Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇరాన్‌పై సైనిక చర్య అవసరం రాదని ఆశిస్తున్నాను…ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌పై సైనిక చర్యను నివారించాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్‌తో మరిన్ని చర్చలు జరపాలని తాను యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. “నా మొదటి పదవీకాలంలో నేను సైన్యాన్ని బలోపేతం చేశాను. ఇప్పుడు ఇరాన్ అనే ప్రదేశానికి ఒక బృందం బయలుదేరి వెళ్తోంది. ఆ సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నాను” అని తన భార్య మెలానియా గురించిన ఒక డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా ట్రంప్ విలేకరులతో […]
Read more

భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం వాషింగ్టన్‌కు ఓ హెచ్చరిక!

వాషింగ్టన్: భారతదేశం-యూరోపియన్ యూనియన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత వాషింగ్టన్ అసంతృప్తితో స్పందించింది. ఈమేరకు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, ఉన్నతాధికారులు, విధాన నిపుణులు అమెరికా పక్కన పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో, న్యూఢిల్లీ, బ్రస్సెల్స్ ప్రపంచ వాణిజ్య, వ్యూహాత్మక అమరికలను పునర్నిర్మిస్తాయని వారు భయపడుతున్నారు. ఈ ఒప్పందం వాషింగ్టన్ వాణిజ్య విధానంతో అమెరికా మిత్రదేశాలలో పెరుగుతున్న నిరాశను ప్రతిబింబిస్తుందని సెనేటర్ మార్క్ కెల్లీ అన్నారు. “EU భారతదేశంతో వాణిజ్య, భద్రతా […]
Read more

తమ దేశ మహిళనే ఇరాన్‌లో చనిపోయిన నిరసనకారిగా చూపించిన ఇజ్రాయెల్‌ మీడియా!

టెల్‌అవీవ్‌: ఇరాన్ నిరసనలలో మరణించిన బాధితులలో ఒకరిగా జాతీయ టెలివిజన్ ప్రసారంలో తనను తాను చూసుకున్న ఇజ్రాయెల్ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నోయా జియాన్‌గా గుర్తింపు పొందిన ఆ మహిళ సోమవారం, ఈ విషయాన్ని జనవరి 26న ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పోస్ట్ చేసింది. “ఇరాన్‌లో నిరసనలలో యూదుల్ని చంపేశారు” అనే శీర్షికతో తన ఫోటోను ఉపయోగించి ఒక వార్తా ప్రసార ఛానెల్‌ను చూపించడం… మీడియా విశ్వసనీయతపై ఆందోళనలను రేకెత్తించింది. వీడియోపై “ఇది నా 2026 బింగోలో […]
Read more

పాలస్తీనాను గాజా శాంతి మండలిలో చేర్చండి…బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా!

రియోడిజనీరో: గాజా వివాద పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న ‘శాంతి మండలి’లో పాలస్తీనాకు స్థానం కల్పించాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఈమేరకు ఇద్దరు నేతల మధ్య ఫోన్‌ సంభాషణ జరిగిందని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. తదుపరి చర్చల కోసం ఇరు దేశాల అధినేతలు వాషింగ్టన్‌లో కలవడానికి అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ 50 నిమిషాల ఫోన్‌ సంభాషణలో… ట్రంప్ ప్రతిపాదించిన ఈ మండలి పరిధిని గాజాకు పరిమితం చేయాలని, […]
Read more

గాజాలో ఇజ్రాయెల్‌ క్రూరత్వాన్ని చూసేందుకు నిరాకరిస్తున్న ప్రపంచం!

✒️…మసూద్ అబ్దాలి హ్యూస్టన్(USA): గాజాలో జరుగుతున్న అణచివేత మొత్తం ప్రపంచం మనస్సాక్షికి ఒక వేదనగా మారింది. బహిరంగ ఆకాశం కింద తల్లుల ఛాతీకి అతుక్కుని, ఎముకలు కొరికే చలిలో గడ్డకట్టిన చిన్నారుల పువ్వులాంటి శరీరాలను చూడటం ఉరితీసేవారిని సైతం ఉలిక్కిపడేలా చేస్తుంది. మరోవంక అంబులెన్సులపై బాంబు దాడులు రోగులను సజీవ దహనం చేస్తాయి. టెంట్లపై డ్రోన్ దాడులు శిశువులపై బూడిద లాంటి అవశేషాలను వెదజల్లుతాయి… ఇటువంటి దృశ్యాలు అత్యంత రాతి హృదయులకు కూడా కన్నీళ్లు తెప్పించడానికి సరిపోతాయి. […]
Read more

భారత్‌లో హసీనా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బంగ్లాదేశ్‌!

ఢాకా: బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాను ఓ బహిరంగ సభలో ప్రసంగించడానికి భారత్‌ అనుమతించడంపై బంగ్లాదేశ్ మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. అంతేకాదు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడం పట్ల తాము “ఆశ్చర్యపోయామని” “దిగ్భ్రాంతికి గురయ్యామని” ఢాకాలోని బీఎస్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. “ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య పరివర్తనకు శాంతి భద్రతలకు స్పష్టంగా ప్రమాదం కలిగిస్తుందని” బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన […]
Read more

ట్రంప్ ప్రతిపాదిత గాజా విజన్‌… సమాధులపై నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్!

దావోస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని అల్లుడు, మిడిల్ ఈస్ట్ సలహాదారు జారెడ్ కుష్నర్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో “ఫ్రీ మార్కెట్ గాజా” విజన్‌ను ప్రదర్శించారు. ఈ విజువల్స్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌ను పోలి ఉండడంతొ తీవ్ర విమర్శలకు గురయ్యాయి ట్రంప్ “బోర్డ్ ఆఫ్ పీస్” కోసం చార్టర్‌పై సంతకం చేసాక కుష్నర్ మాట్లాడుతూ… ఫ్రీ మార్కెట్ గాజా విజన్‌కు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసమని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించే మార్గాన్ని కనుగొనడానికి […]
Read more

జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల దగ్గర 43 శాతం సంపద ఉంది…ఆక్స్‌ఫామ్ నివేదిక!

న్యూఢిల్లీ: నేడు బిలియనీర్ల సంపద స్థాయి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉంది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 3,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక తెలిపింది. 2020 నుండి సంపన్నుల ఆస్తులు విపరీతంగా పెరగగా, పేదరికం నిర్మూలనకు ఇంకా 200 ఏళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్త అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పేర్కొంది. జనాభాలో […]
Read more

ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుండి ఇంటికి వస్తున్న 5 ఏళ్ల బాలుడిని ఫెడరల్ ఏజెంట్లు అతని తండ్రితో పాటు టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. బాలుడిని ‘ఎర’గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుండగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ఆరోపణలను ఖండించింది. ఫెడరల్ ఏజెంట్లు […]
Read more

అదానీకి ఈమెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్‌ సెక్యూరిటీస్‌ కమిషన్‌!

న్యూఢిల్లీ: విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసే అధికారాన్ని భారతదేశం సవాలు చేసిన తర్వాత… దౌత్య మార్గాలను దాటవేసి… గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు US న్యాయవాది… ఇమెయిల్ ద్వారా సమన్లను అనుమతించాలని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సమన్లను భారతదేశం ద్వారా పంపడానికి SEC ప్రయత్నించింది, కానీ భారత ప్రభుత్వం 14 నెలలుగా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హాగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు పంపేందుకు భారత్ సహకరించడం […]
Read more
1 2 3 4 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.