Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి…మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మరో రాజకీయ దుమారం రేగింది. “మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి” అని, యువత అంతా ఆయన అసలు రూపాన్ని గమనిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో పాటు మహిళా సాధికారతకు విస్తృత పిలుపునిచ్చారు.

“రెండు విషయాలు స్పష్టం: 1. మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి. యువతరం అతని అసలు స్వరూపాన్ని సులభంగా పసిగట్టగలదు. 2. జెన్ జెడ్ మన భవిష్యత్తు . జెన్ జెడ్ మహిళలు మార్గదర్శకులుగా ఉంటారు. వారి కోసం మార్గాలు సులభతరం చేయడం మన కర్తవ్యం,” అని ఆ సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళనలు
మహిళా రిజర్వేషన్ బిల్లు సాధికారతకు సంబంధించిన దానికంటే, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ సమీకరణాలను మార్చడానికే ఎక్కువ ఉపయోగపడుతుందని వాదిస్తూ, గాంధీ ఆ బిల్లుపై తన విమర్శలను పునరుద్ఘాటించారు.

“వారు అకస్మాత్తుగా ఈ బిల్లును తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో మూడో వంతు మహిళలకు కేటాయించాలని మేము కోరాము, కానీ వారు అలా చేయలేదు. నిజానికి, ఇది మహిళల బిల్లు కాదు. ఇది నియోజకవర్గాల పునర్విభజన,” అని ఆయన అన్నారు.

జాగ్రత్తగా ఆలోచించకుండా సీట్ల పంపిణీలో ఎలాంటి మార్పు చేసినా అది ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు.

“వారు చేయాలనుకుంటున్నది ఏమిటంటే, దక్షిణ రాష్ట్రాలలో సీట్ల సంఖ్యను తగ్గించి, ఉత్తర భారత రాష్ట్రాలలో వాటిని పెంచడం. పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోకుండా మీరు భారతదేశంలో సీట్ల సంఖ్యను మార్చినట్లయితే, దక్షిణాది, ఉత్తరాది మధ్య యుద్దం రాజుకుంటుందని” గాంధీ అన్నారు.

2023లో ప్రతిపక్షాల మద్దతుతో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, దీనిని అమలు చేయడానికి మరో 10 సంవత్సరాలు పట్టవచ్చని ప్రభుత్వం సూచించిందని కూడా ఆయన అన్నారు.

జెన్ జెడ్,మహిళా నాయకత్వంపై దృష్టి
చర్చ సందర్భంగా, భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతులు కీలక పాత్ర పోషిస్తారని గాంధీ నొక్కి చెప్పారు. “నా దృష్టిలో, స్త్రీపురుషులు ఇద్దరికీ సమాన స్థానం ఉండాలి. నిజానికి, నా అనుభవం ప్రకారం పురుషుల కంటే మహిళల సమర్థత, బలం చాలా గొప్పవని నేను నమ్ముతాను. వారు మరింత సమర్థులు,” అని ఆయన అన్నారు.

“భారతదేశంలో ఎంత ఎక్కువ మందికి సాధికారత కల్పిస్తే అంత మంచిదని నేను భావిస్తున్నాను. పురుషుల కంటే మహిళల సాధికారతకే నేను ఎక్కువ మొగ్గు చూపుతాను.”

“ఈ వ్యవస్థలన్నింటిలో మహిళలను బలవంతంగా చేర్చాల్సి వచ్చినా సరే,” మహిళల రాజకీయ భాగస్వామ్యం, కార్పొరేట్ ప్రాతినిధ్యం మరియు సంస్థాగత ఉనికిని తప్పనిసరిగా విస్తరించాలని ఆయన అన్నారు.

మహిళా నాయకులకు ప్రశంసలు
వివిధ పార్టీలకు చెందిన మహిళా నాయకుల రాజకీయ ప్రభావాన్ని గుర్తిస్తూ, వారి గురించి కూడా గాంధీ మాట్లాడారు. “నేను ఆమెకు వ్యతిరేకినే, కానీ యూపీ రాజకీయాల్లో మాయావతి గారు చాలా కీలక పాత్ర పోషించారని నేను భావిస్తున్నాను. ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను మౌలికంగా మార్చేశారు,” అని ఆయన అన్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత గురించి రాహుల్‌ మాట్లాడుతూ, “జయలలిత గారు ఒక అద్భుతమైన నేత అని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడి
ఈ సంభాషణ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, వలసవాద కాలం నాటి నిర్మాణాలతో పోలుస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా విమర్శించారు. “ఆర్‌ఎస్‌ఎస్ వాస్తవానికి మహారాజుల అధికార యంత్రాంగం. ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారి అధికార యంత్రాంగం. వలసవాదానికి ఎప్పుడూ భాగస్వాములు ఉండేవారు, ఆ భాగస్వాములే మహారాజులు, అధికార యంత్రాంగం,” అని ఆయన అన్నారు.

విద్యార్థులతో సంభాషణ
తరువాత ఈ సంభాషణ వివరాలను పంచుకుంటూ, విద్యార్థులు తమ ఆలోచనలలో స్పష్టంగా ఉన్నారని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని రాహుల్‌ గాంధీ అన్నారు.

“మహిళా రిజర్వేషన్ బిల్లుపై వారి అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం కాదు, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా అధికార సమతుల్యతను మార్చే ఒక మార్గం మాత్రమే” అని కాంగ్రెస్‌ అగ్రనేత అన్నారు.

విద్యార్థులు “హింస, ద్వేషం, పితృస్వామ్య రాజకీయాలను తిరస్కరిస్తారని”, రాజకీయాలను “ఐక్యత, సమానత్వం, గౌరవం”గా చూస్తారని రాహుల్‌ గాంధీ

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.