Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 మధ్య యూకే, యూఎస్, కెనడాలలో పర్యటించే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. పరిశ్రమల అధిపతులతో అపాయింట్‌మెంట్లు ఖరారైన తర్వాత, వారం రోజుల్లో పర్యటన వివరాలు ఖరారవుతాయని సీఎంఓ వర్గాలు తెలిపాయి. బహుళజాతి సంస్థలు, ప్రపంచ ఆర్థిక సంస్థలు, ప్రవాస భారతీయులపై దృష్టి సారించి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన ఉండనుంది. తెలంగాణను ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానంగా […]
Read more

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు నేడు పునఃప్రారంభం!

వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్ మధ్య ఈరోజు దౌత్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయి. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… హర్ముజ్ జలసంధి, ఇరాన్ “అణు నిరాయుధీకరణ”పై త్వరలోనే ఒక ఒప్పందం కుదరవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వెళ్తున్న మార్గంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ… సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాన్‌లతో జరిపిన సంభాషణల కారణంగానే శుక్రవారం జరగాల్సిన “భారీ దాడి”ని రద్దు చేసుకున్నానని ట్రంప్ […]
Read more

ఏపీలో ఎస్‌ఐఆర్‌… దాదాపు 45 లక్షల ఓటర్ల తొలగింపు!

అమరావతి: ప్రత్యేక విస్తృత సవరణ (SIR) అనంతరం, ధృవీకరణ ప్రక్రియ తర్వాత దాదాపు 45 లక్షల పేర్లను తొలగించి, ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకారం… 44.89 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. వీరిలో, 22.30 లక్షల మంది శాశ్వతంగా నివాసం మార్చుకున్నారని లేదా ధృవీకరణ సమయంలో అందుబాటులో లేరని, 15.22 లక్షల మంది మరణించినట్లు గుర్తించారని, 7.37 […]
Read more

తనను తిట్టినవారిని ‘క్షమిస్తున్నట్లు’ మోదీ సెల్ఫీ వీడియో!

న్యూఢిల్లీ: ఢిల్లీలో అతిపెద్ద నిరసనగా మారిన యువత ఆందోళన, దాని కారణంగా తన మంత్రివర్గం నుండి ఒకరు రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. మహిళా నిరసనకారులు దూషణలకు పాల్పడటం పట్ల ఆయన “దిగ్భ్రాంతి” వ్యక్తం చేస్తూ, అటువంటి “దారి తప్పిన పిల్లలను” క్షమించాలనుకుంటున్నట్లు చెప్పారు. జూలై 20న పార్లమెంటు వైపు సాగిన నిరసన ర్యాలీని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబ్బంది పెల్లెట్ గన్‌ల వంటి బలప్రయోగం చేయడం […]
Read more

అమెరికా దాడులు కొనసాగుతాయి…ఇరాన్ ‘ధ్వంసం’ కావటం ఖాయమన్న ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌పై తమ సైనిక చర్యను కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐదు నెలల నిరంతర దాడులతో టెహ్రాన్ “నాశనమైందని” పేర్కొంటూ, అణ్వాయుధాన్ని సంపాదించడానికి దానిని ఎప్పటికీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. క్యాంప్ డేవిడ్‌లో జరిగిన మొదటి టెలివిజన్ ప్రసారిత క్యాబినెట్ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ… ఇరాన్ తన నౌకాదళం, వైమానిక దళం, వాయు రక్షణ సామర్థ్యాలలో చాలా వరకు కోల్పోయిందని, అయినప్పటికీ కొంత పరిమిత సైనిక బలాన్ని నిలుపుకుందని ట్రంప్ అన్నారు. […]
Read more

తెలంగాణ కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న గల్ఫ్ ఉద్యోగ మోసాలపై సీఎం రేవంత్ హెచ్చరిక!

హైదరాబాద్: మధ్యప్రాచ్య దేశాలలో ఉపాధి కోసం వెళ్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఏజెంట్ల మోసాలకు తరచుగా గురవుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు సహాయపడటంతో పాటు, పాస్‌పోర్ట్‌లు పొందడంలో కూడా వారికి తోడ్పడేందుకు, గమ్య దేశాల్లోని మ్యాన్‌పవర్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారులను కోరారు. విదేశాలలో కార్మికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, అటువంటి ఒప్పందాలు టామ్‌కామ్‌కు జోక్యం చేసుకోవడానికి, […]
Read more

అమెరికాలో పని చేయడానికి లక్షడాలర్ల రుసుమా? భారతీయ విద్యార్థుల H-1B కలలకు ట్రంప్ షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వారిపై ఏకంగా లక్షడాలర్లు ఫీజు విధించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే, అమెరికాలో కెరీర్ నిర్మించుకోవడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకునే H-1B మార్గాలలో ఒకదానికి ఇది అడ్డుకట్ట వేయవచ్చు. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం… “ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్” (OPT) వర్క్ పర్మిట్‌కు భారీ రుసుమును (ఆరు అంకెల మొత్తాన్ని) […]
Read more

అస్సాం వరదలు…78కి చేరిన మృతుల సంఖ్య!

గౌహతి: భారీ వర్షాలు, వరదల ధాటికి అస్సాం అల్లకల్లోలమైంది. ఇప్పటికే మృతుల సంఖ్య 78కి చేరింది. మూడు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) ప్రకారం, గత 24 గంటల్లో శివసాగర్‌లో ఇద్దరు, గోలాఘాట్‌లో ఒకరు చొప్పున మరో ముగ్గురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,00,031 మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. 1,37,561 మంది ప్రభావితం కావడంతో ‘చరైడియో’ జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతంగా నిలిచింది; ఆ […]
Read more

ఇజ్రాయెల్‌కు భారత్‌ ఆయుధాలు…గాజా మారణహోమానికి దారితీస్తాయన్న ఆమ్నెస్టీ!

న్యూయార్క్‌: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మారణహోమంలో…భారత ఆయుధాలను ఉపయోగించే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, మనదేశం ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉందని జూన్ 30న విడుదల చేసిన ఒక కొత్త నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ‘మేడ్ ఇన్ ఇండియా: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు-మందుగుండు సామగ్రి సరఫరా’ అనే శీర్షికతో ఉన్న ఈ నివేదిక, ఇజ్రాయెల్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే పెద్ద ఇజ్రాయెల్ కంపెనీలకు భారతీయ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాలు, ఇతర పరికరాలు రవాణా […]
Read more

‘జెన్-జెడ్’ బాటలో మధ్యప్రదేశ్ రైతులు…ప్రభుత్వంపై దండయాత్ర!

భోపాల్‌: జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే ఒత్తిడి చేసిందో, అలాగే రైతులు చేపట్టిన ఆకస్మిక నిరసన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా దిగివచ్చేలా చేసింది. మొన్న సాయంత్రం వేళ మూడు ప్రధాన డిమాండ్లతో వేలాది మంది రైతులు రాష్ట్ర రాజధాని భోపాల్‌కు చేరుకున్నారు. రాజధానిలో వారం రోజుల పాటు గడిపేందుకు ఏకంగా సరుకులతో వచ్చి, పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ముఖ్యమంత్రి నివాసం వద్దకు […]
Read more
1 2 3 4 5 6 214

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.