30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు…. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తుల్ని నియమించాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో ఏడుగురు లాయర్ల నుంచి నేరుగా న్యాయమూర్తుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరో ఐదుగుర్ని న్యాయాధికారుల కోటా నుంచి ఎంపిక చేశారు. లాయర్ల కోటాలో కాసోజు సురేందర్, చాడా విజయ్ భాస్కర్ రెడ్డి, సురేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాది శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, నచ్చరాజు శ్రవణ్
కుమార్ వెంకట్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరంతా ప్రముఖ లాయర్లుగా ఉన్నత న్యాయస్థానాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు.
ఇక న్యాయాధికారుల కోటా నుంచి జి.అనుపమ చక్రవర్తి, ఎం.జి.ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డా।। డి.నాగార్జున్ లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.
గత సెప్టెంబర్లోనే జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి 7గుర్ని సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదించడంతో వారు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను 24నుంచి42కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీల భర్తీ చేపడుతూ వస్తున్నారు.
సెప్టెంబర్లో చేపట్టిన నియామకాలతో జడ్జిల సంఖ్య 18కి పెరిగింది. ఇప్పుడు మరో పన్నెండు మందిని సిఫార్సు చేశారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 30కి పెరగనుంది. గత సెప్టెంబర్లో హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఏడుగురు.. అందులో నలుగురు మహిళలు ప్రమాణం చేశారు. ఈ సారి కేంద్రం కొలీజియం చేసిన సిఫార్సులు ఆమోదిస్తే మరో రికార్డు సృష్టించినట్లవుతుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత వల్ల కేసులు పేరుకుపోతున్నాయి. ఈ ఇబ్బందిని గుర్తించిన సీజేఐ ఎన్వీ రమణ న్యాయమూర్తుల నియామకంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీకి ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మరియు న్యాయాధికారుల పదోన్నతితో పాటు, జార్ఖండ్, బొంబాయి మరియు కలకత్తా హైకోర్టులకు అనేక మంది న్యాయాధికారులను పదోన్నతి కల్పించాలని కూడా ఎస్సీ కొలీజియం సిఫార్సు చేసింది. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా లాయర్ రాజీవ్ రాయ్ మరియు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా పూనమ్ ఎ బాంబా, నీనా బన్సల్ కృష్ణ, దినేష్ కుమార్ శర్మ, అనూప్ కుమార్ మెండిరట్ట, స్వర్ణ కాంత శర్మ మరియు సుధీర్ కుమార్ జైన్‌ల పదోన్నతి ప్రతిపాదనను ఆమోదించింది. .

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles