Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ మహా ధర్నా…పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి!

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే, ఆ తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించడానికి 10 లక్షల మందితో భారీ సభను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ నిర్వహించిన ధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని […]
Read more

హైదరాబాద్ వర్సిటీ భూ వివాదం…400 ఎకరాలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం!

హైదరాబాద్: హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న సాంకేతికత కారణం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారముంది. వాస్తవం ఏమిటంటే, నేటికీ UoH భూమి రాష్ట్రానికే చెందుతుంది. భూమిని అధికారికంగా వర్సిటీకి బదిలీ చేయనందున, అది ఏర్పాటైనప్పటి నుండి అదే పరిస్థితి. 400 ఎకరాలకు సంబంధించి రెండు […]
Read more

కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని తప్పుబట్టిన మానవహక్కుల వేదిక!

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని TGIIC ద్వారా వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండించింది. ఈ భూమిని మొదట భారత ప్రభుత్వం 1973లో విద్యా, పరిశోధన ప్రయోజనాల కోసం UoHకి కేటాయించిందని సంస్థ తెలిపింది. “ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చేస్తున్న నిరసనలు విద్యా, పర్యావరణ ప్రయోజనాల కోసం భూమిని దక్కించుకోవాల్సిన ప్రాముఖ్యతను చాటిచెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ […]
Read more

తెలంగాణలో ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలు!

హైదరాబాద్‌ : తెలంగాణ అంతటా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు,ఈద్గాల వద్ద ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లో మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదులలో పెద్ద సంఖ్యలో జనం ఈద్-ఉల్-ఫితర్‌ నమాజ్‌ ఆచరించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మీర్ ఆలం ఈద్గాలో నమాజ్‌ చదివారు. దేశంలో శాంతి, న్యాయం జరగాలని దుఆ చేశారు. . “ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మన […]
Read more

ఏప్రిల్‌ 5లోగా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి..మైనారిటీ యువతను ప్రోత్సహిస్తున్న కమ్యూనిటీ నాయకులు!

హైదరాబాద్‌ : నిరుద్యోగ ముస్లిం యువత వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ యువతను కమ్యూనిటీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద మైనారిటీల కోసం రూ. 840 కోట్లు కేటాయించింది, జనాభా అంచనాల ఆధారంగా ముస్లిం దరఖాస్తుదారులకు రూ. 751 కోట్లు కేటాయించింది. తెలంగాణ అంతటా దాదాపు 42,000 మంది మైనారిటీ యువత ప్రయోజనం పొందుతారని […]
Read more

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం!

హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించాలని, ఏవైనా మార్పులను ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. […]
Read more

తీవ్ర వాదోపవాదాల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం…నిరవధిక వాయిదా!

హైదరాబాద్: బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున తెలంగాణ శాసనసభ నిన్న అప్రాప్రియేషన్ బిల్లు (ద్రవ్య వినిమయ బిల్లు)ను ఆమోదించింది. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆదేశించారు, ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత, 11 రోజుల పాటు సమావేశమైన సభ నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల చర్చలో ఎక్కువ భాగం రాష్ట్ర రుణం చుట్టూనే తిరిగింది. కేటీఆర్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం, […]
Read more

తెలంగాణలో మిస్‌వరల్డ్‌ ఈవెంట్‌…రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్‌!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే… ఆ సమస్యను పరిష్కరించకుండా అందాల పోటీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు రాబోయే మిస్ వరల్డ్ పోటీలకు రూ. 55 కోట్లు ఖర్చు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేటిఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరు లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని, అదే […]
Read more

పీడీ చట్టం కింద తన అరెస్టుకు ‘కొంతమంది బీజేపీ నాయకులే’ కారణం…ఆరోపించిన రాజా సింగ్!

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద తనను జైలులో పెట్టడంలో కొంతమంది బీజేపీ నాయకుల పాత్ర ఉందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ నాయకుల ప్రమేయం గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి తనకు తెలియజేశారని, అది తనను తీవ్రంగా కలచివేస్తుందని రాజా సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలు శిక్ష సమయంలో తన పార్టీ నాయకుల నుండి మద్దతు లేకపోవడం పట్ల రాజా […]
Read more

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం…మరో మృతదేహం లభ్యం!

హైదరాబాద్: నాగర్ కర్నూల్‌లోని SLBC సొరంగంలో చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందం కనుగొంది. దీంతో ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు మృతదేహాలను శిథిలాల నుండి వెలికితీసినట్టైంది. సొరంగంలోని చివరి 50 మీటర్ల ప్రాంతంలో తవ్వకం జరుపుతున్న కొంతమంది రెస్క్యూ కార్మికులు లోకో ట్రాక్ సమీపం నుండి దుర్వాసన రావడాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ […]
Read more
1 45 46 47 48 49 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.