మధ్య బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం “నిశ్శబ్దం” అవలంబించడాన్ని వక్తలు […]
Read more

గిరిజనుల పునరావాసం కోసం రూ. 62.55 కోట్లు కేటాయింపు!

హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. గిరిజన పునరావాస కార్యక్రమాలలో భాగంగా తెలంగాణలోని గిరిజన కుటుంబాల అభివృద్ధికి రూ. 62.55 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 14 గిరిజన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. భారతదేశంలో గిరిజనులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అందించిన అత్యధిక పరిహారం ఇదే కావడం విశేషం. అమ్రాబాద్ […]
Read more

ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్!

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు 15-సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించిందని, అయితే ఆ ప్రణాళిక రూపరేఖల గురించి బహిరంగంగా మాట్లాడే అధికారం లేదని పేరు తెలపడానికి ఇష్టపడని వ్యక్తి తెలిపారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య పునఃచర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తులు ఈ కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌కు సమర్పించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న సుమారు 50వేల మంది సైనికులకు అదనంగా, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుండి కనీసం వేయి మంది […]
Read more

వదంతులతో హైదరాబాద్ పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ!

హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పొడవైన క్యూలలో వాహనదారులు పెట్రోల్‌ కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో పలు బంకుల వద్ద ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు ప్రదర్శించారు. మరోంక సిఎన్‌జి అవుట్‌లెట్ల వద్ద, ఇంధనం నింపుకోవడానికి ఆటోరిక్షాలు పొడవైన క్యూలలో వేచి ఉండటం కనిపించింది. ఇది […]
Read more

గాజా పరిస్థితి ‘చాలా కష్టంగా’ ఉందని హెచ్చరించిన శాంతి మండలి ప్రతినిధి!

జెనీవా: గాజాలో పరిస్థితి “చాలా కష్టంగా ఉంది” అని శాంతి మండలికి చెందిన ఒక సీనియర్ అధికారి హెచ్చరించారు. ఈమేరకు పాలస్తీనాపై జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో, గాజా శాంతి మండలి ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ మాట్లాడుతూ… “మొదటి దశ అమలు తర్వాత గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ, గాజాలో పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది” అని అన్నారు. “యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో అత్యవసర సేవలు చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. […]
Read more
1 34 35 36 37 38 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.