Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం…రెవెన్యూ మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయని, ఇది గందరగోళానికి, అసౌకర్యానికి కారణమవుతోందని ఆయన ఎత్తి చూపారు. అంతేకాదు మండలాలు, జిల్లాలను ఏకపక్షంగా విభజించారని, ఇది పరిపాలనాపరమైన అవకతవకలకు దారితీసిందని మంత్రి అన్నారు. కొన్ని సందర్భాల్లో, జిల్లాల […]
Read more

నోబెల్ గ్రహీత అమర్త్య సేన్‌కు SIR నోటీసు…వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషన్‌!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలపై విచారణ కోసం ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే టీమిండియా పేసర్ మహమ్మద్‌ షమి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటుడు దేవ్‌కు కూడా ఈసీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదంతా బెంగాల్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడమేనని ఈసీపై మండిపడ్డారు. దీనిపై […]
Read more

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియను “అమానవీయం”గా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటానికి దిగుతానని ఆమె ప్రకటించారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నేడు కోర్టును ఆశ్రయిస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టులోనూ పోరాడతానని దీదీ ఘాటుగా హెచ్చరించారు. ఈమేరకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ద్వీపంలో జరిగిన ఓ బహిరంగ సభలో […]
Read more

వెనిజులాపై అమెరికా చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన!

న్యూఢిల్లీ: వెనిజులాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను నిర్బంధించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనికి నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. వెనిజులాపై “సామ్రాజ్యవాద సైనిక దురాక్రమణ”ను సిపిఐ(ఎం) నాయకత్వం అమెరికాను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ చర్యకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని కోరింది. దక్షిణ అమెరికా దేశంలోని చమురు వనరులను “స్వాధీనం” చేసుకోవడానికి అమెరికా వెనిజులాపై దాడి చేసిందని నిరసనకారులు ఆరోపించారు. […]
Read more

ప్రపంచ న్యాయమూర్తి’గా వ్యవహరించే దేశాలను సమర్ధించమన్న చైనా!

బీజింగ్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భంధించడాన్ని చైనా ఘాటుగా విమర్శించింది.”ప్రపంచ న్యాయమూర్తి”గా వ్యవహరించే ఏ దేశాన్ని బీజింగ్ అంగీకరించదని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. “ఏ దేశం ప్రపంచ పోలీసుగా వ్యవహరించగలదని మేము ఎప్పుడూ భావించలేదు, అలాగే ఏ దేశం కూడా ప్రపంచ న్యాయమూర్తిగా చెప్పుకోవడాన్ని మేము ఎప్పుడూ అంగీకరించము” అని బీజింగ్‌లో జరిగిన సమావేశంలో వాంగ్… అమెరికాను నేరుగా ప్రస్తావించకుండా “వెనిజులాలో ఆకస్మిక పరిణామాలను” ప్రస్తావిస్తూ అన్నారు. “అంతర్జాతీయ […]
Read more

భారీ ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలలో… పెండింగ్‌లో ఉన్న, కొత్త సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 50,000 కోట్లను సమీకరించేందుకు ముంబైకి చెందిన ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థతో చర్చలు జరుపుతోంది. మొన్నటి ముంబై పర్యటన సందర్భంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఆర్థిక సంస్థ ప్రతినిధులతో ఒక ‘రహస్య’ సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఆ సంస్థ నుండి కనీసం రూ. […]
Read more

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తున్న భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్చరిక జారీ చేశారు. ”ప్రధాని మోడీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేము మరిన్ని టారిఫ్‌లను విధిస్తాం” అని పేర్కొన్నారు. “రష్యా చమురు విషయంలో వారు సహాయం చేయకపోతే, మేము భారతదేశంపై సుంకాలను పెంచవచ్చు,” అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అన్నారు. కాగా, ఎయిర్ […]
Read more

ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఐదేళ్లనాటి ఢిల్లీ అల్లర కేసులో అరెస్టయిన ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వారిపై ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంది. అయితే ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం బెయిలిచ్చింది. ఈ మేరకు జస్టిస్​ అరవింద్​ కుమార్​, జస్టిస్​ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం నేడు కీలక తీర్పును వెలువరించింది. కాగా, డిసెంబర్ 10న ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ […]
Read more

‘మదురో’ నిర్బంధం ‘తీవ్ర ఆందోళనకరమన్న’భారత్‌…అమెరికాను ప్రస్తావించని వైనం!

న్యూఢిల్లీ: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భందించడంపై భారతదేశం తన మౌనాన్ని వీడింది. “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది, కానీ వాషింగ్టన్ పేరును ప్రస్తావించలేదు సరికదా… లాటిన్ అమెరికన్ నేతను పట్టుకునేందుకు చేసిన సైనిక దాడులను మన దేశం ఖండించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జనవరి 3) అమెరికా దళాలు “ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్” పేరిట దాడులు నిర్వహించాయని ప్రకటించారు. ఇది వెనిజులాపై పెద్ద ఎత్తున సైనిక దాడి, దీని ఫలితంగా మదురో, […]
Read more

ఇండోర్ నీటి కాలుష్యం…‘ఘంటా’ పదాన్ని ప్రస్తావించినందుకు అధికారి సస్పెండ్!

ఇండోర్/దేవాస్: ఇండోర్ నీటి కాలుష్య సంక్షోభం మధ్య, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సస్పెండ్ చేశారు. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను, కాంగ్రెస్ ఆరోపణలను తన అధికారిక ఉత్తర్వులో ఉటంకించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక విధులను నిర్వర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఉదాసీనత, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఉజ్జయిని డివిజన్ రెవెన్యూ కమిషనర్ ఆశిష్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు. ఆదివారం దేవాస్‌లో కాంగ్రెస్ […]
Read more
1 12 13 14 15 16 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.