బెంగళూరు: ఉత్కంఠత వీడింది. ఓపినియన్ పోల్స్, ఎగ్జిల్ పోల్స్ అంచనా వేసిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఈ ఫలితాలు అధికారం కాంగ్రెస్ పార్టీదే అధికారం అని స్పష్టం చేశాయి. అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 దాటడంతో ఆ పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు ముగిసే వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. కాంగ్రెస పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ప్రచారంలో ఉన్న నాయకులైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కీలక నేత డీకే శివకుమార్ తాము పోటీ చేసిన స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
ఇక కర్నాటకలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆశలు ఫలించలేదు. ఆ పార్టీ ముఖ్యనేతలు చాలా చోట్ల ఎదురీదుతున్నారు. 8 నుంచి 10 మంది మంత్రులు వెనుకంజలో ఉండటం బీజేపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. అధికార పార్టీపై కర్ణాటక ప్రజల్లో వ్యతిరేక ఉందని విపక్ష కాంగ్రెస్ మొదటి నుంచి గట్టిగా వాదిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలు చోట్ల మంత్రులు వెనుకంజలో ఉండటం విశేషం.
బీజేపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతాంగా చెప్పుకునే బళ్లారి వంటి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అక్కడ మెజార్టీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. గాలి జనార్ధన్ రెడ్డి దంపతులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఈ వార్త రాసే సమయానికి మధ్నాహ్నం 2:30కు వివిధ పార్టీల పరిస్థితి ఇలా ఉంది.