Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పాఠశాలలకు హాఫ్‌ డే సెలవు!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో భారీ వర్షపాతం అంచనాతో తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ హాప్‌ డే సెలవులు ప్రకటించారు. వాతావరణ నివేదిక ప్రకారం, రెండు రోజుల్లో GHMC పరిమితుల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రత, రవాణా సమస్యల కారణంగా ఈ తేదీలలో ఉదయం షిఫ్ట్ సమయంలో మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని విద్యా శాఖ […]
Read more

యూపీలో పదహారో శతాబ్దం నాటి సమాధిని ధ్వంసం చేసిన హిందూత్వ మూక!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో నిన్న ఉద్రిక్తత చెలరేగింది. హిందూ మితవాద గ్రూపుల సభ్యులు లాఠీలతో ఆయుధాలు ధరించి నవాబ్ అబ్దుల్ సమద్ ఖాన్ సమాధిని పురాతన ఆలయం పైన నిర్మించారని పేర్కొంటూ దానిపై దాడి చేసి ధ్వంసం చేశారు. హిందువుల దాడికి సంబంధించిన వీడియో లింక్ https://www.instagram.com/reel/DNNW4ANJ5gP/?igsh=MTQyNTB4ZnY0eG45eg== ఖస్రా నంబర్ 753 కింద అధికారికంగా మక్బారా మాంగి (జాతీయ ఆస్తి)గా నమోదయిన నిర్మాణం ఇది. ప్రభుత్వ రికార్డులలో ఔరంగజేబు చక్రవర్తి పాలనలో పైలానీ ఫౌజ్‌దార్ అయిన […]
Read more

హిందూత్వ ప్రయోగశాలగా మారుతున్న ఛత్తీస్‌గఢ్!

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు సన్యాసినులు – సిస్టర్ ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, గిరిజన యువకుడు సుఖ్‌మాన్ మాండవిపై బజరంగ్ దళ్ సభ్యులు దాడి చేస్తే, వారిపై కేసు పెట్టకుండా… బాధితులపై బలవంతపు మత మార్పిడి, మానవ అక్రమ రవాణా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు? ఛత్తీస్‌గఢ్‌లో… క్రైస్తవ మిషనరీలు,సన్యాసినులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రకటనలు చేస్తోంది, అయితే కేరళలో అందుకు భిన్నంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడి నన్‌లకు మద్దతుగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏమో […]
Read more

“విపక్షం డిజిటల్ డేటా కోరితే…ఈసీ పేపర్ డేటా ఇస్తుంది”…డీఎంకే ఎంపీ కనిమొళి!

న్యూఢిల్లీ: నేడు దేశంలో నెలకొన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థితిపై డీఎంకే ఎంపీ కనిమొళి విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య బిల్లులు ఆమోదిస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు అనుమతి లేదు అంటూ ఆమె వాపోయారు. ఓట్ల చోరీపై నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె విలేకర్లతో ఈమాటలన్నారు. “ఇది మేము మాట్లాడుతున్న ఒక విషయం మాత్రమే కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి పార్లమెంటులో చర్చ జరపాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, […]
Read more

గాజా ప్రజల బాధలను నెతన్యాహు ‘పట్టించుకోవడం లేదు’… ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్!

సిడ్నీ: ఆస్ట్రేలియా మొదటిసారిగా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తుందని ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై మండిపడ్డారు. గాజాలో ప్రజల కష్టాలను నెతన్యాహు ‘పట్టించుకోవడం లేదని’ విమర్శించారు. వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనా దేశాన్ని ఆస్ట్రేలియా గుర్తిస్తుందని అల్బనీస్ నిన్న ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఫ్రాన్స్, యూకే, కెనడాల సరసన ఆస్ట్రేలియా కూడా చేరినట్లైంది. […]
Read more

సూక్ష్మ రుణాలు ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని వెల్లడించిన ఓ సర్వే!

హైదరాబాద్: సూక్ష్మరుణాలు ప్రధానంగా పేదరికాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, చిన్న మొత్తాలలో ఇచ్చే రుణాలు. ఇవి వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ రుణాలను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఓ సర్వేలో తేలింది. మచ్చుకు కొన్ని కొన్ని కేస్‌ స్టడీస్‌ను పరిశీలిస్తే మనకీ విషయం అర్థమవుతుందని సర్వే సంస్థ చెబుతోంది. ఉషారాణి ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకు రుణం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము […]
Read more

ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ ఇండియా కూటమి ఎంపీల నిరసన ప్రదర్శన!

న్యూఢిల్లీ: నేడు ఇండియా కూటమిలోని దాదాపు 300 మంది ఎంపీలు…లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ హౌస్ నుండి ఉదయం 11:30 గంటలకు ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ మార్చ్ ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు దాదాపు ఒక కిలోమీటరు దూరం వరకు సాగనుంది. ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ, అలాగే బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని […]
Read more

‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ లక్ష్యంగా అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు!

న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం “ఆక్రమణలను” తొలగించడానికి వరుస తొలగింపులు చేపడతామని ప్రతిజ్ఞ చేస్తుండటంతో, రాజకీయ సామాజిక నిపుణులు ఈ చర్యను విమర్శించారు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ దీని లక్ష్యం అని అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై తమ ‘ఆందోళన’ వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల దాడి నుండి వారిని రక్షించడానికి వివిధ వర్గాల ప్రజలను అంతర్-రాష్ట్ర సరిహద్దుల బఫర్ జోన్లలోకి […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో ఐదుగురు అల్‌ జజీరా జర్నలిస్టుల మృతి!

గాజా: ఇజ్రాయెల్ అమానుష దాడులతో అల్లాడుతున్న గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మరణించారు. బాధితుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, అలాగే కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నారని ప్రసారకర్త తెలిపారు. అల్-షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల ప్రెస్ కోసం ఏర్పాటు చేసిన ఒక టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఏడుగురిలో […]
Read more

‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై రాహుల్‌కు నోటీసు జారీ చేసిన కర్ణాటక సీఈఓ!

బెంగళూరు: గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించిన పత్రాలను ఈసీకి సమర్పించాలంటూ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్నారు…ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని…. నోటీసుల్లో కర్ణాటక CEO తెలిపారు. రెండుసార్లు ఓటుకు సంబంధించి…రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీచేయలేదని […]
Read more
1 88 89 90 91 92 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.