Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తమిళనాడుకు “కొత్త ఆశ” నటుడు విజయ్… ప్రశాంత్ కిషోర్!

చెన్నై : వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సినీ నటుడు ఇళయదళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగంకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే లక్షలాది మందికి టీవీకే చీఫ్ విజయ్ ఒక కొత్త ఆశ అని అన్నారు. నిన్న జరిగిన టీవీకే మొదటి వార్షికోత్సవ వేడుకకు ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. కాగా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను ఓడించాలని లక్ష్యంగా […]
Read more

మరో భాషా యుద్ధానికి సిద్ధం…తమినాడు సీఎం స్టాలిన్!

చెన్నై : జాతీయ విద్యా విధానంపై తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని, తమపై బలంగా హిందీ భాషను రుద్దాలని ప్రయత్నిస్తోందని , పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమినాడు మరో భాషా ఉద్యమానికి సిద్ధంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భారత […]
Read more

మణిపూర్ గవర్నర్‌తో శాంతి, నిరాయుధీకరణపై చర్చించాం…అరంబాయి టెంగోల్!

ఇంఫాల్/న్యూఢిల్లీ: అరంబాయి టెంగోల్ (AT) ప్రతినిధి బృందం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి, సరిహద్దు రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ముందుకు సాగే మార్గం గురించి చర్చించిందని ఆ సంస్థ ప్రతినిధి ఇంఫాల్‌లో విలేకరులకు తెలిపారు. ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు NDTVతో మాట్లాడుతూ…ఆయుధాలు అప్పగించిన తర్వాత పౌరులపై ఎటువంటి దాడులు జరగవని, కేంద్ర దళాలు, పోలీసులు ఏవైనా భద్రతా లోపాలను భర్తీ చేస్తారని, లేకుంటే పౌరులు మళ్లీ ఆయుధాలు చేపట్టాల్సి వస్తుందని అరాంబాయి […]
Read more

2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసుల్లో 80% నిర్దోషులు!

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లకు ఐదేళ్లు పూర్తవుతున్న తరుణంలో, 120 కేసుల్లో దాదాపు 80 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారని ఒక నివేదిక వెల్లడించింది. బిబిసి హిందీలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఉమన్ పొద్దార్ 126 కేసులను విశ్లేషించి, 758 హింసకు సంబంధించిన నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల స్థితిని తనిఖీ చేశారు. ఈ గణాంకాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ మత హింసలో 53 మంది మరణించారు, వారిలో 40 మంది ముస్లింలు, పదివేల మంది గాయపడి నిరాశ్రయులయ్యారు. […]
Read more

తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దకండి…కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్!

చెన్నై: జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపొందించిన త్రిభాషా ఫార్ములా కింద తమిళనాడుపై హిందీని రుద్దడానికి కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రానికి హాని కలిగించే దేనిని తాను అనుమతించబోనని స్టాలిన్ అన్నారు. తమిళ గుర్తింపును సవాలు చేయవద్దని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రాలు అభివృద్ధి చెంది బలంగా మారినప్పుడు […]
Read more

భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం…కాంగ్రెస్, బీజేపీ ప్రత్యాపరోణలు!

న్యూఢిల్లీ: భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్‌ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్‌ డాలర్ల సాయం చేయాలంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను […]
Read more

నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన కిట్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత!

భువనేశ్వర్: నగరంలోని కిట్ డీమ్డ్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, ఆత్మహత్య, తదనంతరం పొరుగు దేశ విద్యార్థులపై దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వ్యవస్థాపకుడు అచ్యుత సామంత గ నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. క్యాంపస్‌ను ఖాళీ చేసిన వారందరూ తిరిగి రావాలని కోరాడు. ఈ సంఘటనపై సామంత చేసిన మొదటి బహిరంగ ప్రకటన వీడియోను KIIT X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, ఈ […]
Read more

మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తోంది…ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా 90 కొత్త గ్రామాలను నిర్మిస్తోందని వచ్చిన నివేదికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం భారతదేశ జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతను… సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పీఆర్ స్టంట్స్, తప్పడు ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తోంది. నేషనల్ సెక్యురిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. చైనాకు రెడ్ […]
Read more

స్థానిక ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

ముంబయి: హిందుత్వ భావజాలానికి అనుగుణంగా, మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి-ఎన్డిఎ ప్రభుత్వం లవ్ జిహాద్‌పై చట్టాన్ని అమలు చేయడానికి కసరత్తును ప్రారంభించింది. బిజెపి-శివసేన-ఎన్‌సిపి కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు, 288 మంది సభ్యుల మహారాష్ట్ర శాసనసభలో తన ప్రభుత్వానికి ఉన్న సంపూర్ణ మెజారిటీ కారణంగా, అటువంటి చట్టాన్ని ఆమోదించడం ఒక సవాలుగా ఉండకపోవచ్చు. గత వారం, రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ పై చట్టాన్ని రూపొందించడంలో చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించడానికి […]
Read more

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా… సీఎం పదవిని చేపట్టిన 4వ మహిళ!

న్యూఢిల్లీ: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది, ఎంపిక ప్రక్రియకు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధంకర్‌లను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ శాసనసభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమయ్యారు, ఆమె ఢిల్లీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నేడు రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి […]
Read more
1 75 76 77 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.