Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్ లైసెన్స్‌ పొందింది…ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి!

జెనీవా: ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై “పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్ లైసెన్స్‌ పొందిందని” జెనీవాలోని మానవ హక్కుల మండలిలో ఒక కొత్త నివేదికను సమర్పిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి వాపోయారు. ఇది “పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న మారణహోమాన్ని” నమోదు చేస్తుందని, “పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు, ఇజ్రాయెల్ హింసను క్రమపద్ధతిలో ఉపయోగించడాన్ని” ఇది హైలైట్ చేస్తుందని ఫ్రాన్సెస్కా అల్బనీస్ అన్నారు. దురాగతాలకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు, “మీ ప్రభుత్వాలలో చాలా వరకు, మీ మంత్రులు […]
Read more

విద్వేషపూరిత ప్రసంగాల ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

హైదరాబాద్: మత సామరస్యాన్ని దెబ్బతీసి, హింస, ఘర్షణలను ప్రేరేపించే విద్వేషపూరిత ప్రసంగాలను, సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు- విద్వేష నేరాల నివారణ బిల్లు, 2026’కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లును కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక గత ఏడాది డిసెంబర్ 18న ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లు […]
Read more

“నిన్ను ఇక్కడే పాతిపెడతానంటూ” యూపీ పోలీసు బెదిరింపు…నిలిచిన ఈద్ నమాజ్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా, కురవలి గ్రామంలో దశాబ్దాల నాటి ఈద్గా వద్ద స్థానిక ముస్లింలను ఈద్ నమాజ్ చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనన్‌పురిలోని కురవలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) లలిత్ భాటికీ, నమాజు చేస్తున్న వారికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని ఒక వీడియో చిత్రీకరించింది. స్థానికుల నుండి అవాంతరాలపై ఫిర్యాదులు రావడంతో, అక్కడ గుమిగూడిన ముస్లింలను ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని, కేటాయించిన ప్రదేశంలోనే ప్రార్థనలు చేసుకోవాలని SHO ఆదేశించారు. ఎటువంటి […]
Read more

మణిపూర్‌లో తొలగిన ప్రతిష్టంభన…కుకీ జో కౌన్సిల్‌తో చర్చలు జరిపిన సీఎం!

ఇంఫాల్‌: రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరణ దిశగా ముందడుగు పడింది. మైటీ, కుకీల మధ్య విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కుకీ జో కౌన్సిల్ ప్రతినిధి బృందంతో సీఎం ఖేమ్‌చంద్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఒక “మంచి ప్రారంభం” అని ఆయన అన్నారు. కుకీ జో ప్రతినిధి బృందంతో గౌహతిలో రహస్య సమావేశం జరిపిన ఒక రోజు తర్వాత, సీఎం విలేకరులతో మాట్లాడుతూ… “దాదాపు మూడేళ్లలో తొలిసారిగా కుకీ జో […]
Read more

హర్మూజ్‌ దాటాలంటే 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందే…ఇరాన్‌!

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ నౌకా రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఆ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ భారీ రుసుము ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త […]
Read more

‘రైతుల కోసం ప్రతి నెలా 5,500 కోట్లు ఖర్చు’…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: ఆరుగాలం కష్టించే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం, అక్కడ జరిగిన ‘రైతు ఉత్సవాల’లో రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రబీ సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సంక్షేమం పట్ల తన ప్రభుత్వానికి […]
Read more

బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విక్రమార్క!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను మూడు లక్షల కోట్లతో బాహుబలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ పాలన చేస్తున్నామన్నారు. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పని చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని.. దేశంలో తెలంగాణను నెంబర్‌ ఒన్‌ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని […]
Read more

‘ధురందర్: ది రివెంజ్’…తప్పుదోవ పట్టాలనుకునే వారిని మెప్పించే దిశగా వేసిన ఒక అద్భుతమైన ఎత్తుగడ!

తత్సమ్‌ ఛటర్జీ…🖋️ గత రెండు నెలల్లో ఇది రెండోసారి, ఒక మహిళ తన దేశానికి ద్రోహం చేస్తున్న తన గ్యాంగ్‌స్టర్ భర్తను వ్యతిరేకిస్తుంది. ఇటీవల విశాల్ భరద్వాజ్ ‘ఓ’రోమియో’లో ఇలాగే జరిగింది, పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో చేతులు కలిపినందుకు జలాల్ (అవినాష్ తివారీ; దావూద్ ఇబ్రహీంకు ప్రత్యామ్నాయంగా)ను రబియా (తమన్నా భాటియా) నిలదీస్తుంది. ఆదిత్య ధర్ ‘ధురందర్: ది రివెంజ్’లో, యాలినా (సారా అర్జున్) హమ్జా (రణ్‌వీర్ సింగ్) రహస్య డైరీని కనుగొన్నప్పుడు అతనిపై తుపాకీ […]
Read more

రైతులను రాజులుగా తీర్చిదిద్దుతాం…ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్!

హైదరాబాద్: తెలంగాణలోని సమస్త రైతు సమాజం సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఒక లాభదాయక వృత్తిగా ప్రోత్సహించడం ద్వారా రైతులను ‘రాజులుగా’ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘శ్రీ పరాభవ నామ ఉగాది’ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, భూ లావాదేవీలకు సంబంధించిన ‘సాదా బైనామా’ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు. రైతులకు సమస్యలను సృష్టించిన ‘ధరణి’ పోర్టల్‌ను తొలగించి, భూ యాజమాన్య […]
Read more

ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో ఆహార ధరలు పెంచుతున్న రెస్టారెంట్లు!

హైదరాబాద్‌: పట్టణ వినియోగదారులలో అధిక శాతం మంది రెస్టారెంట్లు, వీధి వ్యాపారుల వద్ద భోజనం కోసం అదనపు ధరలు చెల్లిస్తూ ఎల్పీజీ సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేకు భారతదేశంలోని 309 జిల్లాల నుండి స్పందనలు అందగా, వాటిలో టైర్ వన్ నగరాల నుండి 44 శాతం, టైర్ టూ నగరాల నుండి 27 శాతం, టైర్ త్రీ, ఫోర్, ఫైవ్ నగరాల నుండి 29 శాతం స్పందనలు వచ్చాయి. గత వారంలో […]
Read more
1 55 56 57 58 59 214

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.