Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

లక్నోలో మత సామరస్యం కోసం ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించిన సమాజ్‌వాదీ పార్టీ!

లక్నో : మత సామరస్యం, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీ.. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హిందూ మతం, ఇస్లాం, సిక్కు, క్రైస్తవ మతం వంటి వివిధ మతాల నాయకులు, అనుచరులను మత సంఘీభావాన్ని ప్రదర్శించే ఒక ఉత్సాహభరితమైన వేడుక అని ఆ పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… సాంస్కృతిక మత ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. […]
Read more

ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ డిమాండ్!

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని సబర్మతీ నది ఒడ్డున జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో కోటా కావాలని డిమాండ్ చేసింది. OBCలు, STలు, SCలకు రిజర్వేషన్లు కల్పించాలని పిలుపునిచ్చింది. దీనిని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొంది. అదేసమయంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5)ని అమలు చేయడానికి చట్టం చేయాలని కూడా కేంద్రానికి హితవు పలికింది. కాగా, ఆహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన […]
Read more

కేరళలో వక్ఫ్‌ నిరసన ర్యాలీపై పోలీసు జులుం…లాఠీచార్జ్‌, భాష్పవాయు గోళాల ప్రయోగం!

తిరువనంతపురం: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాలికట్‌లో సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్‌ చేశారు. భాష్ఫవాయు గోళాలను ఉపయోగించారు. వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించారు. వక్ఫ్ చట్టంపై నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు. కాలికట్‌లో నిరసన వీడియో లింక్‌ https://fb.watch/ySeZm7MWPD/? వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి హింద్ కేరళతో అనుబంధంగా ఉన్న సాలిడారిటీ […]
Read more

అమల్లోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం!

న్యూఢిల్లీ: గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం మంగళవారం నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. “వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 (2025లో 14)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా ఇచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 8వ తేదీని ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటించింది.” అర్థరాత్రి దాటాక కూడా […]
Read more

కర్ణాటకలోని కుగ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌…వంద ఇళ్లలో విధ్వంసం!

యాద్గిర్, కర్ణాటక: కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని జాలిబెంచి అనే కుగ్రామంలో విద్యుత్తు అంతరాయం కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిన్న అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనలో దాదాపు వంద ఇళ్లు ప్రభావితమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కాలిపోయాయి. పలువురు స్థానికులు గాయపడ్డారు. ఈ భయంకరమైన సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి, విద్యుత్ స్తంభాల నుండి నిప్పురవ్వలు రాలడంతో…దగ్గరలో ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఊరంతా దట్టమైన పొగ […]
Read more

ట్రంప్‌ విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకం పెంచిన ప్రధాని మోదీ…రాహుల్‌గాంధీ ఎద్దేవా!

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా విధించిన “సుంకాల”కు తగిన సమాధానం ఇచ్చారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు “ప్రభుత్వ దోపిడీ” అనే మరో బహుమతిని ఇచ్చారని కూడా రాహుల్‌ అన్నారు. ప్రభుత్వం పెట్రోల్ – డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 కు, డీజిల్ […]
Read more

బెంగళూరులో ‘చెత్త పన్ను’ రెట్టింపు…అమల్లోకి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్యాక్స్‌!

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం.. కొత్తగా చెత్త సేకరణపైనా గార్బేజ్ సెస్‌ను విధించింది. బెంగళూరు నగరంలో వ్యర్థాల నిర్వహణ కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక -బీబీఎంపీ.. ఈ చెత్త సెస్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన కొత్త ‘చెత్త పన్ను’ – BBMP ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) సేవలను పొందని పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల నివాసితులకు రెట్టింపు దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులు ఇప్పటికే ప్రతి నెలా […]
Read more

వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం!

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ధరను రూ.50 చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అదేసమయంలో CNG కిలోకు రూ.1 చొప్పున పెంచగా, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచింది. ఉచితంగా LPG కనెక్షన్ పొందిన పేద లబ్ధిదారులైన ఉజ్వల్‌ సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు ఏప్రిల్ 8 నుండి అమలులోకి వస్తుందని, ఇన్పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా ఇది అవసరమని చమురు మంత్రి […]
Read more

బీహార్‌లో టోపీలు ధరించిన 32 మంది మదర్సా పిల్లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

పాట్నా : బీహార్ పోలీసులు నిన్న 32 మంది ముస్లిం పిల్లలను తలపై టోపీలు పెట్టుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. వన్ ఇండియా హిందీ వార్తా సంస్థ ప్రకారం, జామియా జకారియా మదర్సాలో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు పిల్లలను మోకామా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పిల్లలు బీహార్‌లోని మైదాబభంగామా అనే గ్రామానికి చెందినవారు. విద్యార్థులు టోపీలు పెట్టుకున్నందుకు గానూ పోలీసులు అరెస్టు చేశారని వన్ ఇండియా హిందీ […]
Read more

మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలి: ముస్లిం మేధావులు!

న్యూఢిల్లీ: భారతదేశంలో ముస్లిం సమాజానికి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో…మైనారిటీ హక్కులను కాపాడుకోవడంలో ముస్లిం ఎంపీలు ఐక్యతగా వ్యవహరించాలని ప్రముఖ ముస్లిం నాయకులు, మేధావులు, మాజీ అధికారులు, పౌర సమాజ సభ్యుల బృందం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం వంటి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, మైనారిటీ హక్కులను కాపాడటానికి పార్టీలకు అతీతంగా కలిసి నిలబడాలని వారు ఎంపీలను కోరారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి, సమాజ గౌరవాన్ని కాపాడటానికి సమిష్టి వ్యూహం అవసరాన్ని ఈ విజ్ఞప్తి […]
Read more
1 68 69 70 71 72 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.