Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీజేపీ ‘ఓట్‌ చోరీ’కి పాల్పడింది…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో విస్తృతంగా “ఓటు దొంగతనం” (ఓటు చోరీ) జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌‌సభలో ఉన్న 240 బిజెపి ఎంపీల్లో దాదాపు ప్రతి ఆరవ ఎంపి ఓటు చోరీ ద్వారా సీటు దక్కించుకున్నారు’ అని రాహుల్‌ ఎక్స్‌‌లో పోస్టు చేశారు. “ఓటు దొంగతనం ద్వారా, కొన్నిసార్లు వ్యక్తిగత సీట్లను దొంగిలిస్తారు, మరికొన్నిసార్లు మొత్తం ప్రభుత్వాన్నే దొంగిలిస్తారని” ఆయన అన్నారు. అలాంటి ఓటు […]
Read more

నేడు మరోసారి గవర్నర్‌ను కలవనున్న విజయ్‌!

చెన్నై: తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేల సాంప్రదాయ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి రాజకీయాల్లోకి ఘనంగా అరంగేట్రం చేసిన నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నిన్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో జరిగిన సమావేశంలో తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇతరులు కూడా చేరతారని భావిస్తున్నప్పటికీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించలేదు. […]
Read more

ఇరాన్‌తో చర్చలు…మంచి పురోగతి ఉందన్న ట్రంప్‌!

వాషింగ్టన్‌: యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తున్న నేపథ్యంలో, గత 24 గంటల్లో టెహ్రాన్‌తో వాషింగ్టన్ “చాలా మంచి చర్చలు” జరిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “మేము ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని” ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో అగ్రరాజ్యాధినేత చెప్పారు. “ఇరాన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉంది. చాలా సజావుగా సాగుతోంది, ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, వారు చర్చలు జరపాలనుకుంటున్నారని” ట్రంప్ జోడించారు. యుద్ధాన్ని […]
Read more

భారీ సైబర్ క్రైమ్ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు…56 మంది అరెస్టు!

హైదరాబాద్: పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సైబర్ ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 32 మంది బ్యాంకింగ్ అధికారులతో సహా 56 మందిని అరెస్టు చేశారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ అనే కోడ్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్‌లో చెక్కులు, మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 101 కేసులకు సంబంధించి, డీసీపీ సైబర్ క్రైమ్స్ […]
Read more

బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హింస!

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల అనంతర హింస జరిగినట్లు తెలుస్తోంది. పలు ఘటనలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీర్‌భూమ్, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియా, బంకురా వంటి జిల్లాల్లో ఘర్షణలు, విధ్వంసం, చెదురుమదురు మరణాలు సంభవించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ కథనాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హౌరాలోని ఉదయ్‌నారాయణ్‌పూర్‌లో, విజయోత్సవాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న బీజేపీ […]
Read more

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు

న్యూఢిల్లీ: తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, TVK అధినేత విజయ్‌కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.మే 5, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) అత్యవసర సమావేశంలో TVKకి మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. TVKకి మద్దతుపై నిర్ణయం తీసుకునేందుకు, తమిళనాడు వ్యవహారాల AICC ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ‘జూమ్’ (Zoom) […]
Read more

“నేను రాజీనామా చేయను”: బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ ఓడిపోలేదన్న మమతా బెనర్జీ!

కోల్‌కతా: వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఈసారి ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆమె రాజీనామాను చేయడానికి నిరాకరించారు. దీంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది, దీని పరిష్కారం కోసం ఈసమస్య గవర్నర్ ఆర్.ఎన్. రవి వద్దకు చేరే అవకాశం ఉంది. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, బీజేపీకి లభించిన ప్రజా తీర్పు “దోపిడీ” ఫలితమేనని ఆమె వాదించారు. “నేను ఓడిపోలేదు, కాబట్టి నేను రాజ్‌భవన్‌కు వెళ్ళను. […]
Read more

హర్ముజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను నిలిపేసిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించేందుకు…ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో పురోగతి కారణంగా, హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. “ఒప్పందాన్ని ఖరారు చేసి, సంతకం చేయగలమో లేదో చూసేందుకు, ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను కొద్ది కాలం పాటు నిలిపివేస్తున్నాము,” అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనలను, అలాగే టెహ్రాన్‌తో తుది ఒప్పందం దిశగా […]
Read more

అరంగేట్రంలోనే విజయ్ సూపర్ హిట్…మెజారిటీ మార్కును దాటగలడా?

చెన్నై: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, అతని పార్టీ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో 107 సీట్లు గెలుచుకొని, మెజారిటీ మార్కుకు కేవలం 11 సీట్ల దూరంలో ఉన్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే – ఆ కీలకమైన 11మంది ఎక్కడి నుండి వస్తారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? ఏకైక అతిపెద్ద పార్టీగా, టీవీకే మైనారిటీ ప్రభుత్వంగా ప్రారంభమైనప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానం అందుకునే అవకాశం ఉంది. […]
Read more

సెంట్రల్‌ వర్సిటీలో SFI, ASA కళాకారులపై ABVP దాడి!

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్,అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) భారీ మెజారిటీతో విజయం సాధించిన రోజే, ఆ విజయాల ఉత్సాహపు ప్రకంపనలు హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) ప్రాంగణంలోనూ వినిపించాయి. అధికార మదంతో వ్యవహరించినట్లు భావిస్తున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విద్యార్థి కార్యకర్తలు, ఆడిటోరియం వెలుపల థియేటర్ ఆర్ట్స్ విభాగపు చివరి సంవత్సరం విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు; ఈ దాడిలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. థియేటర్ ఆర్ట్స్ విభాగానికి చెందిన ఒక […]
Read more
1 2 3 4 175

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.