హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు సాగు, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లను ప్రతిపాదించిందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
వాస్తవంగా వ్యవసాయశాఖ రుణమాఫీకి రూ.31 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.23 వేల కోట్లు తదితర అంచనాలతో రూ.64 వేల కోట్ల మేరకు నిధులను ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. కానీ, రుణమాఫీతోపాటు రైతుభరోసా, పంటల బీమా పథకాల వాస్తవ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తాజా కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది నుంచి కొత్తగా రైతు కూలీలకు ఏటా రూ.12 వేల సాయం చేస్తామని ప్రకటించింది.
బడ్జెట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం, “వ్యవసాయం, అనుబంధ రంగం 15.8 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం, వ్యవసాయం స్థూల రాష్ట్ర విలువ జోడించిన (GSVA), అనుబంధ రంగాలు 2022-23తో పోలిస్తే 2023-24లో 4 శాతం పెరిగాయి. అయితే, ఈ రంగంలో ఉపాధి 47.3 శాతంగా ఉంది.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ విధానాలు, రైతులను బలోపేతం చేయడం చాలా అవసరం అని విక్రమార్క అన్నారు. ఇందుకోసం రైతులకు రెండు రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. “మొదటిది వ్యవసాయంలో అతని పెట్టుబడికి భరోసా మూలధనాన్ని అందించడం, రెండవది అతని పంటలకు భద్రత, లాభదాయకమైన ధరలను అందించడమని అన్నారు.”
వాస్తవానికి రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినప్పటికీ, పథకం అమలుకు అవసరమైన రూ.31,000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం క్రమపద్ధతిలో సేకరిస్తోంది. “ఇటీవలే ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీక గాను 11.34 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.6,035 కోట్లను ఎఫ్ఎల్డబ్ల్యూకి బదిలీ చేసింది. మిగిలిన రూ.2.00 లక్షల వరకు రుణాలు కూడా త్వరలో మాఫీ చేస్తామని” ఉపముఖ్యమత్రి తెలిపారు.