Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు…పదిరోజుల్లో నాలుగోసారి పెంపు!

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.61, డీజిల్ ధర రూ.2.71 పెరిగింది. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ధరలను యథాతథంగా ఉంచడం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరల సవరణలను కొనసాగిస్తున్నాయి. దీంతో గత రెండు వారాల్లో మొత్తం రూ.7.5 పెంచినట్టైంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా హర్ముజ్ జలసంధి మూసుకుపోవడమే ఈ పెరుగుదలకు […]
Read more

గ్రీన్‌కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు తెచ్చిన అమెరికా!

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డులు కోరుకునే వలసదారులు తప్పనిసరిగా అమెరికాను విడిచిపెట్టి, వారి స్వదేశాల నుండి దరఖాస్తు చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కాగా, గతంలో, విద్యార్థి, పర్యాటక లేదా పని వీసాలపై యూఎస్‌లో నివసిస్తున్న చాలా మంది విదేశీయులు దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోగలిగేవారు. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (AOS) అని పిలుచుకునే ఈ ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉండేది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ […]
Read more

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కీలక పథకాలు ప్రారంభించే అవకాశం!

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు నేటి క్యాబినెట్‌ భేటీలో తీసుకోనున్నారు. రెండు లక్షల కొత్త పెన్షన్లు, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, మరిన్ని వర్గాలకు గృహవసతి కల్పించడం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశపు అజెండాలో ఉన్నాయి. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను అప్పగించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో, గృహవసతి పథకం […]
Read more

ఇరాన్‌లో పర్యటిస్తున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీఫ్‌ మునీర్‌!

టెహ్రాన్‌: పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతి ఒప్పందాలు కుదిరేలా ఇరాన్‌ను ఒప్పించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. మధ్యప్రాచ్య యుద్ధంపై దౌత్యం ఊపందుకుంటున్న తరుణంలో పాకిస్థాన్ సైన్యాధిపతి టెహ్రాన్‌ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఇరాన్… అమెరికా చేసిన కొత్త శాంతి ప్రతిపాదనపై కసరత్తు చేస్తూనే, ఒప్పందానికి ఇంకా తీవ్ర విభేదాలు అడ్డుగా ఉన్నాయని హెచ్చరిస్తోంది. ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ […]
Read more

ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్న కాంక్రోచ్‌ జనతా పార్టీ!

సలీమ్ షేక్…🖋️ ముంబై: “కాంక్రోచ్‌ జనతా పార్టీ” కేవలం ఒక ఇంటర్నెట్ జోక్‌గా ప్రారంభమై, బలంగా విస్తరించింది. లక్షలాది మంది యువ భారతీయులకు, ఇది నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సామాన్య ప్రజలకు, శక్తివంతమైన సంస్థలకు మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది. దేశ సీజేఐ నిరుద్యోగ యువతను “బొద్దింకలతో” పోల్చడంతో ఈ వివాదం మొదలైంది. ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువత కేవలం కోపంతో స్పందించకుండా, ఆ అవమానాన్ని వ్యంగ్యంగా మార్చి… […]
Read more

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా!

హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ (TGEC) ఛైర్మన్ అకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు.ఈమేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు ఉద్దేశించిన తన రాజీనామా లేఖలో, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగాల స్థితిగతులపై సమగ్ర నివేదికను, తగిన సిఫార్సులతో సహా సమర్పించే బాధ్యతను కమిషన్ పూర్తి చేసిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా సేవలు అందించే అవకాశాన్ని కల్పించినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, విద్యా […]
Read more

తెలంగాణలోని ఇటుక బట్టీల నుంచి 518 మంది వెట్టిచాకిరి కార్మికుల విముక్తి!

హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల నుంచి వెట్టిచాకిరి కార్మికులుగా భావిస్తున్న వారిలో ఒకరు తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 518 మందిని రక్షించారు. ఈ ఫిర్యాదును హైదరాబాద్‌లోని న్యాయ సేవల అథారిటీకి సమర్పించగా, అక్కడి నుంచి జిల్లా జడ్జి జి.వి.ఎన్. భరత లక్ష్మికి పంపించారు. అథారిటీ ఆదేశాల మేరకు ఆ న్యాయాధికారి మే 19న జిల్లాలోని ఆర్మూర్‌లో ఉన్న ఒక ఇటుక బట్టీని సందర్శించారు. ఇటుక బట్టీలలో తగినంత […]
Read more

అంతర్జాతీయ వ్యతిరేకత… గాజా ఫ్లోటిల్లా కార్యకర్తలను విడుదల చేసిన ఇజ్రాయెల్!

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన వందలాది మంది ఫ్లోటిల్లా కార్యకర్తలను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేసి, తమ దేశం నుంచి బహిష్కరించింది. సామాజిక కార్యకర్తల పట్ల వ్యవహరించిన తీరుపై విదేశాలలో చెలరేగిన ఆగ్రహం కారణంగా, పలు దేశాలు తమ ఆందోళనలను తెలియజేయడానికి ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించాయి. సుమారు 420 మంది కార్యకర్తలు టర్కీకి వెళ్లే విమానాలలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరి, గురువారం సాయంత్రం ఇస్తాంబుల్‌లో దిగారు. బూడిద రంగు స్వెట్‌సూట్‌లు, […]
Read more

కేబీఆర్ పార్క్ నిరసనకారుల అరెస్టుపై డీజీపీ, కలెక్టర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు సమీపంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐదుగురు పర్యావరణ కార్యకర్తల ఏకపక్ష అరెస్టు, నిర్బంధంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటన నిర్ధారణ అయితే అది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని హెచ్చరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, […]
Read more

హోండురాస్‌లో దుండగుల కాల్పులు… 25 మంది మృతి!

టెగుసిగల్పా, హోండురాస్ : హోండురాస్ తీర ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు దాడుల్లో దుండగులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులతో సహా కనీసం 25 మంది మరణించారని అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి యూరి మోరా ప్రకారం…మొదటి కాల్పుల ఘటన ఉత్తర హోండురాస్‌లోని ట్రుజిల్లో మునిసిపాలిటీ సమీపంలో ఉన్న ఒక క్వారీలో జరిగింది. ఈ దాడిలో కనీసం 19 మంది కార్మికులు మరణించారని ఎన్‌డిటివి నివేదించింది. గుర్తుతెలియని […]
Read more
1 11 12 13 14 15 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.