హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెట్టిన కొత్త యూజీ, పీజీ కోర్సులు.. మైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆరు డిగ్రీ కోర్సులు, 18 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అనుమతుల పొడిగింపునకు కూడా ఏఐసీటీఈ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతి లభించినట్టయింది.
సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద గత విద్యా సంవత్సరం ప్రారంభించిన రెండు యూజీ కోర్సులకు ఒక్కొక్కటి 60 సీట్లకు అనుమతి లభించింది. “ఈ కోర్సులకు బాగా డిమాండ్లో ఉన్నందున ఏఐసీటీఈ గుర్తింపు మాకు ముఖ్యమైనది, తప్పనిసరి” అని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ అన్నారు.
బీఈఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్లో విద్యార్థుల సంఖ్య 50 నుంచి 60కి పెంచేందుకు కూడా ఏఈసీటీఈ అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. నూతన ఎంఈ కోర్సుకు గుర్తింపు, ఆమోదం లభించినందున గేట్ అర్హత కలిగిన విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్షిప్ వచ్చేందుకు మార్గం సుగమమైందన్నారు.
2022-23 నుండి బయో-మెడికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లోని 30 సీట్లలో, 10 ఇంటర్మీడియట్లో BiPC అభ్యసించిన TS EAMCET-అర్హత కలిగిన విద్యార్థులకు కేటాయించబడ్డాయి. అలాంటి విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద ప్రవేశం పొందుతారు.వారు గణితంలో బ్రిడ్జ్ కోర్సును అభ్యసించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు, ఈ ప్రోగ్రామ్లో ప్రవేశాలు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన అభ్యర్థులకు మాత్రమే.
స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం నుండి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం సవరించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, కళాశాల 40 శాతం సిలబస్ను పునరుద్ధరించింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు రెండింటిలో కనీసం 40 శాతం కోర్సు పాఠ్యాంశాలను కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు పరిశ్రమ మరియు R&D సంస్థల నిపుణులు డీల్ చేస్తారు.
“సవరించిన సిలబస్ 2022-23 విద్యా సంవత్సరంలో నమోదు చేసుకునే విద్యార్థులకు వర్తిస్తుంది, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదే సిలబస్ ఉంటుంది. పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల నుండి వచ్చిన ఇన్పుట్లను యుజి పిజి కోర్సులలో సవరించిన సిలబస్లో చేర్చారు. వీటిని సంబంధిత బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది, ”అని ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ వెంకటేష్ చెప్పారు.