Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా సుంకాల ఒత్తిడి మధ్య పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: భారత్‌, రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని హైలైట్ చేస్తూ నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికారు. పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధినేత ఢిల్లీకి వచ్చారు. నేడు ఇరుపక్షాలు అధికారిక చర్చలు జరుపుతాయి, ఒప్పందాల మార్పిడి చేసుకుంటాయి. […]
Read more

మమ్దానీ అరెస్టు చేస్తానన్నప్పటికీ న్యూయార్క్ సందర్శిస్తానంటున్న నెతన్యాహు!

న్యూయార్క్: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) వారెంట్ ప్రకారం నెతన్యాహును అరెస్టు చేస్తామని కాబోయే మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించినా …ఇప్పటికీ న్యూయార్క్‌ను సందర్శించాలని యోచిస్తున్నానని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. “అవును, నేను న్యూయార్క్ వస్తాను” అని నెతన్యాహు బుధవారం న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ ఫోరమ్‌కు ఇచ్చిన వర్చువల్ ఇంటర్వ్యూలో అన్నారు. మమ్దానీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారా అని అడిగినప్పుడు, నెతన్యాహు “అతను తన మనసు మార్చుకుని ముందుకు వస్తే అది సంభాషణకు మంచి ప్రారంభం అవుతుంది” అని […]
Read more

ఆర్‌ఎస్‌ఎఫ్‌ ‘ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్’ జాబితాలో అదానీ గ్రూప్!

న్యూఢిల్లీ: భారతదేశం సహా 180 దేశాలలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను ప్రచురించే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF)సంస్థ ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్ జాబితాను ప్రచురించింది. ఇందులో రెండు భారతీయ సంస్థలైన అదానీ గ్రూప్, హిందూత్వ వెబ్‌సైట్ ఓపీఇండియా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ ఏటా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఇందులో భారతదేశం 180 దేశాలలో 151వ స్థానంలో ఉంది. ‘ప్రెడేటర్స్’ జాబితాలో… “జర్నలిస్టులను చంపడం, సెన్సార్ చేయడం, జైలులో పెట్టడం, దాడి చేయడం, […]
Read more

బీజేపీకి 757 కోట్లు విరాళం ఇచ్చిన టాటా గ్రూప్!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ 2024-25లో వివిధ ఎలక్టోరల్ ట్రస్టుల నుండి రూ. 959 కోట్లు రాజకీయ విరాళాలుగా అందుకుంది. వీటిలో దాదాపు రూ. 757 కోట్లు ఒక్క టాటా గ్రూప్‌నుంచే రావడం విశేషం. ఇది కాషాయ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలలో 83% కావడం గమనార్హం. టాటా గ్రూప్ నియంత్రణలో ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పిఇటి) నుండి ఈ నిధులు బీజేపీకి వచ్చాయి. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే… స్క్రోల్ ఇటీవల జరిపిన దర్యాప్తులో […]
Read more

నేటినుంచే పుతిన్‌ భారత పర్యటన!

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు, ఈ సందర్భంగా రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత పుతిన్‌ మొదటి పర్యటన ఇదే. 2021 తర్వాత పుతిన్ భారతదేశానికి తొలిసారిగా చేస్తున్న ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ఇది భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం, రెండు దేశాల […]
Read more

ఓయూ హాస్టల్‌లో నాసిరకం భోజనం…విద్యార్థుల నిరసన!

హైదరాబాద్: కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా హాస్టల్ విద్యార్థులు నాసిరకం ఆహారం వడ్డించారని ఆరోపిస్తూ నిన్న రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్, చీఫ్ వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, E1 హాస్టల్ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి, ఆహారాన్ని తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారు. మెస్ సమస్యలు, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు పెడ చెవిన పెట్టారని […]
Read more

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా 46 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ 4 నుండి ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ సమయంలో అందుబాటులో ఉన్న తాజా ట్రెండ్ ప్రకారం…పశ్చిమ బెంగాల్‌లో 46 లక్షలకు పైగా పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించాలని ఇప్పటికే గుర్తించారు. నిన్న సాయంత్రం వరకు పూర్తయిన గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రకారం… ప్రస్తుతం ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి అర్హత ఉన్న మొత్తం […]
Read more

ఈ ఏడాది పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతక సంవత్సరం…హక్కుల సంఘాలు!

టెల్‌అవీవ్‌: కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిని స్వాగతిస్తుంది. కానీ గాజాలో మాత్రం ఈఏడాది భయానక అనుభవాలను మిగిల్చింది. ఇజ్రాయెల్‌ బాంబుదాడులు ఏకంగా వేలమందిని హతమార్చింది. లక్షల మందిని గాయపర్చింది. మరికొన్ని లక్షలమందిని నిరాయశ్రయులను చేసింది. ఈ సంవత్సరం గాజా ఓ శిధిల నగరంగా మారింది. మొత్తంగా 2025 పాలస్తీనియన్లకు “అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విధ్వంసకర” ఏడాదిగా మార్చాయని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. బిమ్కోమ్, గిషా, అసోసియేషన్ ఫర్ సివిల్ […]
Read more

పదేళ్లలో తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి!

కొత్తగూడెం/హైదరాబాద్: పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ వర్గీకరణ ఆపాలని, తెలంగాణను దేశంలో నంబర్ ఒన్‌ రాష్ట్రంగా మార్చడానికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి… సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు […]
Read more

బంగ్లాదేశ్ ఎన్నికల్లో జమాతే ఇస్లామి ‘బీఎన్‌పీ’ని ఓడిస్తుందా?

ఢాకా: ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన వెంటనే ఎన్నికలు జరిగితే… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వరుసలో ఉందని భావించారు. అయితే ఇప్పుడు BNP ఆ ఆధిక్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి నిశ్శబ్ద విజయానికి దగ్గరగా ఉంది. ఈ విషయమై అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 33% మంది […]
Read more
1 25 26 27 28 29 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.