Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇందిరమ్మ పథకం కింద ఇరవైవేలకుపై ఇళ్ల నిర్మాణం జరుగుతోంది…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

హైదరాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. “పైలట్ ప్రాజెక్ట్ కింద, 47,335 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేశారు. ఇప్పటివరకు, 5140 ఇళ్లకు బేస్‌మెంట్లు, 300 ఇళ్లకు గోడలు, మరో పది ఇళ్లకు స్లాబ్‌లు వేసారని” ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి సోమవారం ఎటువంటి ఆలస్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను క్రమం తప్పకుండా […]
Read more

గుల్జార్ హౌజ్ విషాదానికి ఫైర్‌ సేప్టీ లేకపోవడం కారణం…హైడ్రా కమిషనర్!

హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాద ఘటన ఒక గుణపాఠమని అన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తుందన్న హైడ్రా కమిషనర్ వెల్లడించారు. అగ్నిప్రమాదాలన్నింటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌లోని పాత భవనాలలో తీసుకోవలసిన భద్రతా చర్యలను అధ్యయనం చేస్తోందని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతైన నేపథ్యంలో, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన […]
Read more

గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం…రోదిస్తున్న కుటుంబాలు, సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో!

హైదరాబాద్ : వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన పిల్లలు, మనవరాళ్లతో ఆటపాటలను ఆ వృద్ధ దంపతులు ఆస్వాదించారు. కానీ సెలవులు ఆ కుటుంబానికి ఒక పీడకలగా మారాయి. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో నిన్న ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మరణించి బంధువులకు విషాదం మిగిల్చారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు మరణించడం అందరి హృదయాలనూ కలచివేసింది. ఆదివారం సాయంత్రం పురానాపుల్‌లోని హిందూ శ్మశాన వాటిక (శ్మశానవాటిక) వద్ద విషాదకరమైన వాతావరణం […]
Read more

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీల అక్రమ వ్యాపారంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నకిలీలు అమ్మితే పీడీ చట్టంనకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి) చట్టాన్ని అమలు […]
Read more

మాచారంలో భూమిపై చెంచులకే యాజమాన్య హక్కులు!

హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా భూ యాజమాన్య పోరాటంలో చిక్కుకున్న మాచారం భూమి చివరికి చెంచులకే దక్కింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో నివసిస్తున్న 23 చెంచుల కుటుంబాలకు 30 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం పైలట్ ప్రాజెక్టును మే 18న మాచారం నుండి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద, […]
Read more

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు పెరగనున్నాయ్‌!

హైదరాబాద్ : రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు భారీగా పెరగనున్నాయి. అనేక విద్యా సంస్థలు 100 శాతం పెంపును డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెంపు భారం తప్పకపోవచ్చు. ఈమేరకు ఆయా ఇంజనీరింగ్‌ సంస్థల యాజమాన్యాలు ఫీజు పెంపు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC)కి ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే రాబోయే మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు 50 శాతం నుండి 100 శాతం వరకు పెంపును ఆయా […]
Read more

లా టొమాటినా తర్వాత మే 23 నుండి హైదరాబాద్‌లో మ్యాంగో మేళా!

హైదరాబాద్ : వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల వైపే.. ఫలోకా రాజా మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్లు.. రకరకాల సైజులతో ఆహారప్రియులను ఆకరిస్తూ ఉంటాయి. తొలి లా టొమాటినా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ మ్యాంగో మేళాకు రంగం సిద్ధమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాలతో మామిడి పండ్లు కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జో చాహే మ్యాంగో ఫెస్టివల్‌ పేరిట […]
Read more

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన టొమాటో ఫెస్టివల్!

హైదరాబాద్ : మనదేశంలోనే మొట్టమొదటి టమాటో పెస్టివల్‌కు హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. జిందగీ నా మిలేగీ దుబారా నుండి వచ్చిన “లా టొమాటినా” క్షణాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించాలని కలలుగన్నట్లయితే అది నిజమైంది! నిన్న టోమా టెర్రా ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ఈ వేడుక ఘనంగా ప్రారంభం అయింది. హదరాబాదీలు టమోటా పిచ్చిలో మునిగిపోయారు. స్పెయిన్‌లో ప్రతి ఏటా జరిగే ఐకానిక్ లా టమాటినా స్ఫూర్తితో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే హైదరాబాద్ వెర్షన్ మ్యూజిక్‌, డాన్స్‌, […]
Read more

గతంలో సేకరించిన వరిని మిల్లర్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్రానికి 510 కోట్ల నష్టం!

వనపర్తి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా పండించే వరిని మిల్లర్లు పట్టించుకోకుండా వదిలేసారు. దానిని ఇంకా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.510 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. గత ప్రభుత్వం 2022–2023 రబీ సీజన్‌లో జిల్లా అంతటా 111 మంది మిల్లర్లకు 222,437.461 మెట్రిక్ టన్నుల వరిని కేటాయించారు. ఇందులో 5,586.904 మిలియన్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. ఇంకా 216,850.557 మిలియన్ టన్నులు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. […]
Read more

సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్ : భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా…సరిహద్దు రాష్ట్రాలలో ఉంటున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న స్థానికులకు నిరంతరాయంగా సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఈమేరకు తెలంగాణ భవన్‌లోని ఈ నంబర్‌లను సంప్రదించవచ్చు: ల్యాండ్‌లైన్ నంబర్‌: 011-23380556వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్‌ లైజన్ హెడ్ – 9871999044హైదర్ అలీ నఖ్వీ, […]
Read more
1 43 44 45 46 47 55

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.