Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘ఓటు చోరీ’ అతిపెద్ద ‘దేశ ద్రోహం’…రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికారపార్టీ తీవ్ర విమర్శలు చేశారు. కాషాయపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడి భారతదేశ భావనను నాశనం చేసింది. తద్వారా బీజేపీ అతిపెద్ద దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ని “ ఉపయోగిస్తోందని” పలు ప్రశ్నలను సంధించారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు […]
Read more

గ్లోబల్ సమ్మిట్… తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఘనంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.5.39 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్‌తో పాటు పునరుత్పాదక ఇంధనం, లైఫ్ సైన్సెస్, వినోద రంగాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి. ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఎంవోయూలు చేసుకున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల […]
Read more

సిరియాలో బషర్ అల్-అసద్ పతనానికి ఏడాది పూర్తయింది!

డమాస్కస్‌: సిరియాలో బషర్ అల్-అసద్ పాలన కూలిపోయి ఏడాది పూర్తయింది. దాదాపు 14 సంవత్సరాల యుద్ధం తర్వాత డిసెంబర్ 8, 2024న తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో అసద్ సిరియాను విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆయన 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. కాగా, అల్-అసద్ రష్యాకు పారిపోయాడు, అక్కడ అతనికి ఆశ్రయం లభించింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా బలమైన సిరియాను పునర్నిర్మిస్తానని” ప్రతిజ్ఞ చేశారు. కానీ అసద్ పతనం తర్వాత కూడా […]
Read more

‘ఇండిగో’ గందరగోళంపై సమాధానం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్‌!

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై దుమారం చెలరేగింది. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి… సభనుంచి వాకౌట్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. “మిస్టర్ […]
Read more

మూడవ తరగతి పాఠాన్ని ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించిన టీవీ ఛానళ్లకు మందలింపు!

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌టీ పుస్తకంలోని మూడవ తరగతి పాఠాన్ని కల్పిత ‘లవ్ జిహాద్’ కథనంగా మార్చినందుకు పలు టీవీ ఛానెల్‌లను న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) మందలించింది. ఆ మతపరమైన ప్రసారాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది. కాగా, ఈ కథనాన్ని ఇండియా టీవీ, న్యూస్ 18 మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ABP న్యూస్ వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసాయి. విషయంలోకి వస్తే…రీనా అనే అమ్మాయి “చిట్టి ఆయి హై” అనే […]
Read more

భారత బియ్యంపై అదనపు సుంకం విధిస్తామని ట్రంప్‌ హెచ్చరిక!

వాషింగ్టన్‌: ఇండియాపై ఇప్పటికే 50 శాతం అదనపు వాణిజ్య సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ముఖ్యంగా భారతదేశం నుండి బియ్యం దిగుమతులపై కొత్త సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాలతో వాణిజ్య చర్చలు పెద్దగా పురోగతి లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రైతుల కోసం 12 బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ […]
Read more

గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున రూ.2.43 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు!

హైదరాబాద్: ఫ్యూచర్‌ సిటీలో ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ నిన్నఅట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనలు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, పవర్, ఫిల్మ్, మీడియా, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల నుంచి వచ్చాయి. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి. ఈ భారీ పెట్టుబడులు […]
Read more

హైదారాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్న తెలంగాణ!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనికాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారిని ఇకపై ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఒక […]
Read more

న్యూయార్క్‌లో అమెరికా, ఖతార్, ఇజ్రాయెల్ రహస్య త్రైపాక్షిక సమావేశం!

వాషింగ్టన్‌: దోహాలో హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జెట్‌లు వైమానిక దాడి చేసిన కొన్ని నెలల తర్వాత… ఆదివారం న్యూయార్క్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఖతార్‌లు త్రిముఖ సమావేశం నిర్వహించాయి. “గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం తర్వాత దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇది, దీనికి ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది” అని రెండు వర్గాలు ఆక్సియోస్‌తో చెప్పాయి. కాగా, వైట్ హౌస్ వెంటనే సమావేశాన్ని ధృవీకరించలేదు. వైట్ హౌస్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ […]
Read more

ఇండిగో సంక్షోభం…ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన ఎయిర్‌లైన్!

న్యూఢిల్లీ: భారతదేశంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను స్తంభింపజేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ రాజకీయ విరాళాలు దానిని వెంటాడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు 2023లో ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. భారత ఎన్నికల కమిషన్ డేటా 2024 ప్రకారం… ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ గ్రూపులు రూ. 36 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని […]
Read more
1 23 24 25 26 27 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.