Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బెంగళూరులో ‘చెత్త పన్ను’ రెట్టింపు…అమల్లోకి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్యాక్స్‌!

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం.. కొత్తగా చెత్త సేకరణపైనా గార్బేజ్ సెస్‌ను విధించింది. బెంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక -బీబీఎంపీ.. ఈ చెత్త సెస్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన కొత్త ‘చెత్త పన్ను’ – BBMP ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) సేవలను పొందని పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల నివాసితులకు రెట్టింపు దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులు ఇప్పటికే ప్రతి నెలా […]
Read more

వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం!

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ధరను రూ.50 చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అదేసమయంలో CNG కిలోకు రూ.1 చొప్పున పెంచగా, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచింది. ఉచితంగా LPG కనెక్షన్ పొందిన పేద లబ్ధిదారులైన ఉజ్వల్‌ సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు ఏప్రిల్ 8 నుండి అమలులోకి వస్తుందని, ఇన్పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా ఇది అవసరమని చమురు మంత్రి […]
Read more

బీహార్‌లో టోపీలు ధరించిన 32 మంది మదర్సా పిల్లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

పాట్నా : బీహార్ పోలీసులు నిన్న 32 మంది ముస్లిం పిల్లలను తలపై టోపీలు పెట్టుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. వన్ ఇండియా హిందీ వార్తా సంస్థ ప్రకారం, జామియా జకారియా మదర్సాలో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు పిల్లలను మోకామా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పిల్లలు బీహార్‌లోని మైదాబభంగామా అనే గ్రామానికి చెందినవారు. విద్యార్థులు టోపీలు పెట్టుకున్నందుకు గానూ పోలీసులు అరెస్టు చేశారని వన్ ఇండియా హిందీ […]
Read more

మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలి: ముస్లిం మేధావులు!

న్యూఢిల్లీ: భారతదేశంలో ముస్లిం సమాజానికి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో…మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలని ప్రముఖ ముస్లిం నాయకులు, మేధావులు, మాజీ అధికారులు, పౌర సమాజ సభ్యుల బృందం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం వంటి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, మైనారిటీ హక్కులను కాపాడటానికి పార్టీలకు అతీతంగా కలిసి నిలబడాలని వారు ఎంపీలను కోరారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి, సమాజ గౌరవాన్ని కాపాడటానికి సమిష్టి వ్యూహం అవసరాన్ని ఈ విజ్ఞప్తి […]
Read more

బీహార్‌లో ‘వైట్ టీ-షర్ట్ ఉద్యమాన్ని’ ప్రారంభించనున్న రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: న్యాయం, సమానత్వమే లక్ష్యంగా బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో వైట్ టీ-షర్ట్ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…యువత ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ యువతకు విజ్ఞప్తి చేశారు, రాష్ట్ర ప్రజలు ఇకపై మోసపోరని, వారు తమ విధిని తామే రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఈ పర్యటనకు ముందు, బీహార్‌లో వైట్ టీ-షర్ట్ ఉద్యమం విజయవంతం కావాలని […]
Read more

మణిపూర్‌లో భారీగా ప్రబలిన రేబిస్…ముగ్గురు మృతి, వందలాది మంది బాధితులు!

గౌహతి: మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ జోవెంగ్ గ్రామంలో రేబిస్ వ్యాధి భారీగా ప్రబలింది. దీంతో అధికారులు ఆంక్షలు విధించి, కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించారు. ఈ గ్రామంలో గత వారం నుండి రేబిస్ కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 749 మందిని కుక్కలు కరిచాయి. ఈ కారణంగా ముగ్గురు చనిపోయినట్టు అధికారిక వర్గాల ప్రకటించాయి. న్యూ జౌవెంగ్ గ్రామంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో అనుమానిత రేబిస్ కేసులు నమోదయ్యాయి, ఇది ప్రజలు, […]
Read more

వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎస్‌జీపీసీ, అకల్ తఖ్త్, సిరోమణి అకాలీదళ్ సంస్థలు!

న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పంజాబ్‌కు చెందిన అనేక ప్రముఖ సిక్కు సంస్థలు, పాంథిక్ పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా గురుద్వారాలను నిర్వహించే సిక్కుల అత్యున్నత సంస్థలుగా పేరుగాంచిన శిరోమణి అకాలీదళ్‌తో సహా మిగతా సంస్థలు బిల్లును ఖండించాయి. ఇది “ముస్లిం వ్యతిరేకమని” ప్రకటించాయి. వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిజెపి పార్టీ “మతం,కులం ఆధారంగా ప్రజలను విభజిస్తోంది” అని ఆరోపించారు. “వక్ఫ్ […]
Read more

హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం!

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించింది. ఇరు దేశాల మధ్య సాంకేతికతలు అందిపుచ్చుకోవడం, గ్రీన్‌ ఎకానమీ, మౌలిక సదుపాయాలలో ఆస్ట్రేలియా నైపుణ్య సామర్థ్యాలను ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ బృందం పర్యటించింది. ఈ బృందంలో 13 సంస్థల నుండి 19 మంది సభ్యులు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ (ఆస్ట్రేడ్) నిర్వహించిన ఈ పర్యటన, రెండు వైపులా మార్కెట్ అవగాహనను పెంపొందించడం,ఆస్ట్రేలియన్, భారతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు,కార్పొరేట్ ప్రొవైడర్ల మధ్య భాగస్వామ్యాలను […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం-మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి…సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ!

న్యూఢిల్లీ : లోక్‌సభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందడాన్ని జమాతే-ఇ-ఇస్లామి హింద్ (JIH) అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ తీవ్రంగా ఖండించారు, దీనిని మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై స్పష్టమైన దాడి అని అభివర్ణించారు. ఈ చట్టం ఆమోదం వివక్షతతో కూడుకున్నది, ఎందుకంటే ఇది ముస్లింలు తమ మతపరమైన ఆస్తులను నిర్వహించడంలో స్వయంప్రతిపత్తిని హరింపజేస్తుంది, అయితే ఇతర వర్గాల మతపరమైన ట్రస్టులు మాత్రం ప్రభావితం కావు. అంతేకాదు ‘వక్ఫ్ చట్టం 1995’లో భారీ మార్పులను […]
Read more

పార్లమెంట్‌లో అర్థరాత్రి దాటాక ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు… భూ కబ్జాకు రాజమార్గమని అభివర్ణించిన విపక్షాలు!

న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు, పార్లమెంటు అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసింది, రాజ్యసభ 2025 వక్ఫ్ సవరణ బిల్లును తెల్లవారుజామున 2.35 గంటలకు రాజ్యసభ చట్టానికి అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లతో ఆమోదం పొందింది. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటలకు బిల్లును ఆమోదించిన లోక్‌సభతో పోలిస్తే ఎగువ సభ కొద్ది ఎక్కువ సమయం తీసుకుంది. బిల్లుకు నిరసనగా అనేక మంది ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ, […]
Read more
1 34 35 36 37 38 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.