Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్ విమానాశ్రయంలో ఆరు కిలోల గంజాయితో పట్టుబడ్డ ప్రయాణికుడు!

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. కాగా, దీని మొత్తం బరువు 6.15 కిలోలు కావడం గమనార్హం. ఈ కేసులో ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ దాడుల్లో భాగంగా, డీఆర్ఐ (DRI) అందించిన నిర్దిష్ట […]
Read more

హైదరాబాద్‌లో మే 9న పాస్‌పోర్ట్ మేళా!

హైదరాబాద్: తెలంగాణలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, ఆర్‌పిఓ హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలన్నింటిలో 4,000 సాధారణ అపాయింట్‌మెంట్‌లు విడుదల చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం సుదీర్ఘ కాలంపాటు వెయిటింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కరీంనగర్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు కూడా కార్యాలయం ప్రకటించింది. […]
Read more

‘ఒపెక్’ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన యూఏఈ!

దుబాయ్: చమురు ఉత్పత్తిపై ఆంక్షలతో యూఏఈ సతమతమవడం, పొరుగున ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు దెబ్బతినడంతో…ఒపెక్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌)నుంచి వైదొలగనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. యూఏఈ చాలాకాలంగా ఒపెక్‌లో సభ్యదేశంగా ఉంది. మొదట 1967లో అబుదాబి ఎమిరేట్ ద్వారా, ఆ తర్వాత 1971లో యూఏఈ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు సభ్యదేశంగా ఉంది. కానీ, మధ్యప్రాచ్యంలో తన సొంత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడానికి […]
Read more

బెంగాల్‌లో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ కన్నా ఇది మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. దక్షిణ బెంగాల్ నుంచి 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాష్ట్ర రాజధాని కోల్‌కతా నుంచి 11 స్థానాలు ఉన్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏకంగా 92 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత, ఈ విషయాన్ని తమకు […]
Read more

బెంగాల్‌లో ఈసీ అత్యుత్సాహం… వేలాది మంది నిర్బంధానికి ఆదేశాలు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌కు ముందు, వేలాది మందితో కూడిన ఒక రహస్య ‘ జాబితా’ను ఎన్నికల సంఘం పంపిణీ చేసింది. వారిపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీరిలో అధికశాతం ముస్లింలు, చాలామంది టీఎంసీతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. ఇలాంటి జాబితాపై కలకత్తా హైకోర్టు స్టే విధించి, ఎన్నికల సంఘానికి ‘అపరిమిత అధికారాలు’ లేవని పేర్కొన్న కొద్ది రోజులకే ఈ చర్య తీసుకుంది. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాలకు సంబంధించి, తృణమూల్ కాంగ్రెస్‌తో […]
Read more

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తేస్తే… హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామన్న ఇరాన్!

టెహ్రాన్‌: ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేసి, యుద్ధాన్ని ముగిస్తే, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, ఈ వ్యూహాత్మక జలమార్గంలో నౌకాయానాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్‌కు చేరవేసిన ఈ ప్రతిపాదన, ఇరుపక్షాల మధ్య ప్రధాన విభేదాలు ఇంకా పరిష్కారం కానప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని సూచిస్తుంది. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది. కానీ, ఫిబ్రవరి 28న […]
Read more

క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు మృతి!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో నిన్న సాయంత్రం ఒక ప్రీఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తయారీ యూనిట్‌లో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహాలింగాపురం గ్రామంలో సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది. క్రేన్ కూలినప్పుడు 17 మంది కార్మికులు ఒక షెడ్డులో తలదాచుకున్నారు. […]
Read more

మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి…మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మరో రాజకీయ దుమారం రేగింది. “మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి” అని, యువత అంతా ఆయన అసలు రూపాన్ని గమనిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో పాటు మహిళా సాధికారతకు విస్తృత పిలుపునిచ్చారు. “రెండు విషయాలు స్పష్టం: 1. మాంత్రికుడి దగ్గర […]
Read more

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో యూఏఈకి ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్!

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌ తన ప్రతిష్టాత్మక వాయు రక్షణ వ్యవస్థ ఐరన్‌డోమ్‌ను తొలిసారిగా విదేశాల్లో అమర్చనుంది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ బ్యాటరీతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపినట్లు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. గల్ఫ్ అంతటా ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన తర్వాత, సంఘర్షణ ప్రారంభ దశలో ఈ మోహరింపు జరిగింది. […]
Read more

ముస్లింలపై మరోసారి నోరుపారేసుకున్న అస్సాం సీఎం హిమంత!

కోల్‌కత: బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారి మధ్య స్పష్టమైన మతపరమైన భేదాన్ని చూపుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కొత్త వివాదాన్ని రేకెత్తించారు. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన హిందువులను హింసకు గురైన శరణార్థులుగా, ముస్లింలను అక్రమ చొరబాటుదారులుగా పరిగణించి, వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆయన వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బంగ్లాదేశ్ హిందువులను, ముస్లింలను ఒకే వర్గంగా చూడలేమని శర్మ నొక్కి చెప్పారు. “బంగ్లాదేశీ […]
Read more
1 21 22 23 24 25 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.