Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మోడీ మణిపూర్‌ పర్యటన… పరిష్కారం కాని సమస్యలు అనేకం!

న్యూఢిల్లీ: జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు పర్యటించడానికి సిద్ధమయ్యారు. 2023 మేలో సరిహద్దు రాష్ట్రంలో హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌కు స్వల్పకాలిక పర్యటన ఖరారైంది. మోడీ మణిపూర్‌ పర్యటనను రాద్ధాంతం చేయొద్దని బిజెపి కోరుకుంటోంది, కానీ అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘఠనల గురించి అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన వారాల వ్యవధిలోనే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను […]
Read more

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోంది…ప్రముఖ పాత్రికేయులు పి.సాయినాథ్!

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోందని ప్రముఖ గ్రామీణ పాత్రికేయులు పి.సాయినాథ్ అభిప్రాయపడ్డారు. తన వాదనకు అనుకూలంగా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, నెహ్రూ ప్రభుత్వం మీడియా సంస్థలకు సహాయం అందించే ప్రయత్నంలో… బాంబేలోని నారిమన్ పాయింట్, ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ వంటి ప్రధాన ప్రదేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్థలకు భూమిని ఇచ్చినప్పుడు సంపద కేంద్రీకరణ ప్రారంభమైందని అన్నారు. దీంతో వారంతా రియల్ ఎస్టేట్ […]
Read more

మతం మారితే జైలే…రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం!

జైపూర్: రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు అటు మైనారిటీలు, ఇటు మతాంతర జంటల్లో తుఫానును రేకెత్తిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను అరికట్టేందుకు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీ… ‘రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2025’ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర రాజకీయ దృశ్యంలో అలజడిని సృష్టించింది. ప్రధాన రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసే ఈ బిల్లును […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఓట్లు కొనడానికి’ బీజేపీ ఒక్కో ఎంపీకీ 15-20 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించిన అభిషేక్ బెనర్జీ!

కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించాక…తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కాషాయ శిబిరం “ఓట్లు కొనడానికి” ప్రతి ఎంపీకి రూ.15-20 కోట్లు ఖర్చు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు డబ్బు శక్తిని ఉపయోగించిందని ఆరోపించారు. లోక్‌సభలో టిఎంసి పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న బెనర్జీ, మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి బిజెపి నాయకులు “డబ్బు బస్తాలతో వచ్చారని” అన్నారు. మహారాష్ట్ర […]
Read more

ఉమర్ ఖలీద్ కేసులో బెయిల్‌ నిరాకరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ” కుట్ర” కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ సహా మరో ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, శైలీందర్ కౌర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తన తీర్పులో… శాంతియుత నిరసన హక్కును కాపాడుతుందని, కానీ నిరసన ముసుగులో కుట్రపూరిత హింసను… అనుమతించలేమని పేర్కొంది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ పాత్రను “ప్రాథమికంగా తీవ్రమైనది” అని కోర్టు గుర్తించింది. ఈ […]
Read more

ఆత్మహత్య అసహ్యం…జీవితం సర్వోత్తమం!

సెప్టెంబర్ 10…నేడు ఆత్మహత్యల నివారణ దినం. మనిషి జీవితం ఎంతో విలువైనది. మానవ జన్మ సర్వోత్తమమైనది. మన జీవితానికి గల పరమార్థం తెలుసుకొని, దాన్ని సార్థకం చేసుకోవాలంటే ఎలా జీవించాలో తెలుసుకోవాలి. కష్టాలను ఓర్చుకొని జీవితాన్ని కొనసాగించాలి. అయితే నేడు చిన్న చిన్న విషయాలకే కలత చెంది ఆత్మహత్య చేసుకొనే ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇస్లాం బోధించిన ఓర్పును వహిస్తూ.. జీవితంలో వచ్చే కష్టాలను అల్లాహ్ పెట్టిన పరీక్షలుగా భావించి ధైర్యంగా వాటిని […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 13 మంది విపక్ష ఎంపీల క్రాస్ ఓటింగ్!

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షం తమ 324 మంది ఎంపీలందరూ ఓటు వేసేలా చూసుకునేందుకు ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. కానీ ఫలితం రాజకీయ విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విపక్షంలోని కనీసం 13 మంది ఎంపీలు ప్రత్యర్థి ఎన్డీఏకు చెందిన సి పి రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చేందుకు గోడ దూకారు. ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి, అంచనా వేసిన దానికంటే 24 తక్కువ […]
Read more

సరిహద్దు ఫెన్సింగ్‌ను నిలిపివేయాలంటూ మణిపూర్ హైవేలను దిగ్బంధించిన నాగా కౌన్సిల్‌!

ఇంఫాల్‌: మణిపూర్‌లోని నాగా తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ నాగా కౌన్సిల్ (UNC), స్వేచ్ఛా ఉద్యమ పాలన (FMR)ను ముగించి, 1,643-కి.మీ. భారతదేశం-మయన్మార్ సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలనే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా “వాణిజ్య నిషేధం” ప్రారంభించింది. రోడ్డు దిగ్బంధనం ఎటువంటి వాణిజ్య వస్తువులను దాటనివ్వదని UNC తెలిపింది. 2వనంబర్‌, 37వ నంబర్‌ జాతీయ రహదారుల వెంబడి నాగా ఆధిపత్య ప్రాంతాలలో నిరసనకారులు ట్రక్కులను అడ్డుకున్నారు. ప్రభావిత ప్రాంతాలలో సేనాపతి, ఉఖ్రుల్,టామెంగ్‌లాంగ్ ఉన్నాయి. దిగ్బంధనం కారణంగా మణిపూర్‌లోని […]
Read more

బీహార్ SIR డాక్యుమెంట్లలో ఆధార్‌ను చేర్చండి…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: బీహార్‌లో సవరించిన ఓటరు జాబితాలో చేర్చడానికి గుర్తింపు రుజువుగా సమర్పించగల “12వ పత్రం”గా ఆధార్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం (ECI)ని ఆదేశించింది. “బీహార్ సవరించిన ఓటరు జాబితాలో ఓటరును చేర్చడం/తొలగించడం కోసం ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు” అని లైవ్‌లా ఉటంకించినట్లుగా, ECI సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీహార్‌లో ECI చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఏకపక్షం, రాజ్యాంగ […]
Read more

హైదరాబాద్‌లో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఫ్యాక్టరీ సీజ్‌!

హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు హై­ద­రా­బా­ద్‌­లో భారీ డ్ర­గ్స్ ఫ్యా­క్ట­రీ బం­డా­రాన్ని బయటపెట్టారు. ఇక్కడినుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని సింథటిక్ మాదకద్రవ్యాల తయారీ యూనిట్‌ను మహారాష్ట్ర పోలీసులు సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న పదార్థం విలువ దాదాపు రూ.12,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద మాదకద్రవ్యాల డెన్‌ బయటపడటం ఇదే ప్రథమం. మీరా-భయందర్ వాసాయి-విరార్ (MBVV) పోలీసుల క్రైమ్ డిటెక్షన్ యూనిట్ (సెల్-4) హైదరాబాద్‌లోని […]
Read more
1 26 27 28 29 30 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.