Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మరాఠా కోటా ఆందోళన…ముంబై రోడ్లను క్లియర్ చేయమన్న బాంబే హైకోర్టు!

న్యూఢిల్లీ: మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే-పాటిల్, అతని మద్దతుదారులు ముంబైలో అన్ని వీధులను ఖాళీ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా…సాధారణ స్థితిని పునరుద్ధరించాలని నిన్న బాంబే హైకోర్టు ఆదేశించింది. OBC కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠా సమాజానికి 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29 నుండి ఆజాద్ మైదాన్‌లో జరంగే-పాటిల్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన మద్దతుదారుల ప్రకారం, ఆయన ఇప్పుడు నీరు తాగడం మానేశారు. ఈ […]
Read more

పాఠశాలలను మత ఘర్షణలకు వేదికలుగా మార్చకండి!

అహ్మదాబాద్: ఆగస్టు 19న అహ్మదాబాద్‌లో 10వ తరగతి విద్యార్థిని తన పాఠశాలలోనే కత్తిపోటుకు గురయ్యాడు. ఇది ఒక విషాద క్షణం. ఇలాంటి సమయంలో బాధితుడి పట్ల శ్రద్ధ వహించాలని, పాఠశాల నుండి జవాబుదారీతనం తీసుకోవాలని, యువతలో హింసను ఎలా నిరోధించవచ్చో ఆలోచించాలని డిమాండ్ చేయాలి. అయితే అందుకు బదులుగా, ఈ సంఘటనను హిందూత్వ గ్రూపులు ద్వేషపూరిత ఆయుధంగా మార్చాయి. ఇద్దరు విద్యార్థులు వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ త్వరగా కత్తిపోట్లను […]
Read more

ఓట్లచోరీపై మోడీ బండారం బయటపెడతా…రాహుల్‌ గాంధీ!

పాట్నా: బీహార్‌లో 1,300 కిలోమీటర్లపాటు సాగిన “ఓటర్ అధికార్ యాత్ర” ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మాటల దాడి చేశారు. బీజేపీ ఓట్‌ చోరీ చేసిందని పునరుద్థాటించారు. త్వరలోనే మోడీ బండారం బయటపెడతానని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని […]
Read more

జాతి హింస జరిగిన రెండేళ్లకు తొలిసారి మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ?

న్యూఢిల్లీ: మణిపూర్‌ రాష్ట్రంలో మెయిటీ – కుకి వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మొదట మిజోరంకు కొత్త బైరాబి-సైరాంగ్ రైల్వేను ప్రారంభిస్తారు. తర్వాత ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుండి మణిపూర్‌కు ప్రధాని వస్తారని తమకు సమాచారం అందిందని మిజోరం ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు తెలిపారు. అయితే, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా […]
Read more

నా కొడుకు శవపేటికలో తిరిగి వస్తే నెతన్యాహుపై కేసువేస్తానంటున్న గాజా బందీ తల్లి!

టెల్‌అవీవ్‌: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రణాళిక వేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా మొదలెట్టే దాడి కారణంగా బందీగా ఉన్న తన కొడుకు మరణిస్తే నెతన్యాహుపై విచారణ జరపాలని కోరతానని ఓ తల్లి ప్రతిజ్ఞ చేసింది. నెతన్యాహు గాజా స్ట్రిప్‌ను ఆక్రమించాలని ఎంచుకుంటే, అది బందీలను, ప్రియమైన సైనికులను ఉరితీయడం అవుతుంది” అని బందీగా ఉన్న మతన్ జాంగౌకర్ తల్లి ఐనవ్ జాంగౌకర్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో, పాలస్తీనా భూభాగంలో కాల్పుల విరమణ, బందీల విడుదల […]
Read more

వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న మరాఠా కోటా నిరసన…ప్రభుత్వ జోక్యం కోరుతున్న వ్యాపారులు!

ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా ఆందోళనపై అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ ముంబైలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, దీర్ఘకాలిక నష్టం నుండి వ్యాపారాలను రక్షించడానికి ప్రభుత్వం లేదా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న భారీ రిజర్వేషన్‌ ఉద్యమం దక్షిణ ముంబైని పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందని, దుకాణాలు, మార్కెట్లలో వారాంతపు అమ్మకాలను ప్రభావితం చేసిందని రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA) అధ్యక్షుడు వీరేన్ షా అన్నారు. “ముంబై హైజాక్ అయినట్లు […]
Read more

ఇజ్రాయెల్ ముట్టడిని ఛేదించేందుకు బార్సిలోనా నుండి గాజాకు బయలుదేరిన నౌక!

బార్సిలోనా: గాజాపై ఇజ్రాయిల్ దిగ్బంధనను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా అతిపెద్ద పడవ…గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిన్న బార్సిలోనా ఓడరేవు నుండి బయలుదేరింది. దీంతో పాటు మొత్తం 20 పడవలు మానవతా సాయం తీసుకొని ఆదివారం బార్సిలోనా నుండి గాజా స్ట్రిప్‌కు బయలుదేరాయి. ఈ 20 నౌకల్లో 44 దేశాల నుండి 300 మందికి పైగా ప్రతినిధులు ఈ పడవల్లో గాజాకు పయనమయ్యారు. ఈ బృందం కరువును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు కీలకమైన మానవతా సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. […]
Read more

అసెంబ్లీలో ఘోష్ నివేదిక…వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్‌!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదికపై సభలో తమ వాదన వినిపించడానికి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్‌ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆరోపించారు. తమ నేత హరీశ్‌రావు ఒకరు మాట్లాడితే.. సీఎం సహా మంత్రులంతా అబద్ధాలు చెప్పారన్నారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతామని, ఆ ప్రాజెక్టును […]
Read more

ఇకనుంచి భారత్‌-చైనా ప్రత్యర్థులు కాదు…అభివృద్ధి భాగస్వాములు!

బీజింగ్‌: అమెరికా, భారత్‌ మధ్య కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ… భారత్​, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములే కానీ, ప్రత్యర్థులు కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని మోదీ, జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: గత BRS హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐకి అప్పగిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…అంతర్రాష్ట్ర సమస్యలు, వివిధ కేంద్ర, ప్రభుత్వ విభాగాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సముచితమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా ప్రాజెక్టు రూపకల్పన, […]
Read more
1 63 64 65 66 67 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.