Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా 50% సుంకం…సముద్ర ఎగుమతులపై ‘ప్రతికూల’ ప్రభావం!

న్యూఢిల్లీ: అమెరికా విధించిన 50% సుంకం భారతీయ సముద్ర ఎగుమతులపై ‘ప్రతికూల’ ప్రభావం చూపే అవకాశం ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఈక్వెడార్ వంటి పోటీదారులతో పోలిస్తే భారతదేశాన్ని ప్రతికూలంగా మారుతుందని వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిన్న పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)కి తెలిపింది. సుంకాలను తగ్గించేలా యూఎస్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరకపోతే భారత ఎగుమతిదారులు “ఈ కీలకమైన రంగంలో పట్టు కోల్పోవచ్చు” అని సీనియర్ కాంగ్రెస్ ఎంపీ […]
Read more

ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిర్దోషికి ‘పీహెచ్‌డీ’ పట్టా!

ముంబయి: ప్రముఖ న్యాయవాది, జైలు హక్కుల కార్యకర్త, 2006 ముంబై రైలు పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి అబ్దుల్ వాహిద్ షేక్‌కు ఔరంగాబాద్‌లోని MGM విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) డిగ్రీ ప్రదానం చేశారు. ఈ డిగ్రీని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ విలాస్ సక్పాల్ ఒక అధికారిక స్నాతకోత్సవ కార్యక్రమంలో అందించారు. “జైలు సాహిత్యం: స్వాతంత్య్రం తర్వాత” అనే శీర్షికతో ఆయన చేసిన డాక్టోరల్ పరిశోధన, భారతీయ జైళ్ల నుండి వెలువడే […]
Read more

దోహాపై దాడికి ‘సారీ’ చెప్పిన ఇజ్రాయెల్‌!

వాషింగ్టన్‌ డీసీ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌ థానీకి క్షమాపణలు చెప్పారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన త్రిముఖ సంభాషణలో దోహాలో ఇజ్రాయెల్ దాడికి సారీ చెప్పారని వైట్ హౌస్ తెలిపింది. ఈ దాడులు ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని నెతన్యాహు అంగీకరించారు. వైమానిక దాడుల్లో చనిపోయిన ఖతార్ భద్రతా సిబ్బందిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేసారని వైట్‌హౌస్‌ వర్గాలు […]
Read more

తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం ఐదు దశల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి (MCC) తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇది అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల […]
Read more

ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం !

తిరువనంతపురం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌-SIRను వ్యతిరేకిస్తూ కేరళ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు కొన్ని సవరణలను సూచించారు, వాటిలో కొన్నింటిని తీర్మానం ఆమోదించడానికి ముందే ఆమోదించారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించేవారు SIR ప్రక్రియను ఉపయోగించుకోవచ్చని, ఇది ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. “ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఇటువంటి చర్యలను ధిక్కరిస్తూ, ఎన్నికల […]
Read more

తమిళనాడు తొక్కిసలాట ఘటనలో 40కి పెరిగిన మృతుల సంఖ్య…విజయ్ ఇంటి ముందు నిరసన!

చెన్నై: టీవీకే పార్టీ చీఫ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. 60 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు, కనీసం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి, బిజెపికి చెందిన నైనార్ నాగేంద్రన్, కె అన్నామలై, విసికె చీఫ్ తోల్ తిరుమావళవన్, పిఎంకె అగ్ర నాయకుడు అన్బుమణి రామదాస్ […]
Read more

గాజా హింస భయపెట్టింది…ఆస్కార్‌ అవార్డీ జెన్నిఫర్ లారెన్స్!

న్యూయార్క్‌: ఆస్కార్ అవార్డు గ్రహీత అమెరికా నటి జెన్నిఫర్ లారెన్స్ గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ (యుఎస్)లో రాజకీయ నిజాయితీ లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కొత్త చిత్రం డై, మై లవ్‌ను ప్రమోట్ చేస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గాజా హింసను చూసి”నేను భయపడ్డాను, అది ఎంతో బాధాకరం” అని లారెన్స్ విలేకరుల సమావేశంలో ఆమె అన్నారు. గాజాలో […]
Read more

నా భర్త అరెస్ట్‌ కోసం నాలుగేళ్ల క్రితమే వేట మొదలయింది…సోనమ్‌వాంగ్‌చుక్‌ భార్య ఆరోపణలు!

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు. తన భర్తను లడఖ్ నుండి తీసుకెళ్లిన అధికారులెవరి నుండి తనకు ఎటువంటి సమాచారం రాలేదని, 48 గంటలకు పైగా గడిచిందని ఆంగ్మో చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో వాంగ్‌చుక్‌ కోసం కేంద్రం వేట మొదలెట్టిందని ఆంగ్మో ఆరోపించారు. అంతేకాదు తమ లాభాపేక్షలేని సంస్థల్లో ఒకటైన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, […]
Read more

ఇరాన్‌పై ఆంక్షలను ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి!

న్యూయార్క్‌: ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆంక్షలు విధించింది. ఈమేరకు “సెప్టెంబర్ 27న రాత్రి 8 గంటలకు భద్రతా మండలి తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా, ఇరాన్‌ చేపడుతున్న అణు కార్యక్రమం నేపథ్యంలో దానిపై ఆంక్షలు విధించాలని బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు అంతకుముందు భద్రతా మండలిని కోరాయి. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్‌ను నిరోధించేందుకు ఉద్దేశించిన 2015 నాటి సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై (JCPOA) ఈ మూడు యూరోపియన్‌ దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందం […]
Read more

ఆసియాకప్‌ విజేత భారత్‌…ట్రోఫీని అందుకోని టీమ్‌ఇండియా!

దుబాయ్‌: ఆసియా కప్‌లో భారతజట్టు విజేతగా నిలిచింది. ఆ గెలుపు తర్వాత మైదానంలో పెద్ద హైడ్రామా నడిచింది. బహుమతి ప్రధానోత్సవంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా కప్ 2025 ట్రోఫీ గెలిస్తే.. ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) ఛైర్మన్, పీసీబీ ఛైర్మన్, పాకిస్తాన్ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు. దాంతో వేదికపైకి వచ్చిన నక్వీ.. టీమిండియా ప్లేయర్లు టైలిల్ అందుకోవడానికి రాకపోవడంతో ట్రోఫీ ఇవ్వకుండానే […]
Read more
1 4 5 6 7 8 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.