Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు… సంక్షోభంలో కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు – అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఏప్రిల్/మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి, తమ పార్టీని విజయపథంలో ప్రారంభించడానికి కాంగ్రెస్‌కు నాలుగు అవకాశాలు లభిస్తాయి. గత సంవత్సరం జరిగిన ఢిల్లీ-బీహార్ ఎన్నికల్లో పరాజయాల తర్వాత…జాతీయ రాజకీయ యవనికపై నిలబడేందుకు ఆపార్టీకి కనీసం ఒక విజయం అవసరం. డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బలమైన ప్రదర్శన నేపథ్యంలో కేరళలో పార్టీ బాగా రాణించాలని ఆశిస్తోంది; ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ […]
Read more

బంగ్లాదేశ్ కొత్త ప్రధానిని భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్‌ను భారతదేశానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. అంతేకాదు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢాకాలో రెహమాన్‌ను కలిసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా … ప్రధాని మోడీ లేఖను అందజేసినట్లు అధికారులు న్యూఢిల్లీలో తెలిపారు. కొత్త ప్రధాని రెహమాన్ నాయకత్వం బంగ్లాదేశ్‌ను శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా నడిపిస్తుందని ప్రధాని మోదీ […]
Read more

హైదరాబాద్‌లో ప్రారంభమైన బయో ఆసియా సదస్సు!

హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ ఫోరమ్ అయిన బయోఆసియా 23వ ఎడిషన్ నేడు హైదరాబాద్‌లో ఆరంభమైంది. నేడు, రేపు రెండురోజుల ఈ సమ్మిట్‌ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మిట్‌ను ప్రారంభించారు. “టెక్ బయో అన్‌లీష్డ్ – AI, ఆటోమేషన్ అండ్ ది బయాలజీ రివల్యూషన్” అనే థీమ్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 4,000 మందికి పైగా ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ కంపెనీలు హాజరవుతాయని […]
Read more

న్యూస్ క్లిక్, ఆ సంస్థ అధినేతపై 184 కోట్ల జరిమానా విధించిన ఈడీ!

న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూస్‌క్లిక్ వార్తా సంస్థ, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 184 కోట్ల జరిమానా విధించింది. న్యూస్‌క్లిక్‌కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్‌ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఈడీ పేర్కొంది. అంతేకాదు వారు తమ […]
Read more

వెస్ట్ బ్యాంక్ భూమిని ప్రభుత్వ ఆస్తిగా మార్చాలనే ఇజ్రాయెల్ ‘ప్రణాళిక’ను ఖండించిన గల్ఫ్ దేశాలు!

రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని అధికారులు “ప్రభుత్వ ఆస్తి”గా మార్చాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా, ఖతార్,కువైట్ ఖండించాయి. ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, రాజకీయ పరిష్కారం కోసం అవకాశాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది.. ఈ నిర్ణయం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చొరబాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈభూమిపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం లేదని సౌదీ నొక్కి చెప్పింది. ఈ చర్యను తిరస్కరిస్తున్నామని పునరుద్ఘాటించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని “ప్రభుత్వ ఆస్తి”గా […]
Read more

యూఎన్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ఆఫ్రికన్ యూనియన్ మద్దతు…స్వాగతించిన పాలస్తీనా!

అడీస్‌అబాబా: ఐక్యరాజ్యసమితిలో (UN) పూర్తి సభ్యత్వం కోసం తన అభ్యర్థనకు ఆఫ్రికన్ యూనియన్ (AU) మద్దతు ప్రకటించడాన్ని పాలస్తీనా స్వాగతించింది. ఇథియోపియాలోని అడిస్ అబాబాలో జరిగిన 39వ ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని బలపరుస్తూ తీర్మానం చేశారు. ఆ దేశాన్ని పూర్తి స్థాయి సభ్యదేశంగా చేర్చుకోవాలని, పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును ఖండిస్తూ తీర్మానం చేశారు. ఆఫ్రికా సమ్మిట్‌లో వ్యక్తీకరించిన దృఢమైన వైఖరి తమకు ప్రోత్సాహకరంగా ఉందని పాలస్తీనా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇది పాలస్తీనా […]
Read more

బంగ్లా ఎన్నికల్లో గెలిచిన తారిఖ్‌రహమాన్‌ను అభినందించిన మమతా బెనర్జీ!

కోల్‌కత: బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీపార్టీ అధినేత తారిఖ్ రెహమాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వీట్లు, పూల బోకే పంపారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని గెలిపించినందుకు మమత బంగ్లాదేశ్ పౌరులను అభినందించారు, బిఎన్‌పి నాయకుడిని తారిఖ్ భాయ్ అని సంబోధించి పొరుగు దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మమతా బెనర్జీ తారిఖ్ రెహమాన్‌కు ఫోన్ చేసి తన పార్టీ విజయానికి అభినందనలు […]
Read more

ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి మండలికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసన!

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా “శాంతి మండలి”, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఇజ్రాయెల్ పర్యటనను ఖండిస్తూ పాలస్తీనా అనుకూల కార్యకర్తలు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. వీధి చర్చలు నిర్వహించారు. గాజాలో కొనసాగుతున్న హింసను వ్యతిరేకించే ప్రచారాలలో పాల్గొనాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో ట్రంప్ శాంతి విధానాలను నిరసిస్తూ కార్యకర్తలు ప్ల కార్డులు ప్రదర్శించారు. ట్రంప్ శాంతి చొరవలకు వ్యతిరేకంగా […]
Read more

రైతుల ఏకైక రక్షకుడు రాహుల్‌గాంధీ… ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

న్యూఢిల్లీ: అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దేశ ద్రోహంతో సమానమని ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. భారతదేశం ప్రాథమికంగా రైతుల దేశం అని సీఎం నొక్కిచెప్పారు, వారి ప్రయోజనాలను అమెరికాకు అమ్మడం దేశాన్నే మోసం చేయడంతో సమానమని హెచ్చరించారు. రైతుల రక్షణలో ఐక్యంగా […]
Read more

‘కోవా బన్ వ్యాపారి’కి మద్దతుగా నిలిచిన మంత్రి నారాలోకేష్‌!

అమరావతి: మేడారం జాతరలో కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారి షేక్ వలీని యూట్యూబర్లు వేధించిన ఘటనపై ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగు సమాజంలో విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వలీని కలిసి ఆయన కోవా బన్‌ను రుచి చూస్తానని లోకేష్ X ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన షేక్ షేక్షా వలి అనే విక్రేతకు ఎదురైన వేధింపుల […]
Read more
1 47 48 49 50 51 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.