Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌తో ట్రంప్ ‘మహా ఒప్పందం’ కోరుకుంటున్నారు… జేడీ వాన్స్!

Share It:

వాషింగ్టన్‌: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక సంకుచిత ఒప్పందం కాకుండా, ఒక సమగ్ర ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నిన్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… దాదాపు వారం రోజులుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణకు సంబంధించిన ఒక వ్యూహంలో భాగంగానే చర్చలు కొనసాగుతున్నాయని వాన్స్ వివరించారు.

“ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఇది ఏడు రోజుల క్రితం మొదలైంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని” ఆయన అన్నారు. అంతేకాదు ట్రంప్ “చిన్న ఒప్పందానికి” ఇష్టపడటం లేదని వాన్స్ అన్నారు. “ఆయన మహా ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారని వాన్స్‌ అన్నారు. అయితే తుది ఒప్పందం ఇంకా కుదరలేదని వాన్స్ పేర్కొన్నారు.

“ఈ ఒప్పందం ఇంకా పూర్తి కాకపోవడానికి కారణం, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేని ఒప్పందం జరగాలని అధ్యక్షుడు బలంగా కోరుకోవడమే,” అని ఆయన అన్నారు. ఒప్పందం విజయవంతమైతే చర్చలు కొనసాగుతాయని వాన్స్ తెలిపారు. “మేము చర్చలు కొనసాగించి, దీనిని సాకారం చేయడానికి ప్రయత్నిస్తాము, ఎందుకంటే ఇది ప్రపంచానికి చాలా మంచిది. ఇది మన దేశానికి, ప్రతి ఒక్కరికీ మంచిది. కాబట్టి దీనిని సాకారం చేయడానికి నేను పోరాడుతూనే ఉంటాను,” అని ఆయన అన్నారు.

కాగా, ఇరాన్, అమెరికా మధ్య “చాలా అపనమ్మకం” ఉందని వాన్స్ చెప్పారు. “ఆ సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించలేరు. మన ఎదురుగా కూర్చున్న వారు ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుకున్నారని నేను భావిస్తున్నాను, అమెరికా అధ్యక్షుడు మమ్మల్ని చిత్తశుద్ధితో చర్చలు జరపమని చెప్పారని నాకు తెలుసు. మేము అదే చేశాము. మేము అదే చేస్తూ ఉంటాము,” అని వాన్స్‌ అన్నారు.

అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలు రాబోయే రెండు రోజుల్లో తిరిగి ప్రారంభం కావచ్చని ట్రంప్ అంతకుముందు ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాన్స్ ఈ ప్రకటన చేశారు.

“మీరు నిజానికి అక్కడే ఉండాలి, ఎందుకంటే రాబోయే రెండు రోజుల్లో ఏదైనా జరగవచ్చు, మేము అక్కడికి వెళ్లడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాము,” అని పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న న్యూయార్క్ పోస్ట్ విలేకరితో మంగళవారం టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.

సోమవారం ఫాక్స్ న్యూస్ హోస్ట్ బ్రెట్ బేయర్‌తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ…ఇస్లామాబాద్ చర్చలలో పురోగతి ఉందని, ఇరాన్ అధికారులతో “కొన్ని మంచి సంభాషణలు” జరిగాయని వివరించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.