Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వెనిజులాపై అమెరికా చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన!

న్యూఢిల్లీ: వెనిజులాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను నిర్బంధించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనికి నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. వెనిజులాపై “సామ్రాజ్యవాద సైనిక దురాక్రమణ”ను సిపిఐ(ఎం) నాయకత్వం అమెరికాను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ చర్యకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని కోరింది. దక్షిణ అమెరికా దేశంలోని చమురు వనరులను “స్వాధీనం” చేసుకోవడానికి అమెరికా వెనిజులాపై దాడి చేసిందని నిరసనకారులు ఆరోపించారు. […]
Read more

ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఐదేళ్లనాటి ఢిల్లీ అల్లర కేసులో అరెస్టయిన ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వారిపై ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంది. అయితే ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం బెయిలిచ్చింది. ఈ మేరకు జస్టిస్​ అరవింద్​ కుమార్​, జస్టిస్​ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం నేడు కీలక తీర్పును వెలువరించింది. కాగా, డిసెంబర్ 10న ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ […]
Read more

ఇండోర్ నీటి కాలుష్యం…‘ఘంటా’ పదాన్ని ప్రస్తావించినందుకు అధికారి సస్పెండ్!

ఇండోర్/దేవాస్: ఇండోర్ నీటి కాలుష్య సంక్షోభం మధ్య, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సస్పెండ్ చేశారు. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను, కాంగ్రెస్ ఆరోపణలను తన అధికారిక ఉత్తర్వులో ఉటంకించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక విధులను నిర్వర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఉదాసీనత, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఉజ్జయిని డివిజన్ రెవెన్యూ కమిషనర్ ఆశిష్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు. ఆదివారం దేవాస్‌లో కాంగ్రెస్ […]
Read more

“బీజేపీ స్వతంత్రంగా పనిచేస్తుంది, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో రిమోట్ లేదు”…మోహన్ భగవత్!

భోపాల్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పి), విద్యా భారతి వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని, వాటిని సంఘ్ నియంత్రించదని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. “బీజేపీ లేదా వీహెచ్‌పి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు; అవి స్వతంత్రంగా పనిచేస్తాయి. సంఘ్ ద్వారా రిమోట్ కంట్రోల్ చేయరు” అని భగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంస్థల ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ప్రాథమిక పొరపాటు చేస్తున్నారని అన్నారు. […]
Read more

బెంగళూరులో కూల్చివేతలు…పర్యవేక్షణ కమిషన్ల మౌనం!

బెంగళూరు: కర్ణాటక రాజాధాని బెంగళూరులోని ‘కోగిలు లేఅవుట్‌’లో ఇటీవల జరిగిన పెద్ద ఎత్తున కూల్చివేత కార్యక్రమం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) నిర్వహణ, రాష్ట్ర ఆదేశిత పర్యవేక్షణ సంస్థల మౌనంపై విమర్శల తుఫానును రేకెత్తించింది. ఈ ఆకస్మిక ఆపరేషన్‌లో 400కు పైగా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వేలాది మంది – ప్రధానంగా అణగారిన మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రమైన చలి కాలంలో ఆశ్రయం కోల్పోయారు. ఈ సంఘటన సాధారణ పరిపాలనా “ఆక్రమణ తొలగింపు” నుండి తీవ్రమైన […]
Read more

మణిపూర్‌లో 27 బాంబులను సురక్షితంగా నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు!

ఇంఫాల్: రెండేళ్లుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బాంబులు కలకలం సృష్టించాయి. ఈమేరకు ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు 27 బాంబులను స్వాధీనం చేసుకుని, వాటిని నిర్వీర్యం చేశాయని పోలీసులు తెలిపారు. మణిపూర్‌లో రెండేళ్ల క్రితం జాతుల మధ్య చెలరేగిన హింస తర్వాత, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు భద్రతా దళాలు “ఆపరేషన్ ఆల్-అవుట్” పేరుతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్లలో భాగంగానే, ఉగ్రవాదులు, […]
Read more

ఈవీఎంలను విశ్వసిస్తున్న కర్ణాటక ప్రజలు…నిగ్గుతేల్చిన సర్వే!

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ “ఓట్‌చోరీ” ఆరోపణల నేపథ్యంలో… కర్ణాటక ప్రజలు ఈవీఎంలకే జై కొట్టారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయని కర్ణాటక ప్రభుత్వ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో నిగ్గు తేలింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై బీజేపీకి పట్టు సాధించడానికి దోహదపడింది. రాహుల్ గాంధీ “ఓట్ల దొంగతనం” ఆరోపణల్లో కర్ణాటకకు చెందిన కలబుర్గి ప్రముఖంగా కనిపించిన నేపథ్యంలో ఈ అధ్యయనం రావడం బీజేపీకి మరింత ఆనందాన్నిచ్చింది. “ఈ సర్వే […]
Read more

ఘజియాబాద్‌లో బహిరంగంగా కత్తుల పంపిణీ…యూపీలో శాంతిభద్రతలపై ప్రశ్నలు!

లక్నో: ఘజియాబాద్‌లో ఒక హిందూ మితవాద సంస్థ బహిరంగంగా కత్తులు పంపిణీ చేయడం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలను నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, హిందూ రక్షా దళ్ అనే హిందూ మితవాద సంస్థకు చెందిన సభ్యులు ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి, కత్తులు, గొడ్డళ్లు,ఇతర పదునైన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం… నిర్వాహకులు ఈ ఆయుధాలను స్థానిక […]
Read more

కేసీఆర్‌కు ‘ఉరిశిక్ష’ వేసినా తప్పులేదు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు “బారీ అన్యాయం” చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నదీ జలాల వినియోగంలో జరిగిన నష్టానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మేనల్లుడు టి హరీష్ రావును ఉరితీసినా తప్పులేదని సీఎంఅన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి తమ ఇద్దరు నాయకుల మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. నదీ జలాల సమస్యలపై సాగునీటి శాఖ మంత్రి ఎన్ […]
Read more

భారతీయ ముస్లింలకు’2025′ ఎలా గడిచింది?

ముహమ్మద్ ముజాహిద్ , 96406 22076 కొన్ని గంటలే క్రితమే ముగిసిన”2025 సంవత్సరం భారతీయ ముస్లింలకు కేవలం కాలచక్రంలో మరో ఏడాదిగా మిగిలిపోలేదు; అది వారి అస్తిత్వానికి, పౌర హక్కులకు ఎదురైన ఒక అగ్నిపరీక్ష. వ్యవస్థీకృత ద్వేషం, మీడియా పక్షపాతం, బుల్డోజర్ రాజకీయాల నీడలో సామాన్య ముస్లిం పౌరుడు తన సొంత గడ్డపైనే పరాయివాడిగా మారాల్సి రావడం దేశ ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. రాజ్యాంగబద్ధమైన రక్షణలు కాగితాలకే పరిమితమై, విద్వేషం వీధుల్లో రాజ్యమేలుతుంటే, ఈ అభద్రతా […]
Read more
1 37 38 39 40 41 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.