Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథపై పార్లమెంటులో దుమారం!

న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథపై పార్లమెంటులో జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఇదంతా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవణే ప్రస్తావించిన ఫోన్ కాల్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో సైన్యానికి అందిన రాజకీయ ఆదేశాలు కేవలం “ఏది సబబు అనిపిస్తే అది చేయండి” అని మాత్రమే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ […]
Read more

భిన్నత్వంలో ఏకత్వపు భావనకు ప్రతీక… మహ్మద్ దీపక్ కుమార్, శైలా నేగీ!

ఈ మధ్య కాలంలో, సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తే కేవలం వార్తా కథనాలు, సెలబ్రిటీల అప్‌డేట్‌లు, స్నేహితుల నుండి వచ్చే అప్‌డేట్‌లు మాత్రమే కాకుండా, చట్టవిరుద్ధమైన, నైతికంగా ఖండించదగిన కంటెంట్ కూడా కనిపిస్తుంది. కెమెరా ముందు పేద ముస్లింలను వేధిస్తున్న వీడియోలను మనం చూస్తుంటాం. కొన్నిసార్లు వారు ముస్లింల దుకాణాల పేర్లను మార్చమని డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు వారు వారి గుర్తింపు కార్డులను చూపించమని డిమాండ్ చేస్తారు. మనలో చాలామంది ఈ చట్టవిరుద్ధమైన ప్రచారాలను ప్రత్యక్షంగా కూడా […]
Read more

వెస్ట్ బ్యాంక్ నుంచి 900 మంది పాలస్తీనియన్ల బహిష్కరణ… ఐక్యరాజ్యసమితి!

న్యూయార్క్‌: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్ల బహిష్కరణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సెటిలర్లు వారిపై హింసకు పాల్పడుతున్నారు. ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది 2026 ప్రారంభం నుండి ఇప్పటిదాకా 900 మందికి పైగా పాలస్తీనియన్లు తమ ఇళ్ల నుండి బలవంతంగా వెళ్లగొట్టారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈమేరకు UN ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ… “2026 ప్రారంభం నుండి పెద్ద ఎత్తున నిరాశ్రయులవుతున్నారు. 900 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయెలీ సెటిలర్లు వెళ్లగొట్టారని ఆయన అన్నారు. […]
Read more

అస్సాంలో బెంగాలీ ముస్లింలకు వ్యతిరేకంగా ‘సహాయ నిరాకరణ’… సీఎం హిమంత శర్మ!

గువహటి: బెంగాలీ ముస్లింలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమర్థించుకున్నారు. ఈమేరకు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన సూత్రాలను ఉదహరించారు. శివసాగర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్సాం సీఎం శర్మ మాట్లాడుతూ…బెంగాలీ ముస్లింలు “అస్సాంలో ఉండలేని” పరిస్థితులను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం ప్రతిరోజూ “20 లేదా 30” మందిని బహిష్కరిస్తున్నప్పటికీ, సామూహిక బహిష్కరణ సాధ్యం కాదని ఆయన వివరించారు. దానికి బదులుగా, […]
Read more

అమెరికాతో అణు చర్చల కోసం ఒమన్ చేరుకున్న ఇరాన్‌ విదేశాంగమంత్రి!

మస్కట్‌: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య అణు చర్చలు నేడు ఒమాన్‌లో జరుగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈమేరకు అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్నారని ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNA నివేదించింది. కాగా, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అణు సమస్యపై… న్యాయమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన, […]
Read more

విద్వేష ప్రసంగాల వ్యతిరేక చట్టాన్ని తీసుకురానున్న తెలంగాణ!

హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి,సమాజంలో శాంతిని కాపాడటానికి ఈ కఠినమైన చట్టాలను అమలు చేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జమాయత్ ఉలేమా-ఎ-హింద్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కాంగ్రెస్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిందని, దేశాభివృద్ధిలో జమాత్ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) […]
Read more

‘మైనారిటీలు, అసమ్మతిపై హింసను భారత ప్రభుత్వం సాధారణీకరిస్తోంది’….హ్యూమన్ రైట్స్ వాచ్!

భారతదేశంలో గత ఏడాది (2025) మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలు, రోహింగ్యా శరణార్థులను “అక్రమ వలసదారులు” అని పిలుస్తూ బహిష్కరించినందుకు గానూ హ్యూమన్ రైట్స్ వాచ్ తన వరల్డ్ రిపోర్ట్ 2026లో బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. 529 పేజీలు ఉన్నా ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక 36వ ఎడిషన్, సుమారు 100 దేశాల మానవ హక్కుల స్థితిని అంచనా వేసింది, మైనారిటీలపై హింస, స్వీయ-సెన్సార్ చేయమని బలవంతం […]
Read more

కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నా, గాజాలో ఇజ్రాయెల్ దాడులు…21 మంది పాలస్తీనియన్ల మృతి!

జెరూసలేం: గాజా ఎన్‌క్లేవ్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నప్పటికీ… నిన్న తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 21 మంది పాలస్తీనియన్లు మరణించగా, ఇతరులు గాయపడ్డారని వైద్య వర్గాలు తెలిపాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని అల్ మవాసి ప్రాంతంలోని స్ట్రీట్ 5 చుట్టూ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో పారామెడిక్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. […]
Read more

మధ్యప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణ…అస్తవ్యస్తం అయిన ముస్లిం కుటుంబాలు!

భోపాల్‌: విద్వేష ప్రసంగాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఈ కథనం చదివితే అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో, జనవరిలో జరిగిన హిందూ సమావేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసారు. ఈ ప్రసంగంతో ప్రభావితమైన ఘోటి-నండోరా గ్రామంలోని ఒక పెద్ద వర్గం…అక్కడి పది ముస్లిం కుటుంబాలను సామాజికంగా బహిష్కరించింది. ఫలితంగా ఈ ముస్లిం కుటుంబాలు రోజువారీ లావాదేవీలు, సేవలు, జీవనోపాధి కోసం ఇబ్బంది పడ్డారు. కాగా, ఈ సమావేశానికి హిందువులు ఎక్కువ మంది హాజరయ్యారు, […]
Read more

సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగగా… మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇప్పటికీ ఎలాంటి […]
Read more
1 2 3 142

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.