Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

యూరియా కోసం భారీ వర్షంలోనూ రైతుల పడిగాపులు!

నాగార్జునసాగర్‌: ఆరుగాలం కష్టించే రైతుకు యూరియా కోసం ఎదురీదక తప్పడం లేదు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో నిన్న యూరియా పంపిణీ చేస్తారనే వార్త తెలియగానే ఆదివారం రాత్రి వందలాది మంది రైతులు తిరుమలగిరి సబ్ మార్కెట్ యార్డ్ వద్ద గుమిగూడారు. గత పది రోజులుగా పంపిణీ జరగకపోవడంతో, రైతులు రాత్రిపూట యార్డ్‌లో ఆశగా బస చేశారు. మరోవంక అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది రైతులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లోపల ఆశ్రయం […]
Read more

సుప్రీంకోర్టులో షాకింగ్‌ ఘటన…సీజేఐపై షూ విసిరిన లాయర్‌!

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కోర్టు గదిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన పరిణామంతో నిర్ఘాంతపోయిన చీఫ్ జస్టిస్ గవాయ్, “ఇలాంటి వాటి వల్ల నేనేమీ బెదరను” అని చెబుతూ విచారణ కొనసాగించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం…ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించాడని సదరు న్యాయవాది నినాదాలు చేశాడు. కాగా, ఈ సంఘటనపై సమగ్ర […]
Read more

ఎంపీలో పిల్లల మరణంపై దర్యాప్తుకు సిట్‌…వైద్యుడు అరెస్టు, తయారీదారుపై కేసు!

చింద్వారా: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో “విషపూరిత” దగ్గు సిరప్‌ వాడిన కారణంగా 14 మంది పిల్లలు మరణించిన ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పిల్లల మరణాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై చింద్వారాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని అరెస్టు చేయగా, కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన ఒక్కొక్కరికి రూ.4 […]
Read more

ఒడిశాలోని కటక్‌లో హింస: ఇంటర్నెట్ నిలిపివేత, 36 గంటల కర్ఫ్యూ!

కటక్/భువనేశ్వర్: దుర్గా విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఒక ఘర్షణ తర్వాత ఈ ప్రాంతంలో హింస చెలరేగడంతో ఒడిశా ప్రభుత్వం కటక్‌లోని 13 పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు విధించింది, దీని ఫలితంగా 25 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి 10 గంటల నుండి 36 గంటల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ ఎస్ దేవ్ దత్తా సింగ్ తెలిపారు. దర్గా బజార్, మంగళాబాగ్, కంటోన్మెంట్, పురిఘాట్, లాల్‌బాగ్, బిదనాసి, మర్కత్ నగర్, […]
Read more

బీహార్‌లో ఓట్ల తొలగింపుకు గల కారణాలను దాటవేసిన సీఈసీ జ్ఞానేష్ కుమార్!

న్యూఢిల్లీ: బీహార్‌ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత రాష్ట్రంలో ఓటర్లు దాదాపు 6% తగ్గారని తేలింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. అయితే జాబితాలో విదేశీ “అక్రమ వలసదారులుగా” పేర్కొంటూ 47 లక్షల మంది ఓటర్లను తొలగించడానికి గల కారణాల గురించి ఎటువంటి వివరాలను అందించలేదు. బదులుగా, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలకు డేటా అందుబాటులో ఉందని, ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి పది […]
Read more

ఇస్లామోఫోబిక్ రిపోర్టింగ్‌…జీ న్యూస్, టైమ్స్ నౌ నవభారత్‌లపై చర్య!

న్యూఢిల్లీ: దేశంలో మత విద్వేషాన్ని వెదజల్లుతున్న జీ న్యూస్‌, టైమ్స్‌ నౌ, నవభారత్‌ మీడియా సంస్థలపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ (ఎన్‌బిడిఎస్‌ఎ) చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థలు ప్రసారం చేసిన కథనాలను స్పష్టమైన ఇస్లామోఫోబిక్‌గా విమర్శించింది. ఈ న్యూస్‌ ఛానల్స్‌ “మెహందీ జిహాద్”, “లవ్ జిహాద్” కుట్ర సిద్ధాంతాలను ప్రోత్సహించే ఇస్లామోఫోబిక్, తప్పుదారి పట్టించే నివేదికలను ప్రసారం చేయడం ద్వారా తమ నీతి నియమావళిని […]
Read more

స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా న్యాయవాదులతో భట్టి, పొన్నం చర్చ!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం న్యూఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీకి వెళ్లే ముందు, డిప్యూటీ సీఎం, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన […]
Read more

‘యే బాబా కా రాజ్ హై’అంటూ రాయ్ బరేలిలో దళిత వ్యక్తిని కొట్టి చంపారు!

లక్నో: గాంధీజయంతి రోజున యూపీలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలి జిల్లాలో దొంగ అనే అనుమానంతో 38 ఏళ్ల దళిత వ్యక్తిని కొట్టి చంపారు. మృతుడు హరిఓమ్‌.. బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్న తన భార్యను కలవడానికి వెళ్ళాడని పోలీసులు తెలిపారు. అయితే, అతను దారితప్పి ఈశ్వర్‌దాస్‌పూర్ గ్రామంలోకి ప్రవేశించాడని సమాచారం. గ్రామస్థులు అతన్ని పట్టుకుని విచారించడం ప్రారంభించారు. హరిఓమ్‌ వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో, వారు అతన్ని కొట్టడం ప్రారంభించారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన […]
Read more

బీహార్‌ తుది ఓటరు జాబితాపై సందేహాలెన్నో?

పాట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయిన తర్వాత భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తింది. ఇంకా చాలా మంది చేర్పులు, తొలగింపులను అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. SIR ప్రక్రియలో సుమారు 4.7 మిలియన్ల ఓటర్లను తొలగించినట్లు వెల్లడించింది. ఎన్నికల కమిషన్ ఏ ఇతర వివరాలను పంచుకోలేదు. అయితే, బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వెబ్‌సైట్ […]
Read more
Cough syrup

దగ్గు సిరప్‌లో విషపూరితాలు లేవు…కేంద్రం!

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్‌లో విషపూరితం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అయితే ఈ విషాదం వెనుక కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తులు కొనసాగుతున్నాయని పేర్కొంది. అధికారిక దర్యాప్తు బృందం సేకరించిన ఔషధ నమూనాలను మూత్రపిండాల గాయాలకు కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ (DEG-EG) లేనట్లు తేలిందని కేంద్రం తెలిపింది. “పరీక్ష ఫలితాల ప్రకారం, ఏ నమూనాలోనూ DEG లేదా EG లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆహార, ఔషధ సంస్థ […]
Read more
1 2 3 4 5 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.