Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హిందీపై కేంద్రం-తమినాడు మధ్య మాటల మంటలు!

న్యూఢిల్లీ : హిందీ భాషా వివాదం కేంద్రం-తమిళనాడు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తనను […]
Read more

కుంభ్ నీళ్లు ‘స్నానానికి అనువు’గానే ఉన్నాయన్న కేంద్రం…నివేదికపై వెనక్కి తగ్గిన కాలుష్య నియంత్రణ బోర్డు!

న్యూఢిల్లీ: కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది నీరు స్నానానికి అనువుగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్ధించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ఇచ్చిన కొత్త నివేదికను ఉటంకిస్తూ…నీటి నాణ్యత విషయంలో ఢోకాలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ పార్లమెంటుకు తెలిపారు. గతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు – నీటి నాణ్యత పరీక్షలను ఉటంకిస్తూ – ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక ప్రదేశాలలో గంగా నదిలోని నీరు స్నానానికి పనికిరాదని పేర్కొంది. NGTకి కూడా […]
Read more

హోలీ వేడుకల కారణంగా లక్నో, సంభాల్‌లో శుక్రవారం నమాజ్ టైమింగ్స్‌లో మార్పు!

లక్నో-ఉత్తరప్రదేశ్: రానున్న శుక్రవారం హోలీ కావడంతో, ఈద్గాతో సహా లక్నోలో ప్రార్థన సమయాలను మధ్యాహ్నం 12 గంటలకు బదులుగా 2 గంటలకు మార్చారు. ఈమేరకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి ఈ నోటీసును విడుదల చేశారు, హోలీ వేడుకలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి కాబట్టి,… ముస్లింలు 12:45 గంటలకు బదులుగా 2 గంటల తర్వాత […]
Read more

వాడీ, వేడిగా సాగనున్న రెండవ దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!

న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండవ దశలోనూ వాడీ, వేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఓటర్ల కార్డులకు ‘EPIC’ నంబర్ కేటాయింపు, సరిహద్దుల విభజన, త్రిభాషా అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టనున్నాయి. మరోవంక వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఆమోదింప జేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఏప్రిల్ 4వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భారత అక్రమ వలసదారుల బహిష్కరణ విషయంలో అమెరికా అవలంభించిన విధానం, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధిస్తానని ప్రకటించడం […]
Read more

మణిపూర్‌లో గవర్నర్‌ డెడ్‌లైన్‌ తరువాత 196 ఆయుధాల అప్పగింత…మిగతా వాటికోసం ఆపరేషన్!

ఇంఫాల్: మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తికి స్పందిస్తూ, దోచుకున్న, అక్రమంగా కలిగి ఉన్న 196 ఆయుధాలు పోలీసులకు తిరిగి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా మార్చి 6లోపు ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్‌ డెడ్‌లైన్‌ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాలు – చురాచంద్‌పూర్, బిష్ణుపూర్, తౌబాల్, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, కాక్చింగ్, జిరిబామ్, ఫెర్జాల్‌లలో 196 ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు […]
Read more

బంగ్లాదేశ్ మీదుగా బెంగాల్- ఈశాన్య రాష్ట్రాల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మించాలన్న మేఘాలయ!

గువహతి: బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీని పెంచాలని మేఘాలయ ప్రభుత్వం డిమాండ్ చేసింది. హిలి-మహేంద్రగంజ్ ట్రాన్స్‌నేషనల్ ఎకనామిక్ కారిడార్‌తో ఇది సాధ్యమవుతుందని తెలిపింది. కాగా హిలి పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు పట్టణం కాగా, మహేంద్రగంజ్ మేఘాలయ గారో హిల్స్ ప్రాంతంలో సరిహద్దు పట్టణం. ఈ రెండు ప్రాంతాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటాయి. ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కోల్‌కతా నుండి తురా, బాగ్మారా, డాలు, డాకి వంటి వృద్ధి కేంద్రాలకు 100 కి.మీ […]
Read more

‘మీకు హోలీ ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండండి’ యుపీ డీఎస్‌పీ అనుజ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్‌ : పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనలతో పాటు వచ్చే హోలీ పండుగకు ముందు సంభాల్‌ పోలీస్‌ అధికా అనుజ్ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. సంభాల్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అనుజ్ చౌదరి గురువారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…హోలీ రంగులు మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఆరోజు ఇంట్లోనే ఉండాలని సూచించారు, హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు సంవత్సరానికి 52 సార్లు వస్తాయని వివాదాస్పద […]
Read more

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకం…ట్రంప్!

న్యూఢిల్లీ: తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న  భారతదేశంపై ప్రతీకారం సుంకం ఏప్రిల్ 2 నుండి అమలులోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. ఈ మేరకు అమెరికా అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం, మెక్సికో, కెనడా సహా మిగతా దేశాలు మనం వసూలు చేసే దానికంటే […]
Read more

ఉత్తరాఖండ్‌లో ‘మదరసాలు’, మసీదులకు సీలు… రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించిన ముస్లింలు!

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ముస్లిం వ్యతిరేక ప్రచారం పవిత్ర రంజాన్ మాసంలోనూ కొనసాగుతోంది. ఇటీవల, డెహ్రాడూన్ జిల్లాలోని అనేక మదర్సాలు, ఒక మసీదుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా, అనేక మదర్సాలను సీలు చేశారు. ఇతర మదర్సాలకు నోటీసులు జారీ చేశారు, దీంతో స్థానిక ముస్లిం సమాజం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. . ప్రభుత్వం చేపట్టిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యలను నిరసిస్తూ మార్చి 4న […]
Read more

రాజ్ భవన్‌లో భద్రతా సమావేశం నిర్వహించిన మణిపూర్ గవర్నర్…శాంతియుత ఉద్యమానికి పిలుపు!

గువహతి: జాతి హింసతో అల్లాడుతున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా, శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా రాజ్ భవన్‌లో కీలకమైన భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. మార్చి 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత, ప్రధాన కార్యదర్శి పికె సింగ్, భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, డిజిపి రాజీవ్ సింగ్, ఉన్నత సైనిక, పారామిలిటరీ అధికారులు హాజరైన ఈ సమావేశంలో […]
Read more
1 73 74 75 76 77 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.