Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘పారిపోతున్న బంగ్లాదేశీయులు’అంటూ బెంగాల్‌లో ‘మీడియా’ హడావుడి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట మీడియా హడావుడి ఎక్కువయింది. ఇక్కడ ఒక సంఘటనను పరికిస్తే… కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో సచివాలయానికి ఎదురుగా గుడిసెల సమూహం ఉంది. గత వారాంతంలో అక్కడే గందరగోళం చెలరేగింది. చేతిలో కెమెరాలు పట్టుకుని జర్నలిస్టుల బృందం ఒక యువకుడిని వెంబడించింది. ఆ వ్యక్తి రఫీకుల్ సర్దార్, నగరంలో నివసించే దినసరి కూలీ. సర్దార్ కుటుంబం సౌత్ 24 పరగణాలలోని జాయ్‌నగర్-I బ్లాక్‌లోని దోసా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామ్‌నగర్ గ్రామ వాసులు. […]
Read more

కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు…సీఎం రేవంత్‌రెడ్డి విమర్శ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు, ఆ అనుభవజ్ఞుడైన నాయకుడు “రాజకీయాల్లో చురుగ్గా లేరు” అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన సందర్బంగా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… “కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. నేను అలాంటి వ్యక్తిని విమర్శించాలనుకోవడం లేదు. కేటీఆర్ తన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలని, హరీష్ రావు తన అసూయను తగ్గించుకోవాలని కూడా సలహా […]
Read more

గాజా తీర్మానాన్ని’త్వరగా ఆమోదించండి’… ‘యూఎన్‌’ను కోరిన అమెరికా, అరబ్‌దేశాలు!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను త్వరగా ఆమోదించాలని అమెరికా సహా టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియాతో పాటు అనేక అరబ్ దేశాలు యూఎన్‌ భద్రతా మండలిని అభ్యర్థించాయి. ఈమేరకు “యునైటెడ్ స్టేట్స్, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా , ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్, తుర్కియా ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడి మద్దతు ఇస్తున్నామని” నిన్న ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. గత వారం […]
Read more

బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం…ఒక విశ్లేషణ!

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో అసాధారణ ఫలితాలు నమోదు అయ్యాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన ఎన్డీఏ… ఈసారి మొత్తం 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2020లో 74 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 89 సీట్లు గెలుచుకునేలా తన సంఖ్యను మెరుగుపరుచుకుంది. మరోవైపు, జెడి(యు) గత ఎన్నికల కంటే దాదాపు రెట్టింపు స్థానాలు సాధించి 85 స్థానాలను గెలుచుకుంది. కాగా, 2020లో […]
Read more

ఝార్ఖండ్‌లో పదివేల మందికి పైగా మావోయిస్టులు అరెస్టు!

రాంచీ: ఝార్ఖండ్‌లో 2001 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు అంటే ఈ 25ఏళ్లలో మొత్తం 10వేల769 మంది మావోయిస్టులు అరెస్టు చేసారు. కాగా, 235 మంది మృతి చెందారు. 324 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాలంలో పోలీసులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. “గత 25 సంవత్సరాలలో పోలీసుల నుండి దోచుకున్న 710 ఆయుధాలతో సహా 1,471 తుపాకులను స్వాధీనం […]
Read more

జేఎన్‌టీయూ, ఉస్మానియాలను మోడల్ వర్సిటీలుగా ప్రతిపాదించిన కోర్‌ గ్రూప్‌!

హైదరాబాద్: విద్యాసంస్థల్లో మౌలిక వసతులపై తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోర్ గ్రూప్ పలు సిఫార్సులు చేసింది. మొదటి దశలో జెఎన్‌టియు హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలను మోడల్ విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. మౌలిక వసతుల కోసం మూడేళ్లలో ఈ రెండు వర్సిటీలకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ప్యానెల్ ప్రతిపాదించింది. కాగా, నూతన విద్యావిధానం తరహాలో “తెలంగాణ విద్యా విధానం” రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక […]
Read more

బీహార్‌లో భారీ విజయం దిశగా దూసుకుపోతున్న ఎన్డీఏ!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్‌లో అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ వార్త రాసే సమయానికి ప్రస్తుతం 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది సాధారణ మెజారిటీ 122 స్థానాల చాలా ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో బిజెపి ప్రస్తుతం 84 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జెడియు 76 స్థానాల్లో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ […]
Read more

అల్ ఫలాహ్, అలీగఢ్‌ యూనివర్సిటీలపై బాంబులు వేయండి…మహంత్ యతి నర్సింఘానంద్ విద్వేష వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ముస్లిం వ్యతిరేక, ద్వేషపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన మహంత్ యతి నర్సింఘానంద్ మరోసారి నోరుపారేసుకున్నారు. నాలుగు ప్రముఖ ఇస్లామిక్ విద్యా సంస్థలైన “అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా, దారుల్ ఉలూమ్, దేవ్‌బంద్‌లను నాశనం చేయడానికి సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉగ్రవాద స్థావరాలను సైన్యాన్ని పంపించి ఫిరంగులతో పేల్చివేయాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. https://www.instagram.com/reel/DQ_QjM2CUCo/?igsh=MTdweHp1aG1raTM2ZQ== ఇక నవంబర్ 10న […]
Read more

సుడాన్‌లోని ‘అల్ ఫషర్‌’లో సామూహిక దురాగతాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన!

ఖార్తూమ్‌: ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలసి జీవించిన నేల సూడాన్. కానీ, నేడు ఆ దేశపు పేరు వింటే నెత్తుటి వాసన రావడం విషాదం. తాజాగా సుడాన్‌లోని అల్ ఫషర్‌లో సామూహిక దురాగతాలు, తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశారు. కోర్డోఫాన్ ప్రాంతంలో కూడా హింస తీవ్రమవుతోందని అన్నారు. సుడానీస్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీల మధ్య పోరాటం […]
Read more

నెహ్రూను దూషించడం…ఆయన అడుగుజాడలపై నడవడం RSSకు అలవాటైంది!

న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎందుకు పదేపదే దాడి చేస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం. ఆయన 60 సంవత్సరాల క్రితం మరణించారు. నేటి రాజకీయాలకు సంబంధం లేదు. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే…ఈ కాషాయ కూటమి నెహ్రూను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంది, ఆయన కాశ్మీరీ బ్రాహ్మణ సమాజానికి చెందినవారని కూడా వీరు గుర్తించకపోవడం మరీ విడ్డూరం. ఇక నెహ్రూ ఎల్లప్పుడూ పండిట్‌జీని తన పేరులో ప్రత్యయంగా ఉపయోగించుకునేవారు. ఆయన కాలంలోని ప్రజలు ఎల్లప్పుడూ […]
Read more
1 49 50 51 52 53 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.