Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో 29 మంది పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలెం: గత ఏడాది అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడుల్లో కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, కాల్పుల విరమణ తర్వాత ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. హమాస్ కొత్త కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, గాజా అంతటా దాడులు జరిగాయి, వాటిలో గాజా నగరంలోని ఒక […]
Read more

సహజీవనం… దాగివున్న చీకటి కోణాలు!

తెలంగాణ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా దెబ్బతింటోంది? అణగారిన వర్గాల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR) ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. 2026 జనవరి 31న హైదరాబాద్‌లోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ నివేదిక బహిర్గతమైంది. చీకటి కోణాలను ఆవిష్కరించిన క్షేత్రస్థాయి పరిశీలనఈ నివేదిక కేవలం కాగితాల […]
Read more

గాజాలో 71వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంగీకరించిన ఇజ్రాయెల్‌ సైన్యం!

టెల్‌అవీవ్‌ : గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు సాగించిన మారణహోమం దెబ్బకు 71,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని సీనియర్ ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) అధికారులు అంగీకరించారు. ఈమేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదహరించిన సంఖ్య ఖచ్చితమైనదని వారు మొదటిసారి అంగీకరించారు. గతంలో ఈ మరణాల సంఖ్యను “నమ్మశక్యం కానిది”,”తప్పుదారి పట్టించేది” అని తోసిపుచ్చిన సీనియర్ సైనిక వర్గాలు… ఇజ్రాయెల్ వార్తాపత్రికలు హారెట్జ్, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లతో మాట్లాడుతూ… ఈ సంఖ్య సరైనదే అయినప్పటికీ, […]
Read more

గ్రాండ్‌ ఇండియన్‌ నర్సరీ మేళా… టెర్రస్ గార్డెన్‌లకు కొత్త ఊపు!

హైదరాబాద్‌: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా ఈ వారం ఒక అందమైన పూల వనంగా మారిపోయింది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు ఇక్కడ గ్రాండ్‌ ఇండియన్‌ నర్సరీమేళా జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతమంతా పసందైన సువాసనలు వెదజల్లనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ మేళా, హుస్సేన్ సాగర్ అందాలతో పాటు అరుదైన, విదేశీ మొక్కల అద్భుతమైన ప్రపంచాన్ని వీక్షించడానికి హైదరాబాదీలను ఆహ్వానిస్తుంది. ఇక్కడి […]
Read more

షర్జీల్ ఇమామ్ సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్!

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్ ఇమామ్ అరెస్టు అయిన ఆరేళ్ల తర్వాత… ఆయన విడుదల కోసం కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, పార్లమెంటేరియన్లు పిలుపునిచ్చారు. మైనారిటీ రాజకీయ స్వరాలను లక్ష్యంగా చేసుకోవడంలో షర్జీల్‌ జైలు శిక్ష భాగమని పేర్కొన్నారు .రాజకీయ అసమ్మతివాదులను దీర్ఘకాలం నిర్బంధించడం, భారతదేశంలో ప్రజాస్వామ్య నిరసనలకు స్థలం తగ్గిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హర్ష్ మందర్ మాట్లాడుతూ… 2020 ఢిల్లీ అల్లర్లను ఒక వ్యవస్థీకృత […]
Read more

ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన హాస్టల్‌ విద్యార్థినులు!

హైదరాబాద్: రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో ఉన్న బీసీ ఇంటర్మీడియట్ బాలికల హాస్టల్‌లో శుక్రవారం రాత్రి, ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో హాస్టల్ వార్డెన్ విజయ వారిని వెంటనే కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్య అధికారి డాక్టర్ శ్రావణి వారికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. […]
Read more

ఎన్‌సిపి విలీనం తథ్యమా?…శరద్, సుప్రియా సూలేతో చర్చలు!

బారామతి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)ని శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు దాదాపు 40 ఏళ్లుగా సన్నిహితుడు, సహాయకుడిగా ఉన్న కిరణ్ గుజార్ మాటలు నమ్మితే, ఇది త్వరలోనే జరగబోతోందని తెలుస్తోంది. 1980వ దశకం మధ్యలో పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే ఆయనతో అనుబంధం ఉన్న గుజార్, తనను బలిగొన్న విమాన ప్రమాదానికి కేవలం ఐదు రోజుల ముందు పవార్ ఈ విషయం గురించి […]
Read more

వరంగల్‌ విమానాశ్రయాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి!

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో విమాన కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఈమేరకు వరంగల్‌లోని మమ్నూర్ విమానాశ్రయాన్ని రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయంలో 2,500 మీటర్ల రన్‌వే, ఆధునిక టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, సమగ్ర అగ్నిమాపక, భద్రతా మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ టెర్మినల్‌ను కాకతీయ శకపు నిర్మాణ వారసత్వాన్ని […]
Read more

ఇరాన్‌పై సైనిక చర్య అవసరం రాదని ఆశిస్తున్నాను…ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌పై సైనిక చర్యను నివారించాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్‌తో మరిన్ని చర్చలు జరపాలని తాను యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. “నా మొదటి పదవీకాలంలో నేను సైన్యాన్ని బలోపేతం చేశాను. ఇప్పుడు ఇరాన్ అనే ప్రదేశానికి ఒక బృందం బయలుదేరి వెళ్తోంది. ఆ సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నాను” అని తన భార్య మెలానియా గురించిన ఒక డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా ట్రంప్ విలేకరులతో […]
Read more

యూజీసీ ఈక్విటీ నిబంధనలను స్వాగతించిన జేఐహెచ్‌…సుప్రీం’స్టే’పై ఆందోళన!

న్యూఢిల్లీ: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వివక్షను పరిష్కరించే దిశగా యూజీసీ కొత్త మార్గదర్శకాలను జమాతే ఇస్లామీ స్వాగతించింది. అయితే తాజాగా వీటిపై సుప్రీం కోర్టు స్టే విధించడంపై మర్కజీ తాలీమి బోర్డు ఛైర్మన్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, లింగం, వైకల్యం, ప్రాంతం వంటి కారణాలపై వివక్షను గుర్తించడం సానుకూల పరిణామం అయినప్పటికీ, ఈ నిబంధనల జమైన ప్రభావం వాటి అమలు, స్వయంప్రతిపత్తి, ప్రాతినిధ్య స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన […]
Read more
1 54 55 56 57 58 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.