Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అసంపూర్తిగా ముగిసిన హమాస్-ఇజ్రాయెల్ తొలి కాల్పుల విరమణ చర్చలు!

కైరో: ఖతార్‌లో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరిగిన మొదటి రౌండ్ పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిశాయి. ఈ విషయం గురించి తెలిసిన రెండు పాలస్తీనా వర్గాలు మాట్లాడుతూ… హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయెల్ ప్రతినిధి బృందానికి తగినంత అధికారం లేదని అన్నారు. దాదాపు ఆరు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్‌కు మూడవసారి […]
Read more

తెలంగాణలోని 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు…దాదాపు 3 లక్షల సీట్లు ఖాళీ!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు చేపట్టిన దోస్‌ కౌన్సెలింగ్‌ ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు నిండలేదు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, 60 కి పైగా డిగ్రీ కళాశాలలు సున్నా అడ్మిషన్లను నమోదు చేశాయి. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్‌ ఎంపికతో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) వెల్లడించిన DOST 2025 అడ్మిషన్ల […]
Read more

బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాన్ని విధించిన ట్రంప్!

వాషింగ్టన్: “బ్రిక్స్ యొక్క అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే” దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో చిక్కుకున్న బ్రిక్స్ నేతలు “సుంకాలలో విచక్షణారహిత పెరుగుదల” గురించి తమ “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసిన తర్వాత ఆయన ఈ విషయం చెప్పారు. ‘‘బ్రిక్స్ కానీ మరే సంస్థ కానీ అమెరికన్ వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశానికైనా అదనంగా పది శాతం సుంకంవిధిస్తాము. […]
Read more

అరుదైన భూ ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ విధించిన చైనా… భారతదేశంపై తీవ్ర ప్రభావం!

న్యూఢిల్లీ: ఆటో రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన అరుదైన భూ ఖనిజ ఎగుమతులపై చైనా పరిమితి విధించడం మనకు ఒక మేల్కొలుపు. ఈ పరిస్థితుల్లో మనదేశ పారిశ్రామిక ఆవసరాలకు వాడే కీలకమైన పదార్థాల దేశీయ అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారతదేశం అత్యవసరంగా చర్య తీసుకోవాలి. పరిశ్రమ ఎగుమతిదారుల ప్రకారం…భారత ఆటో రంగం చైనాలో దొరికే అరుదైన భూ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడటం వలన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సంతకం చేసిన బ్రిక్స్‌ నేతలు!

రియోడిజనీరో: పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదాన్ని “నేరపూరితమైనది, సమర్థించలేనిది”అని బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ […]
Read more

భారీ జనసందోహం మధ్య పూర్తయిన బీబీ కా ఆలం ఊరేగింపు!

హైదరాబాద్: ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన ముహర్రం 10వ రోజున ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో షియా ముస్లింలు అషురా ఊరేగింపును నిర్వహించింది. బీబీ కా అలం ఊరేగింపు డబీర్‌పురా నుంచి మొదలైంది. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేశా, మీర్ ఆలం మండి, పత్తర్‌గట్టి, మదీనా, దారుల్‌షిఫా మీదుగా ఊరేగింపు సాగి చివరకు చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. బీబీ కా ఆలం’ అనేది ఓ చెక్క […]
Read more

రాజ్-ఉద్ధవ్ ఠాక్రే పునఃకలయికపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ!

ముంబయి: శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెండు దశాబ్దాల తర్వాత ఏకమయ్యారు. మొదటిసారిగా ముంబైలోని వర్లిలో జరిగిన ‘మరాఠీ స్వరం’ విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నదమ్ములు కలిసిపోయారు. కాగా, థాకరే సోదరుల కలయికపై బేజేపీ విరుచుకుపడింది. ఈ ర్యాలీని జీహాదీ, హిందూ వ్యతిరేక సమావేశం అంటూ […]
Read more

ఎస్పీ నేత ఆజం ఖాన్ పార్టీ నుంచి వైదొలగే అవకాశం, ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ పొత్తు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆజం ఖాన్, యూపీ రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం ఓటర్లలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య, మాజీ ఎంపీ తజీన్ ఫాత్మా ఇటీవల చేసిన ప్రకటన ఈ ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది, ఎస్పీ నుండి వైదొలగడం, మరొక రాజకీయ పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోవడంపై ఆమె సంకేతాలు […]
Read more

తమిళనాడులో దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్ష…విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

చెన్నై: విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన నలుగురు దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు సమర్పించిన పిటిషన్‌ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తనతో పాటు తన ముగ్గురు సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదేపదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. “మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో […]
Read more

గాజాలోని నాజర్ హాస్పిటల్ ఓ ‘ట్రామా వార్డ్’…డబ్ల్యూహెచ్‌ఓ!

జెనీవా: గాజాలోని నాజర్ హాస్పిటల్ “ఒక భారీ ట్రామా వార్డ్”గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులతో గాయపడిన రోగులను ఈ ఆస్పత్రికి తరలిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) మే నెలాఖరులో గాజాలో ఆహార పంపిణీ చేయడం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో వైమానికి దాడుల కారణంగా మరణించిన లేదా గాయపడిన వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు […]
Read more
1 103 104 105 106 107 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.