26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘ఇది సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ కర్ణాటక ఓటమిపై బీజేపీని దుయ్యబట్టిహరీష్ రావు!

హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు శనివారం మండిపడ్డారు.

“ఇది సౌత్ ఇండియా స్టోరీ – కర్ణాటకకు   బిజెపి నుంచి విముక్తి లభించింది అని భారత రాష్ట్ర సమితి (BRS) ప్రముఖ నాయకుడు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

“దక్షిణ భారతదేశం నుండి బిజెపి పతనం ప్రారంభమైంది. వారికి తెలంగాణలో డిపాజిట్ కూడా రాదు” అని ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ మాట్లాడుతూ… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని  అన్నారు.

కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కర్ణాటక తీర్పుతో తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండదని కెటిఆర్ తేల్చిచెప్పిన తర్వాత…. తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కూడా ఇదే రిపీట్ అవుతుందని ప్రకటించారు.

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles