Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్!

టెహ్రాన్‌: తమ నేతల హత్యలో పాలు పంచుకున్న టెక్ సంస్థలను ఇరాన్ హెచ్చరించింది. నేటి నుండి ఆపిల్, గూగుల్, మెటా, ఐబిఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. టెహ్రాన్ కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటల (1630 GMT) నుండి…ఈ కంపెనీల సంబంధిత యూనిట్లు ధ్వంసం చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. “ఈ సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే తమ […]
Read more

ఓటర్ల హైజాకింగ్‌కు బీజేపీ కుట్ర…సీఈసీకి లేఖరాసిన మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలోకి చొరబడేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఘాటు లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం పరోక్ష మద్దతుతో, మోసపూరిత దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ఓటర్ల జాబితాలో బయటివారిని చేర్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. బెంగాల్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు ఇది ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంటూ బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం […]
Read more

మూసీ పునరుజ్జీవనంపై ప్రజల సూచనలను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల నుండి సలహాలు, సూచనలను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ, మార్చి 31 నుండి ఏప్రిల్ 15, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ప్రజలు తమ సూచనలను musirdc@gmail.com ఇమెయిల్ IDకి పంపవచ్చు. రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మూసీ పునరుజ్జీవన పనులు పూర్తిగా […]
Read more

పాలస్తీనా ఖైదీలకు కొత్త మరణశిక్ష చట్టం… ఇజ్రాయెల్‌ను విమర్శించని అమెరికా!

టెల్‌అవీవ్‌: పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష విధించే కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్‌ పార్లమెంట్ ఆమోదించాక, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అమెరికా ఇజ్రాయెల్‌ను విమర్శించడానికి నిరాకరించింది. “ఉగ్రవాదానికి పాల్పడిన వ్యక్తులపై తమ సొంత చట్టాలను, శిక్షలను నిర్ణయించుకునే ఆ దేశ సార్వభౌమ హక్కును అమెరికా గౌరవిస్తుంది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. “అటువంటి చర్య ఏదైనా నిష్పక్షపాత విచారణతో, దానికి సంబంధించిన అన్ని వర్తించే హామీలు, రక్షణలకు అనుగుణంగా అమలవుతుందని మేము విశ్వసిస్తున్నామని” ఆ […]
Read more

రూపాయి భారీ క్షీణత!

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా, 2012 ఆర్థిక సంవత్సరంలో, కరెంట్ ఖాతా లోటు 4.2 శాతానికి పెరిగిన సమయంలో, దేశీయ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే 12.4 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, నిరంతర విదేశీ నిధుల తరలింపు, పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న డాలర్ కారణంగా ఈ […]
Read more

‘అమ్మకు అక్షరమాల’తో తెలంగాణలో మహిళా సాధికారత!

హైదరాబాద్: సమ్మిళిత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ద్వారా ఒకప్పుడు ప్రాథమిక విద్యకు దూరమైన వేలాది మంది జీవితాల్లో అక్షరాస్యతను పెంపొందిస్తూ… మహిళా సాధికారతకు కొత్త నిర్వచనం ఇస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (Society for Elimination of Rural Poverty) ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఆధారిత అభ్యసనానికి ఒక శక్తివంతమైన నమూనాగా ఆవిర్భవిస్తోంది. ప్రధానంగా స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులపై దృష్టి సారించిన […]
Read more

ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్‌తో చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్… ఖండించిన బఘేర్!

దుబాయ్: టెహ్రాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం “త్వరలో” కుదరకపోతే, ఇరాన్ ఇంధన వనరులను, డీశాలినేషన్ ప్లాంట్లతో సహా ఇతర కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ…ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని ట్రంప్ చెప్పారు. గతంలో వాషింగ్టన్ సంప్రదింపుల భాగస్వామిగా ఈ మాజీ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ పేరు వినిపించింది, కానీ ఇరాన్ అమెరికాతో […]
Read more

దేశంలో ప్రజాస్వామ్య క్షీణతపై ఫ్రీడం హౌస్‌ నివేదిక!

న్యూఢిల్లీ: ఫ్రీడం హౌస్ 2026 నివేదిక విడుదలైంది. మొత్తం 195 దేశాలలో స్వేచ్ఛ స్థితిని ఈ రిపోర్టు అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం గత 20 ఏళ్లలో 19 “పాక్షిక స్వేచ్ఛాయుత” దేశాలు “స్వేచ్ఛ లేనివి”గా మారిపోయాయి. ఇక భారతదేశంలోనూ ప్రజాస్వామ్య సూచీలు క్షీణించాయి. మనదేశం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను రాజ్యాంగబద్ధంగా పొందుపరుస్తూ బహుళ పార్టీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్నప్పటికీ, వివక్షాపూరిత విధానాలు, ముస్లింల వంటి మైనారిటీ సమూహాలపై పెరుగుతున్న వేధింపులు స్వేచ్ఛా […]
Read more

ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటాం…ఖర్గ్ ద్వీపంపై కన్నేసిన అమెరికా బలగాలు!

వాషింగ్టన్‌: మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు తమ ఉనికిని విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇరాన్‌లోని “చమురును స్వాధీనం చేసుకోవడానికి” తాను “ప్రాధాన్యత ఇస్తానని”, కీలకమైన ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. “నిజం చెప్పాలంటే, ఇరాన్‌లోని చమురును తీసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం,” అని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చమురు రంగాన్ని “నిరవధికంగా” నియంత్రించాలని అమెరికా లక్ష్యంగా […]
Read more

‘మియా ముస్లింల’ వెన్ను విరిచేస్తాం…అస్సాం సీఎం విద్వేష వ్యాఖ్యలు!

గువహటీ: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ‘మియాల’ నడుము విరిచేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విద్వేష వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ జిల్లాలోని ధకువాఖానాలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే, తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేసిందని శర్మ ప్రకటించారు. “బంగ్లాదేశ్ నుండి వచ్చి అస్సాం భూములను, ఇళ్లను ఆక్రమించిన వారి చేతులు, కాళ్లు రాజకీయంగా విరిచేశాం,” […]
Read more
1 32 33 34 35 36 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.