Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో ఇజ్రాయెల్ హత్యలను ఆపాలని, పునర్నిర్మాణం ప్రారంభించాలని సౌదీ మంత్రి పిలుపు!

మ్యూనిచ్: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ హత్యలను తక్షణమే ఆపాలని, పునర్నిర్మాణం ప్రారంభించాలని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ పిలుపునిచ్చారు. పాలస్తీనా ఐక్యతను కాపాడటానికి ఈ ప్రాంతంలో స్థిరత్వం చాలా ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు. మ్యూనిచ్ భద్రతా సమావేశంలో “ది టర్నింగ్ పాయింట్: ది ఇంటర్నేషనల్ సిస్టమ్ బిట్వీన్ రిఫార్మ్ అండ్ డిస్ట్రక్షన్” అనే చర్చలో పాల్గొన్న సందర్భంగా… ఆయన మాట్లాడుతూ… ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ గాజాలో మరణాలు కొనసాగుతున్నాయని […]
Read more

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…రాహుల్ గాంధీ బహిష్కరణ డిమాండ్‌పై ప్రతాప్ సింగ్ బజ్వా!

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని బహిష్కరించాలన్న బీజేపీ నేతల డిమాండ్‌ను పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఖండించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య పునాదులపై దాడిగా ఆయన అభివర్ణించార.ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నత జవాబుదారీ వేదిక అని మరియు పౌరుల తరపున ప్రశ్నలు లేవనెత్తడం నేరంగా పరిగణించరని బజ్వా అన్నారు. “పార్లమెంటులో ప్రశ్నలు అడగడం నేరంగా మారితే, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదం పడినట్టే. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి జాతీయ ప్రాముఖ్యత […]
Read more

యోగి ఆదిత్యనాథ్‌ ఓ అనాగరిక ముఖ్యమంత్రి… అఖిలేష్ యాదవ్!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకు పడ్డారు. ఆయన మతతత్వవాది, అనాగరిక ముఖ్యమంత్రి”,”నకిలీ యోగి” అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ 2017 కి ముందు తన గుర్తింపును కోల్పోయి బిజెపి పాలనలో తిరిగి పొందిందని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పాలనా వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. సమాజ్‌వాదీపార్టీ నేతలు “మాఫియా లీడర్ల సమాధులను సందర్శిస్తారని యోగీ విమర్శిస్తుంటాడు. […]
Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, పట్టు కోల్పోయిన బీఆర్ఎస్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు కార్పోరేషన్లకు గాను ఐదింటిని కైవసం చేసుకుంది. ఎంఐఎంతో మిత్రత్వం కారణంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కూడా కాంగ్రస్‌ ఖాతాలోకి చేరే అవకాశముంది. ఇక 116 మున్సిపాలిటీల్లో 78 స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంది. మొత్తం 5,992 వార్డులకు గాను 3,074 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాధించిన […]
Read more

తెలంగాణలో ‘ఫుడ్ జిహాద్’ పేరిట సాగుతున్న విద్వేష వంటకం!

హైదరాబాద్: తెలంగాణ పట్టణాల్లోని ఇరుకైన సందులలో, ఇరానీ చాయ్ సువాసనలు, వీధి వెంబడి వేయించే కబాబ్‌ల ఘుమఘుమలతో మిళితమై ఉండే వాతావరణంలో… ఇప్పుడు ఒక కొత్త, ప్రమాదకరమైన ‘విద్వేషపు ఇంధనం’ తోడవుతోంది. ‘వినియోగదారుల హక్కుల పోరాటం’ అనే ముసుగులో కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానళ్లు ముస్లిం వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యాపారానికి ‘ఫుడ్ జిహాద్’ అనే మతపరమైన రంగును పులుముతున్నాయి.డిజిటల్ మూకదాడి: ఒక విశ్లేషణఈ ఛానళ్ల వ్యూహం అత్యంత అంచనా వేయదగినదిగా, అంతే ప్రమాదకరంగా […]
Read more

పురివిప్పిన మత విద్వేషం…ఒకే స్కూల్‌లో రెండు వార్షికోత్సవాలు!

సయ్యద్ షరీఖ్ ముంతాజ్ దేశంలో మతవిద్వేషం నానాటికి పెరుగుతోంది. దీంతో ఇండోర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, రెండు వార్షిక దినోత్సవ వేడుకలు జరపాల్సి వచ్చింది…, ఒకటి హిందూ విద్యార్థులకు, మరొకటి ముస్లింలకు వేరు వేరుగా నిర్వహించాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వివక్షత కాదని పాఠశాల చెబుతోంది, కానీ తల్లిదండ్రులు మరో విధంగా చెబుతున్నారు. మతపరమైన ద్వేషం ఇప్పుడు మన జీవితంలో రోజువారీ భాగంగా మారింది, అయితే పిల్లలను దీన్నుంచి తప్పించాలని తల్లిదండ్రులలో ఒకరైన సయ్యద్ ఖాసిం అలీ […]
Read more

వందేమాతరం తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధం…ముస్లిం పర్సనల్‌ లా బోర్డు!

న్యూఢిల్లీ: అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమనకు ముందు వందేమాతరంలోని అన్ని శ్లోకాలను పఠించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయ రాజ్యాంగ విరుద్ధమని బోర్డు పేర్కొంది. ఈ మేరకు బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మొహమ్మద్ ఫజ్లూర్ రహీం ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక పత్రికా ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మత […]
Read more

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీఎన్‌పీ!

ఢాకా: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ముందంజలో ఉంది. నిన్న దేశంలోని మొత్తం 299 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా సాగుతోంది. బీఎన్‌పీ నేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కానున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుు 155 సీట్లు అవసరం. అయితే బీఎన్‌పీ మాత్రం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని […]
Read more

మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు సహా 123 పట్టణ స్థానిక సంస్థల (ULB) ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆపై సాధారణ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం అవసరమైన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియమించింది. భారత న్యాయసంహిత సెక్షన్ 163 లెక్కింపు కేంద్రాలలో, చుట్టుపక్కల అమలులో […]
Read more

అమెరికా-భారత్ వాణిజ్య ‘ఒప్పందం’వల్ల మనకు నష్టమే!

వాషింగ్టన్‌: దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫలితంగా అమెరికా ఉత్పత్తుల కోసం… 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌ తలుపులు బార్లా తెరుచుకోనున్నాయి. కాగా, భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మక ముందడుగని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ ఒప్పందం మన దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అమెరికా చేసుకునే ఏ ఒప్పందమైనా అది అమెరికాకే లాభదాయకంగా ఉంటుందని […]
Read more
1 48 49 50 51 52 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.