Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘హజ్’లో (AI) ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌!

ఈ ఏడాది హజ్ యాత్రలో సౌదీ అరేబియా సాంకేతికతకు పెద్దపీట వేసింది. మనారహ్ 2 అనే ఏఐ రోబోను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది హజ్ యాత్రికులకు మార్గనిర్దేశం చేయనుంది. ఈ రోబో అరబిక్, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం, ఉర్దూ భాషల్లోనూ మాట్లాడగలదు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది అల్లాహ్ అతిథులుగా మక్కాకు వచ్చే హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా ఆతిథ్యమిస్తోంది. అందుకోసం అత్యాధునిక ఏర్పాట్లను చేసింది. ఈ సారి, మక్కా – మదీనా లోని పవిత్ర […]
Read more

గాజాలో 240 ఇళ్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం!

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం తన దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ఈ వారం రోజుల్లోనే గాజా స్ట్రిప్‌లో 240కి పైగా ఇళ్లను కూల్చివేసింది. అక్కడి ప్రజలను అక్కడినుంచి తరిమేసేందుకు, పాలస్తీనియన్‌ సమాజాలను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం నివేదించింది. నివాస భవనాలను లక్ష్యంగా చేసుకోవడం, “నగరాలను ఖాళీ చేయడం, జీవనోపాధిని నాశనం చేయడం, విస్తృత భయాన్ని, సామాజిక వెలివేతను సృష్టించడం లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయని గాజా […]
Read more

ఇకనుంచి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధ నేరాలపై నిరసన ప్రదర్శన చేయొచ్చు!

టెల్అవివ్ : గత వారం ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ గోలన్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… “ఒక వివేకవంతమైన దేశం పౌరులపై యుద్ధం చేయదు, ఒక అభిరుచిగా శిశువులను చంపదు. అక్కడి జనాభాను బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోదు” అని ప్రకటించి అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కాడు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని సూచించడం చాలా తీవ్రమైన వాదన కాదు. కాల్పుల విరమణ విఫలమైన తర్వాత మొదటి రెండు నెలల్లో […]
Read more

బంగ్లాదేశ్ కరెన్సీనోట్లపై షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటో తొలగింపు!

ఢాకా: ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లా జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నోట్లపై నుంచి తొలగించనున్నట్లు వార్తా సంస్థ ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. కాగా, ఆయన కుమార్తె షేక్ హసీనా గత సంవత్సరం ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత దేశం నుండి అనధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. […]
Read more

ఆపరేషన్‌ సిందూర్ సందర్భంగా పాక్‌లో మరణాలను ఖండించిన కొలంబియా… శశి థరూర్ నిరాశ!

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లో సంభవించిన మరణాలపై… కొలంబియా సంతాపం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నిరాశ వ్యక్తం చేసారు. దాయాది దేశంపై ఉగ్రవాదులను ఉసిగొల్పేవారికి, తమను తాము రక్షించుకునేవారికి మధ్య ఎటువంటి తేడా ఉండదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ బలమైన సంకల్పాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రపంచవ్యాప్త దౌత్య యుద్ధంలో భాగంగా ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు శశి థరూర్ కొలంబియాలో ఉన్నారు. “భారత దాడుల తర్వాత […]
Read more

గాజా విషాదంపై ఐక్యరాజ్యసమితిలో కన్నీళ్లు పెట్టుకున్న పాలస్తీనా రాయబారి!

న్యూయార్క్ : “ఇజ్రాయెల్‌ అమానవీయ దాడులు, ఆకలి మా పిల్లలను కబళిస్తున్నాయని” ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ విలపించారు, గాజాలో ఇజ్రాయెల్ సైనిక మారణకాండను ఖండించారు. పిల్లల ప్రాణనష్టం గురించి హృదయ విదారక కథనాలను పంచుకున్నారు. గాజాలో తీవ్రతరం అవుతున్న మానవతా సంక్షోభం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాలస్తీనా కుటుంబాల బాధలను వివరిస్తూ, ప్రసంగం మధ్యలో మన్సూర్ తన భావోద్వేగాలను అణచుకోవడానికి చాలా కష్టపడ్డారు. డజన్ల కొద్దీ పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. తల్లులు […]
Read more

ఈ ఏడాది అమెరికా నుండి 1080మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు…విదేశాంగ మంత్రిత్వ శాఖ!

న్యూఢిల్లీ : అగ్రరాజ్యాధిపతిగా డోనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అంటే జనవరి 2025 నుండి ఇప్పటిదాకా సుమారు 1080 మంది భారతీయులను అమెరికా నుండి బహిష్కరించారు. వారిలో దాదాపు 62 శాతం దాదాపు 62 శాతం మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారు. ఈమేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ…అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతున్నదని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని […]
Read more

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అంతటా హింసాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయేలీ సెటిలర్స్‌!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సెటిలర్స్‌ ఆగడాలు పెరిగాయి. పాలస్తీనియన్ల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. సైనికుల అండ చూసుకొని పేట్రేగిపోతున్నారు. వారి భూమిని స్వాధీనం చేసుకుని పాలస్తీనియన్‌లను బెదిరిస్తున్నారు. మే 25న, జెరిఖోలోని అల్-ఆజా జలపాతం ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెలీ సెటిలర్లు ఒకే రోజులో మూడు వేర్వేరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు దీర్ఘకాలంగా ఉన్న పాలస్తీనియన్ సమాజాలను ఖాళీ చేయించి, కొత్తగా అక్రమ నివాస స్థావరాన్ని స్థాపించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగం. కేవలం ఒక […]
Read more

వచ్చే ఏడాది నుంచి మద్య నిషేధంపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయనున్న సౌదీఅరేబియా!

రియాద్: సౌదీ అరేబియాలో 2026 నాటికి మద్యం అమ్మకం, వినియోగంపై 73 ఏళ్ల నిషేధాన్ని కఠినమైన లైసెన్సింగ్ వ్యవస్థ కింద ఎత్తివేయనున్నట్లు సమాచారం. రియాద్ ఎక్స్‌పో 2030, 2034లో ఫిఫా ప్రపంచ కప్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాల్లో భాగంగా సౌదీ ఈ ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా 1952 నుండి మద్య నిషేధాన్ని కొనసాగిస్తోంది. అక్కడి స్థానికులు, విదేశీయులు ఇద్దరూ ఆ దేశంలో మద్య సేవించడంపై నిషేధం ఉంది. అయితే […]
Read more

రోహింగ్యాలను సముద్రంలో వదిలివేసినట్లు వచ్చిన నివేదికలను ఖండించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 43 మంది రోహింగ్యా శరణార్థులను బలవంతంగా బహిష్కరించిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. “దేశం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మీరు ఊహాజనిత ఆలోచనలతో బయటకు వస్తారు” అని పేర్కొంది. పిటిషనర్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఇతరులు సమర్పించిన పత్రాల ప్రామాణికతను కూడా జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రోహింగ్యాలను ఇకపై బహిష్కరించకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది, ఇలాంటి ఉపశమనాన్ని కోర్టు గతంలో […]
Read more
1 26 27 28 29 30 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.