Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

యూరియా కొరతపై మాటల యుద్ధం…కేంద్రం vs రాష్ట్రం!

హైదరాబాద్: తెలంగాణ అంతటా, అది కూడా ఖరీఫ్ సీజన్‌లో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడటంతో, రాష్ట్రం-కేంద్రం మధ్య అనాలోచిత మాటల యుద్ధం మొదలైంది. వేలాది మంది రైతులు రాజకీయాల సుడిగుండంలో చిక్కుకుని, అవసరమైన ఎరువుల సరఫరా కోసం కష్టపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘తగినంత నిల్వలను అందించడంలో విఫలమైనందుకు’ కేంద్రాన్ని నిందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరానికి మించి రాష్ట్రానికి యూరియా అందించామని నమ్మబలుకుతోంది. భారతదేశంలో చౌకైన, విస్తృతంగా ఉపయోగించే ఎరువు యూరియా మాత్రమే. ఇది ఆహార ధాన్యాల […]
Read more

రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను ఢీకొట్టిన ఉక్రెయిన్ డ్రోన్లు!

మాస్కో: రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. మంటలు చెలరేగాయి, దీని ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింది. ఫలితంగా రియాక్టర్లలో ఒకదాని ఉత్పత్తి 50 శాతం తగ్గిందని ప్లాంట్ ప్రెస్ సర్వీస్‌ను ఉటంకిస్తూ అనడోలు ఏజెన్సీ నివేదించింది. అనడోలు వార్తా ఏజెన్సీ ప్రకారం, రష్యన్ వైమానిక రక్షణలు అర్ధరాత్రి (స్థానిక సమయం) సమయంలో డ్రోన్‌ను అడ్డగించాయని, ఆ ప్రదేశంలోనే పేలుడు సంభవించిందని ప్లాంట్ టెలిగ్రామ్‌లో ప్రకటించింది. ఎవరికీ గాయాలు […]
Read more

యెమెన్ రాజధాని ‘సనా’ లక్ష్యంగా వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్!

సనా: ఇరాన్ మద్దతుగల తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులను ప్రయోగించిన కొద్ది రోజులకే, నిన్న తెల్లవారుజామున యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని స్థానిక మీడియా నివేదిక తెలిపింది. హౌతీల నేతృత్వంలోని అల్-మసిరా ఛానల్ ఈ దాడులను దృవీకరించింది. గత కొంతకాలంగా రెడ్‌ సీలో, అడెన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరుపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి హౌతీ దాడులు ఇజ్రాయెల్‌కు, […]
Read more

గర్భిణీ భార్యను హత్యచేసి…శరీర భాగాలను మూసీలో పడేసిన భర్త!

హైదరాబాద్: ఐదు నెలల గర్భవతి అయిన మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత మేడిపల్లిలోని వారి ఇంట్లో ఆమె శరీర భాగాలను నరికి, మూసీ నదిలో విసిరేశాడని పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రైడ్ హెయిలింగ్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల నిందితుడు కుటుంబ కలహాల కారణంగా తరచుగా జరిగే గొడవల కారణంగా తన 21 ఏళ్ల భార్యను గొంతు కోసి హత్య […]
Read more

పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం!

హైదరాబాద్: చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సీఐవో) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘మట్టిలో చేతులు-మనసులో దేశం’ కార్యక్రమం ముగింపు సమావేశం ఛత్తాబజార్ లోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ ముగింపు సభకు జమాఅతె ఇస్లామీహింద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబష్షిర్ అధ్యక్షత వహించారు. పచ్చదనం పెరిగితేనే ప్రాణవాయువు పెరుగుతుందని, పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం అని చిన్నారులు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా నగరవ్యాప్తంగా చిన్నారులు 2వేల మొక్కలు నాటామని అన్నారు. […]
Read more

దేశంలో 40% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్‌ రిపోర్ట్‌!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పది మంది ముఖ్యమంత్రులలో నలుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. 12 మంది ముఖ్యమంత్రులు (40%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, 10 మంది (33%) హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపు వంటి […]
Read more

గాజాలో కాల్పుల విరమణ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో భారీ నిరసన!

న్యూఢిల్లీ: గాజా ప్రజలకు సంఘీభావంగా, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఖండిస్తూ… దేశ రాజధానిలో భారీ ప్రదర్శన జరిగింది. ఈ నిరసనలో విభిన్నవర్గాల నేతలు పాల్గొన్నారు. పెరుగుతున్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, పరిసర రాష్ట్రాల నుండి విద్యార్థులు, పౌర సమాజ కార్యకర్తలు,రాజకీయ – మత నాయకులతో సహా వందలాది మంది పౌరులు ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనాకు మద్దతు ప్రకటించే విషయంలో మతపరమైన, సైద్ధాంతిక సరిహద్దులను అధిగమించి శాంతి, న్యాయం పట్ల […]
Read more

ఇజ్రాయెల్ ఆంక్షల ప్రతిష్టంభనపై డచ్ విదేశాంగ మంత్రి రాజీనామా!

ఆమ్‌స్టర్‌డామ్: గాజాలో సైనిక దాడికి సంబంధించి ఇజ్రాయెల్‌పై అదనపు ఆంక్షలకు క్యాబినెట్ మద్దతు పొందడంలో విఫలమైన తర్వాత డచ్ విదేశాంగ మంత్రి కాస్పర్ వెల్డ్‌క్యాంప్ రాజీనామా చేశారు. సెంటర్-రైట్ న్యూ సోషల్ కాంట్రాక్ట్ పార్టీ సభ్యుడు వెల్డ్‌క్యాంప్ మాట్లాడుతూ…”అర్థవంతమైన చర్యల”పై తాను ఒప్పందం కుదుర్చుకోలేకపోయానని, ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలపై సహచరుల నుండి పదేపదే ప్రతిఘటనను ఎదుర్కొన్నానని అన్నారు. పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపించడంలో సెటిలర్స్‌ పాత్రను పేర్కొంటూ, ఇజ్రాయెల్ మంత్రులు బెజలెల్ స్మోట్రిచ్, ఇటామర్ బెన్-గ్విర్‌లపై తమదేశంలోకి […]
Read more

‘ఫ్రీడమ్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్‌ ప్రారంభం!

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుండి గతంలో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక ఫ్రీడమ్ ప్రెస్… తన ఢిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించింది. తద్వారా దేశ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించింది. మీడియాలో నీతి, స్వాతంత్ర్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో…ఫ్రీడమ్‌ ప్రెస్‌ వార్తాపత్రిక స్వేచ్ఛ, వాక్‌ స్వాత్యంత్య్రం, పారదర్శకత, జర్నలిజం విలువలను నిలబెడతామని ప్రతిజ్ఞ చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పౌర సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుక అహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రజాస్వామ్యం, […]
Read more

ప్రధాని మోదీ గయ పర్యటనపై మండిపడ్డ లాలూ యాదవ్!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయలో పర్యటించడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయ వివాదం మరింత తీవ్రమైంది. ఈమేరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “గయ పిండ్ దానానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయకు వస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పేదలు, వెనుకబడిన ప్రజలకు ఓటు హక్కును ఈ […]
Read more
1 83 84 85 86 87 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.