Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో మానవత్వం మంటగలుస్తోంది…అక్కడి స్థితి నరకం కంటే దారుణంగా ఉందన్న రెడ్ క్రాస్ చీఫ్!

జెరూసలేం : గాజాలో మానవత్వం మంటగలిసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పోల్జారిక్ హెచ్చరించారు, యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న బాధలను చూడటం భరించలేనిదిగా మారుతోంది. పరిస్థితి నైతిక, మానవీయ ప్రమాణాలను మించిపోయిందని ఆమె BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొన్ని వారాల క్రితం, గాజా పర్యటన సందర్భంగా, వేదనకు గురైన రెడ్ క్రాస్ చీఫ్ గాజా భూమిపై నరకంగా మారిందని వ్యాఖ్యానించారు. మంగళవారం BBCకి చెందిన జెరెమీ బోవెన్‌తో […]
Read more

ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి…11మంది మృతి, 50మందికి గాయాలు!

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత వారిని సత్కరించే కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. టిక్కెట్లు, పాస్‌లు ఉన్న వ్యక్తులకే స్టేడియంలోకి అనుమతించినప్పటికీ, భారీసంఖ్యలో అభిమానులు తమ క్రికెట్ హీరోలను […]
Read more

రఫాలోని గాజా సహాయ పంపిణీ కేంద్రం వద్ద ఇజ్రాయెల్‌ కాల్పులు… 27 మంది పాలస్తీనియన్ల మృతి!

జెరూసలేం: దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఆహార పంపిణీ కేంద్రం సమీపంలో నిన్న ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 27 మంది పాలస్తీనియన్లు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. వరుసగా మూడవరోజు కూడా ఇజ్రాయెల్‌ రక్తపాతానికి పూనుకోవడంతో సహాయ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. రఫాలోని పంపిణీ కేంద్రం సమీపంలో నిర్దేశించిన మార్గాలను దాటి వెళ్ళిన వ్యక్తుల సమూహంపై తమ దళాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఏమి జరిగిందో దర్యాప్తు […]
Read more

అమెరికాకు సరెండర్‌ అయిన నరేందర్‌… పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై రాహుల్ గాంధీ విమర్శలు!

భోపాల్: భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భోపాల్ లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, అమెరికా తన నౌకాదళాన్ని పంపినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1971 యుద్ధంలో చలించలేదని రాహుల్‌ అన్నారు. “భారత్‌, పాక్ ఉద్రిక్తతల సందర్భంగా‌ కాల్పుల విరమణ ఆపాలని ట్రంప్ ఆదేశించారు మోడీ పాటించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. చరిత్ర […]
Read more

ముస్లిం వ్యతిరేక హింస, బుల్డోజర్ అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన జమాతే ఇస్లామీ హింద్!

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేక హింసపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఇళ్ళు, మదర్సాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి బుల్డోజర్లను వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు. “మూక దాడులకు పాల్పడటం అన్యాయం”: JIH అలీఘర్‌లో నలుగురు ముస్లిం మాంసం వ్యాపారులపై జరిగిన దారుణమైన దాడిని జేఐహెచ్‌ ఉపాధ్యక్షుడు మాలిక్ మోహతసిమ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. “కోపంగా ఉన్న ఒక గుంపు ఈ వ్యక్తులను అడ్డగించి, వారి బట్టలు […]
Read more

ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన మ్యూజియంకు మద్దతు తెలిపిన తెలంగాణ జర్నలిస్టులు, కార్యకర్తలు!

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రెండు ప్రొఫెసర్ల క్వార్టర్లలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు సీనియర్ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు మద్దతు తెలిపారు, దీనిని రిటైర్డ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు స్థాపించిన ఆది ధ్వని ట్రస్ట్ లీజుకు తీసుకుంది. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఈ ప్రయోజనం కోసం పునరుద్ధరించిన క్వార్టర్స్‌లో ఏర్పాటైన 6 మినీ మ్యూజియంలు ఏ ప్రైవేట్ పార్టీకి చెందినవి కావని, కేంద్ర సంస్కృతి, పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ఆది […]
Read more

‘హజ్’లో (AI) ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌!

ఈ ఏడాది హజ్ యాత్రలో సౌదీ అరేబియా సాంకేతికతకు పెద్దపీట వేసింది. మనారహ్ 2 అనే ఏఐ రోబోను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది హజ్ యాత్రికులకు మార్గనిర్దేశం చేయనుంది. ఈ రోబో అరబిక్, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం, ఉర్దూ భాషల్లోనూ మాట్లాడగలదు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది అల్లాహ్ అతిథులుగా మక్కాకు వచ్చే హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా ఆతిథ్యమిస్తోంది. అందుకోసం అత్యాధునిక ఏర్పాట్లను చేసింది. ఈ సారి, మక్కా – మదీనా లోని పవిత్ర […]
Read more

ఇరాన్ నుండి పెట్రోకెమికల్ దిగుమతులు…అదానీ గ్రూప్‌పై అమెరికా దర్యాప్తు?

న్యూఢిల్లీ: గత నెల యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి ఆయిల్, ఎల్పీజీ, పెట్రోకెమికల్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం నిషేధిం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌ నుండి అదానీ పోర్ట్స్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు జరిగాయని, దీనిపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ రేవులకు రాలేదని […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారంటూ అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: మొన్న కోల్‌కతాలో జరిగిన బిజెపి ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం సమాజంపై, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జాతీయ రాజకీయాల్లో మతపరమైన విద్వేష వ్యాఖ్యలు ఉపయోగించడంపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ కార్యకర్త సమ్మేళన్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ… 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ […]
Read more

ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి…మణిపూర్‌లో వెయ్యిమందిని రక్షించిన సైన్యం!

గౌహతి: రెండేళ్ల క్రితం జాతి ఘర్షణతో అట్టుడికిన మణిపూర్‌ గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహించడం, కరకట్టలు తెగిపోవడం వల్ల 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయని, 19,811 మంది ప్రజలు ప్రభావితమయ్యారని వారు తెలిపారు. మణిపూర్‌లో మైతీ-కుకీ సంఘర్షణను పరిష్కరించడానికి మోహరించిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మైతీ ఆధిపత్యం కలిగిన ఇంఫాల్ తూర్పు, […]
Read more
1 151 152 153 154 155 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.