Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

స్వామిపై పోలీసు జులుం…’న కామ్‌కే’, ‘న రామ్‌కే’అంటూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ‘న కామ్‌కే’,’న రామ్‌కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం […]
Read more

స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తాం…కర్ణాటక ఎన్నికల సంఘం!

బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, ఎన్నికలు మే 25 తర్వాత జరుగుతాయని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేషి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. “గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపల్ […]
Read more

ఎస్‌ఐఆర్…ప్రజల ఓటు హక్కుపై దాడి-పౌరసత్వం ప్రశ్నార్థకం!

అబ్దుల్ మజీద్ షోయిబ్,అధ్యక్షులు, ఎం.పి.జే తెలంగాణ. ఎస్‌ఐఆర్‌పై ప్రజా ప్రతిఘటన అవసరం హైదరాబాద్‌: ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల కోట్లాది పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, మైనారిటీలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల వారు ప్రభావితమయ్యారు. ఎస్‌ఐఆర్ కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు — ఇది రాజకీయంగా ప్రభావం చూపే చర్య. దీనిపై మౌనంగా […]
Read more

‘ఎస్‌ఐఆర్‌’ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్ల తొలగింపు దేనికి సంకేతం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. 2025అక్టోబర్ 27న, భారత ఎన్నికల సంఘం, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 1950లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశం ఈ స్థాయిలో ఓటర్ల తొలగింపును ఎప్పుడూ చూడలేదు – యుద్ధాల సమయంలో… కరువు సమయంలో కూడా కాదు, […]
Read more

కలుషిత నీటి మరణాల నేపథ్యంలో నేడు ఇండోర్‌కు రాహుల్ గాంధీ!

భోపాల్: ఇండోర్‌లో కలుషిత నీటి సంక్షోభంపై రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు నగరానికి వెళుతున్నారు. ఈ పర్యటన ఇప్పటికే పార్టీలకతీతంగా తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తూ, మాజీ లోక్‌సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను నొక్కి చెబుతూ సయోధ్య ధోరణిని ప్రదర్శించారు. “ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుంది,” అని ఆమె అన్నారు. “ప్రతిపక్షం తన పనిని బలంగా, సమర్థవంతంగా […]
Read more

మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ కూటమి విజయం!

ముంబై: దాదాపు మూడు దశాబ్దాల పాటు అవిభక్త శివసేన ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ, భారతీయ జనతా పార్టీబృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే పూణేలో కూడా విజయం సాధించింది, అక్కడ శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్గాల కూటమిని చిత్తు చేసింది. మొత్తం మీద, జనవరి 15న ఎన్నికలు జరిగిన ముంబైతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ నేతృత్వంలోని […]
Read more

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుదిశగా అధికార బీజేపీ కూటమి!

ముంబయి: మూడేళ్ల విరామం తర్వాత జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. కౌంటింగ్‌లో తొలుతనుంచి బీజేపీ ముందంజలో ఉండగా…శివసేన రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల మేరకు బీజేపీ కూటమి… థాకరే సోదరులపై ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం… బీఎంసీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి 56 వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, ఏక్‌నాథ్ షిండే శివసేన 14 వార్డుల్లో […]
Read more

కరూర్ తొక్కిసలాటపై విజయ్‌కు సీబీఐ సమన్లు… బీజేపీతో పొత్తుకు నిరాకరించిన దళపతి!

చెన్నై: టీవీకే ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ…విజయ్‌ను జనవరి 19న మరో విడత విచారణకు పిలిచినప్పటికీ, ఆయన పార్టీ టీవీకే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది. విజయ్ మొదటి నుంచీ కాషాయ పార్టీని తన సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణిస్తూ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తును తోసిపుచ్చుతూనే ఉన్నారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకున్న ఏఐఏడీఎంకేతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన పరోక్షంగా సూచించారు. […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ అమలు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్న అధికార టీఎంసీకి ఇప్పడు బీజేపీ కూడా జత కలిసింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో పార్టీకి చెందిన కీలక నాయకుడు సువేందు అధికారి ఇటీవల ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించడం లేదా చేర్చడంపై తమ పార్టీ కార్యకర్తలు సమర్పించిన […]
Read more

ముంబైని బీజేపీ, అదానీల ఆధీనంలోకి పోనివ్వం… థాకరే బ్రదర్స్‌!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ థాకరే బీజేపీని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ విభజన రాజకీయాలను అనుసరిస్తోందని, ముంబైలోని మరాఠీ మనూస్‌ను క్రమపద్ధతిలో “ఒంటరి” చేస్తోందని ఆరోపించారు. జాతీయ పార్టీ అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భూ కబ్జాకు పాల్పడుతుందని, […]
Read more
1 35 36 37 38 39 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.