Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మార్నింగ్ వాక్ చేస్తుండగా సీపీఎం నేత దారుణ హత్య!

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈరోజు ఉదయం చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఈ హత్య జరిగింది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన రామారావుపై కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశారు. స్థానికులు రోడ్డుపక్కన ఆయన మృతదేహాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు […]
Read more

అమెరికా నుంచి 2790 మంది భారతీయులు వెనక్కి వచ్చారన్న కేంద్రం!

న్యూఢిల్లీ: అక్రమవలసదారులపై అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి […]
Read more

ఎస్‌ఐఆర్‌ భయంతో బెంగాల్‌లో మరోవ్యక్తి ఆత్మహత్య!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటు హక్కు లేకుండా పోయే అవకాశం ఉందని బాధపడుతూ మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో SIRకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది. భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించింది. “మా చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజల హక్కులను కాపాడటానికి,మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాల దుర్మార్గపు ఎజెండాను ఓడించడానికి మేము […]
Read more

మహబూబాబాద్ మార్చురీలో సజీవంగా కనిపించిన రోగి!

హైదరాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగి బతికుండగానే మార్చురీలోకి తరలించడం కలకలం రేపింది. ఆధార్ కార్డు లేని కారణంగా ఆసుపత్రిలో చేర్చుకోని, ఆ తర్వాత పొరపాటున మార్చురీకి పంపినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆ వ్యక్తి తాను కిడ్నీ సమస్య చికిత్స కోసం వచ్చానని చెప్పాడు, కానీ అడ్మిషన్ నిరాకరించారని చెప్పాడు. “నేను ఐదు రోజుల క్రితం […]
Read more

ముంబయిలో చిన్నారుల కిడ్నాప్‌ కథ సుఖాంతం!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న మూడు గంటల పాటు సాగిన కిడ్నాప్‌ డ్రామా సుఖాంతమైంది. ఈ సందర్భంగా 17 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలను రక్షించారు. కాగా, కిడ్నాపర్‌ బుల్లెట్ గాయంతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే… వెబ్‌సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి కొంతమంది పిల్లల్ని స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ పిల్లల్ని కిడ్నాపర్‌ చెరనుండి విడిపించారు.పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మృతిచెందాడు. పొవాయ్ ప్రాంతంలో […]
Read more

‘ఇమ్మిగ్రెంట్స్‌’ వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేసిన అమెరికా!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర రాజ్యాధిపతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల వర్క్‌పర్మిట్ల (EAD) ఆటోమేటిక్ పొడిగింపును నిలిపివేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విదేశీ ఉద్యోగులు ప్రభావితం అయ్యేఅవకాశం ఉంది, వీరిలో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ 30 (నేటినుంచి) […]
Read more

బీహార్ ఎన్నికల సందర్భంగా 15ర్యాలీలలో ప్రసంగించనున్న రాహుల్, ప్రియాంక!

న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఎన్నికల పోటీ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇండియా కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దాదాపు 15 ర్యాలీలలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ చేయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్‌లో మూడు ర్యాలీలతో పాటు కొన్ని విలేకరుల సమావేశాలను కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రాహుల్ గాంధీ బుధవారం ముజఫర్‌పూర్, దర్భంగాలో రెండు […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ…104మంది మృతి!

పాలస్తీనా: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే…కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ యుద్ధకాంక్ష తీరలేదు. రోజుకో సాకు చూపి పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. మొన్న అర్థరాత్రి చేసిన ఇజ్రాయెల్‌ మెరుపు దాడులతో గాజా మరోసారి వణికిపోయింది. డ్రోన్లు, యుద్ధ, నిఘా విమానాలతో ఐడీఎఫ్‌ సైన్యం విరుచుకుపడింది. మొన్న అర్థరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ జరిగిన దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, […]
Read more

ఏపీలో తుఫానుకు ఇద్దరు మృతి…పంటలు, రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం!

అమరావతి: మంగళవారం అర్ధరాత్రి తీరం దాటిన మొంథా తుఫాను ఇద్దరు వ్యక్తులను చంపింది, 1.50 లక్షల ఎకరాలకు పైగా పంటలను దెబ్బతీసింది. విద్యుత్ – రవాణాకు అంతరాయం కలిగింది. ముందు జాగ్రత్త చర్యల కారణంగా నష్టం బాగా తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలోనూ భారీ వర్షాలుఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… తీవ్రమైన మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ముందు జాగ్రత్త చర్యలు నష్టాన్ని తగ్గించాయని తెలిపారు. థాయ్ భాషలో సువాసనగల […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముమ్మర సన్నాహాలు!

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇక పోలింగ్ కు కేవలం 12 రోజులు మాత్రమే మిగిలాయి. జిల్లా ఎన్నికల అధికారి,GHMC కమిషనర్ RV కర్ణన్, ఎన్నికల పరిశీలకులతో కలిసి సజావుగా, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా ఏర్పాట్లను నిశితంగా సమీక్షిస్తున్నారు. పోలింగ్‌ ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఎన్నికల అధికారులు, సిబ్బందితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 407 పోలింగ్ బూత్‌లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 127 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి […]
Read more
1 55 56 57 58 59 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.