Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘అయోధ్య’ బీజేపీకి ‘లంక’గా మారుతుంది… అఖిలేష్ యాదవ్!

లక్నో: అయోధ్యలోని రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో కోట్ల రూపాయల కానుకలు, నగదు మాయమవడంపై స్పందిస్తూ.. అయోధ్య బీజేపీకి ‘లంక’గా మారుతుందని, తద్వారా వారి మతపరమైన భక్తి ప్రకటనల వెనుక ఉన్న డొల్లతనం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. రావణుడిని ఓడించడం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ‘రామచరితమానస్’లోని ‘లంక కాండం’ను ప్రస్తావిస్తూ, రామమందిరానికి సమర్పించిన నగదు, విలువైన వస్తువుల […]
Read more

ధర్మేంద్ర ప్రధాన్ యువతకు క్షమాపణ చెప్పాల్సిందే…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తన డిమాండ్‌ను ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. విద్యా వ్యవస్థలో పదేపదే జరుగుతున్న వైఫల్యాలకు బాధ్యత వహించకుండా, విద్యార్థులను “ఉగ్రవాదులు”గా ముద్ర వేస్తున్నారని ఆయన ప్రధాన్‌పై ఆరోపించారు. రాజకీయ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో, విద్య, ఉపాధి, అవకాశాల వంటి అంశాలపై విద్యార్థులు, యువతను చైతన్యపరిచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ అనే 40 రోజుల దేశవ్యాప్త […]
Read more

జాతి నిర్మూలన ద్వారా ఇస్లాం అంతమవుతుంది… హిందుత్వ నేత విద్వేష వ్యాఖ్యలు!

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక మతపరమైన సమావేశంలో అనిల్ యాదవ్ అనే హిందుత్వ నాయకుడు విద్వేష వ్యాఖ్యలు చేశారు. జాతి నిర్మూలన ద్వారా ఇస్లాం అంతం కావచ్చని, 1947 దేశ విభజనను ప్రస్తావించారు. ఈమేరకు జూన్ 23, మంగళవారం నాడు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో యాదవ్, కాషాయ వస్త్రాలు ధరించి, తిలకాలు పెట్టుకున్న భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లుగా ఉంది. ఆ వీడియోలో ఆయన ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, హిందూ సమాజాన్ని […]
Read more

అయోధ్య నిధుల దుర్వినియోగంపై స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, ‘అప్నా జనతా పార్టీ’ అధినేత స్వామి ప్రసాద్ మౌర్య… శ్రీరాముడు, అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ, మతపరమైన వివాదానికి కారణమయ్యారు. ఈమేరకు మౌర్య ఒక సభలో మాట్లాడుతూ… రామమందిరం పేరుతో “కోట్లాది రూపాయలు” దోచుకున్నారని ఆరోపించారు.”కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఆ దోపిడీదారులు రాముడి ఆలయం నుండే డబ్బును కాజేశారు. కానీ శ్రీరాముడు ఆ దోపిడీదారులను శిక్షించలేకపోతే, ఇక మీకు మేలు ఎలా చేయగలడు?” అని దైవ […]
Read more

యూపీలో కార్మికులపై అఘాయిత్యాలు…మానవ గౌరవంపై దాడిగా అభివర్ణించిన రాహుల్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో వెట్టిచాకిరి కార్మికులపై జరుగుతున్న హింస, దోపిడీని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనను “మానవ గౌరవంపై దాడి”గా అభివర్ణించారు. బాధితులకు న్యాయం, పునరావాసం కల్పించాలని, బాధ్యులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. మండి గ్రామంలోని ఒక పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌పై పోలీసులు దాడి చేసి, మైనర్లతో సహా 12 మంది వెట్టిచాకిరి కార్మికులను రక్షించిన […]
Read more

టీఎంసీ బ్యాంకు ఖాతాలపై నిఘా…ఐదేళ్ల లావాదేవీలపై సైబర్ పోలీసులు దర్యాప్తు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దోపిడీ వసూళ్లు, అక్రమ కమీషన్ డబ్బును మళ్లించడానికి ఈ ఖాతాలను ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవంక ఈ మూడుబ్యాంకు ఖాతాలపై బిధాన్నగర్ నగర పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర ఫోరెన్సిక్ పరీక్షను ప్రారంభించింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర 24-పరగణాల జిల్లాలోని బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ […]
Read more

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు… ఎన్‌జీఓ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి దెబ్బ!

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలకు కేంద్రం చేసిన సవరణలు, భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీఓలు), పౌర సమాజ సమూహాలపై ప్రభుత్వ నియంత్రణ ఆందోళనకరంగా పెరగడాన్ని సూచిస్తున్నాయి. అధికారికంగా పారదర్శకత, జవాబుదారీతనంపై దృష్టి సారించినప్పటికీ, ఈ మార్పుల విస్తృతి, ఎన్‌జీఓ రంగం స్వయంప్రతిపత్తిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన “షెడ్యూల్” నుండి ఎన్‌జీఓలు తమ ఉద్దేశ్యాలను, కార్యకలాపాల రంగాలను ఎంచుకోవాల్సి రావడం ఒక కీలకమైన మార్పు. […]
Read more

దేశంలో ఎల్ నినో ప్రభావం…111 జిల్లాలపై ఎఫెక్ట్!

న్యూఢిల్లీ: ఎల్ నినో కారణంగా 43 శాతం వర్షపాతం లోటు ఏర్పడటంతో ఖరీఫ్ సాగుకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో, పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉన్న 111 జిల్లాలను ప్రభుత్వం గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బలహీనమైన రుతుపవన పరిస్థితులు జూలై 2 వరకు కొనసాగే అవకాశం ఉందని, దీంతో ఖరీఫ్ (వేసవి) పంట వేయడానికి రైతులకు తక్కువ సమయం మిగులుతుందని చౌహాన్ అన్నారు. జూన్ 22 నాటికి, […]
Read more

ప్రధాని మోదీ ప్రచారం కోసం ఈ ఆరేళ్లలో 2,586 కోట్లు ఖర్చు…RTI ద్వారా వెల్లడి!

న్యూఢిల్లీ: మాజీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, 2020 నుండి వివిధ మాధ్యమాల ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రచారం చేసే ప్రకటనల కోసం కేంద్రం రూ. 2,586 కోట్లు ఖర్చు చేసింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) జూన్ 16న విడుదల చేసిన ఈ గణాంకాలు, 2020-21, […]
Read more

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం…15మంది మృతి, ఏడుగురికి గాయాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక యానిమేషన్ సెంటర్ ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో, 15 మంది విద్యార్థులను మృతి చెందారు, మరో ఏడుగురు గాయపడ్డారని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లోని ట్రామా సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఘటన అనంతరం సుమారు 21 నుంచి 22 మంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు […]
Read more
1 9 10 11 12 13 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.