న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ఈ యూనివర్సిటీకి ఆమె తొలి మహిళా వైస్ ఛాన్సలర్ కావడం విశేషం. 1986లో ఇదే యూనివర్సిటీలో ఆమె ఎంఫిల్ చేసి… యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. శాంతిశ్రీని అయిదేళ్ళ పాటు జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా నియమించినట్లు విద్యా శాఖ వెల్లడించింది. ఆమె ప్రస్తుతం సావిత్రిబాయ్ పూలె యూనివర్సిటీకి వైఎస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇంతవరకూ జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా ఉన్న జగదీష్ కుమార్ యూజీసీ ఛైర్మన్గా గత వారం నియమితులయ్యారు. శాంతిశ్రీ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించారు. తండ్రి ధూలిపూడి ఆంజనేయులు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ కాగా, తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్ గ్రాడ్ ఓరియంటల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్లో తమిళ్, తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, లాంగ్బీచ్, USA నుండి సోషల్ వర్క్లో డిప్లొమా పొందారు, హిస్టరీ అండ్ సోషల్ సైకాలజీలో B.A, మద్రాస్లోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్లో ఎంఏ చదివారు. యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఫిల్ పూర్తి చేసి, ‘పార్లమెంట్ అండ్ ఫారిన్ పాలసీ ఇన్ ఇండియా – ది నెహ్రీ ఇయర్స్’ అనే థీసిస్తో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పిహెచ్డి పూర్తి చేసిన ఆమె ఒకప్పుడు జెఎన్యులో విద్యార్థిని కావడం విశేషం.
పండిట్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్గా ఉన్నారు. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ను JNU వైస్-ఛాన్సలర్గా నియమించడాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆమె పదవీకాలం ఐదేళ్లు. శాంతి శ్రీ పండిట్ 1988లో గోవా యూనివర్శిటీలో అధ్యాపక వృత్తిని ప్రారంభించి, 1993లో పూణే యూనివర్సిటీకి మారారు. ఆమె వివిధ విద్యాసంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పదవిని నిర్వహించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ నామినీ సభ్యురాలు, ఆమె తన కెరీర్లో 29 మంది PhD విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది. జెఎన్యు తదుపరి వైస్-ఛాన్సలర్గా నియమితులయిన ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడికి ఇటీవలే యూజీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జగదీష్ కుమార్ ఒక అధికారిక ప్రకటనలో ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.