జెరూసలెం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దళాలు ఓవైపు పాలస్తీనాలో ఘోరమైన దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు రోజుల తరబడి సైనిక చర్యను కొనసాగిస్తున్నాయి. బుధవారం నాడు చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలలో… ఇజ్రాయెల్ దళాల చేతిలో ఒక టీనేజ్ బాలుడు, ఒక న్యాయవాదితో సహా ముగ్గురు పాలస్తీనియన్లను కాల్చి చంపినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తున్న సమయంలో చెలరేగిన ఇజ్రాయెల్-పాలస్తీనా హింసలో తాజా ఘటనలివి.
చనిపోయిన వారిలో ఒకరైన న్యాయవాది మొహమ్మద్ అస్సాఫ్, (34) అనుకోకుండా ఉత్తర వెస్ట్ బ్యాంక్ పట్టణం బీటాలోని యుద్ధ ప్రాంతంలోకి వెళ్లినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నాబ్లస్ సమీపంలో “సాయుధ అనుమానితుడు”పై దాడిచేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రకటనలో పేర్కొంది. ఇది అస్సాఫ్ను ఉద్దేశించిందో లేదో అస్పష్టంగా ఉంది.
మరొకరు 14 ఏళ్ల బాలుడు, బెత్లెహెమ్ సమీపంలోని హుసన్ అనే గ్రామంలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
యువకుడి మరణం ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలపై అంతర్జాతీయ విమర్శలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వారం ప్రారంభంలో, నిరాయుధురాలైన పాలస్తీనా మహిళ, ఆరుగురు వితంతువుల తల్లిని ఇజ్రాయిల్ దళాలు కాల్చి చంపడాన్ని యూరోపియన్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇటీవలి కాలంలో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ దళాల చేతిలో చనిపోయారు
ఇక బుధవారం ఇజ్రాయెల్ దళా నబ్లస్, ఇతర పట్టణాలు వాటి చుట్టుపక్కల 20 మందిని అదుపులోకి తీసుకున్నాయని పాలస్తీనా మిలిటరీ, పోలీసులు తెలిపారు. నబ్లస్ ఘర్షణల్లో లైవ్ బుల్లెట్లతో ఏడుగురు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో చెలరేగిన ఘర్షణల తర్వాత మార్చి చివరి నుండి జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్లో 14 మంది చనిపోయారు. ఆ తరువాత ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను తీవ్రతరం చేసింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 20 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సేనల చేతిలో హతమయ్యారు.
పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మాట్లాడుతూ, మిలిటరీ చర్యలతో జరిగిన మానవ హననానికి ఇజ్రాయెల్దే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ యొక్క ప్రతినిధి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెసిస్టెన్స్ ఫైటర్స్ను నియంత్రించడానికి పాలస్తీనా అథారిటీ తగినంతగా తోడ్పాటు అందించడం లేదని ఇజ్రాయిల్ ఆరోపించింది.
బుధవారం, ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ, వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పాలస్తీనియన్లపై మితిమీరిన బలప్రయోగం చేస్తుందని, ఇది మరింత తీవ్రతరం అయితే పరస్పర హింసకు దారి తీస్తుందని ఈజిప్ట్ విదేశాంగ ప్రతినిధి హితవు గరిపారు.
The State of Palestine warns against Israel’s escalating crimes against the Palestinian people, including collective punishment and calls on the international community to urgently intervene to protect the Palestinian people; pic.twitter.com/G1dR9NOiF8
— State of Palestine – MFA (@pmofa) April 13, 2022