Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు శృంగభంగం!

న్యూయార్క్‌: ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుకు శృంగభంమైంది. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే పాలస్తీనాకు మద్దతుగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియాతో సహా పలు అరబ్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు నినాదాలు చేసుకుంటూ వాకౌట్‌ చేశాయి. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసిస్తూ వారంతా వెళ్లిపోవడంతో సభలో అనేక సీట్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. గాజాపై విధ్వంసకర యుద్ధాన్ని కొనసాగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు, ఆయనకు అపహాస్యం ఎదురైంది. మద్దతుగా చప్పట్లు కూడా వినిపించాయి. […]
Read more

ఇజ్రాయెల్ రిసార్ట్ టౌన్‌పై యెమెన్ డ్రోన్ దాడి… 22 మందికి గాయాలు!

టెల్‌అవీవ్‌: యెమెన్ నుండి ప్రయోగించిన డ్రోన్ దక్షిణ రిసార్ట్ పట్టణం ఐలాట్‌ను తాకిందని, దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వైమానిక రక్షణ వ్యవస్థ దానిని అడ్డుకోవడంలో విఫలమైన తర్వాత ఎర్ర సముద్ర తీరంలోని “ఐలాట్ ప్రాంతంలో పడిపోయిందని” సైనిక ప్రకటన తెలిపింది, కొన్ని రోజుల్లోనే జరిగిన రెండవ సంఘటన ఇది. ఇజ్రాయెల్ మాగెన్ డేవిడ్ అడోమ్ అత్యవసర వైద్య సేవ తన బృందాలు 22 మంది క్షతగాత్రులకు చికిత్స అందించారు. వీరిలో […]
Read more

గాజాకు వెళుతున్న ఫ్లోటిల్లాపై ‘డ్రోన్ దాడులు’!

ఏథెన్స్‌: మానవతా సహాయం, అంతర్జాతీయ కార్యకర్తలతో గాజాకు వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) గ్రీకు తీరం సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు పదిహేనుసార్లు డ్రోన్ దాడులకు గురైనట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో వారు పోస్ట్ కూడా చేసారు. సెప్టెంబర్ 23 – సెప్టెంబర్ 24 బుధవారం తెల్లవారుజాము వరకు 15కి పైగా డ్రోన్లు ఫ్లోటిల్లా నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎనిమిది పడవలపై కనీసం తొమ్మిది దాడులలో కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. ఇలాంటి […]
Read more

భారత్‌, పాక్‌ మధ్య సంఘర్షణను ఆపానని ఐక్యరాజ్యసమితిలో పునరుద్ఘాటించిన ట్రంప్‌!

ఐక్యరాజ్యసమితి: భారతదేశం,పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన ప్రపంచ నాయకులకు తన వాదనను పునరావృతం చేశారు. “అదేవిధంగా, కేవలం ఏడు నెలల కాలంలో, నేను ఏడు యుద్ధాలను ఆపా. లేకుంటే అవి ఎప్పటికీ ముగియవని చెప్పారు… కొన్ని 31 సంవత్సరాలు కొనసాగగా, మరొకటి 36 సంవత్సరాలు, ఇంకోకటి 28 సంవత్సరాలు కొనసాగాయని, ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు. ఈ యుద్ధాలలో […]
Read more

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను గుర్తించిన 157 దేశాలు!

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో 157 దేశాలు పాలస్తీనాను ఒక సార్వభౌమ దేశంగా గుర్తించాయి. UNGA 80వ సమావేశంలో పాలస్తీనాను గుర్తించిన దేశాలలో ఫ్రాన్స్, లక్సెంబర్గ్, మాల్టా, మొనాకో, అండోరా, బెల్జియంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20న యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్ దేశాలు ఆ దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో సైనిక విస్తరణకు ప్రణాళికలు వేస్తున్న సమయంలో పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే దేశాల జాబితా పెరుగుతోంది. “యూదు […]
Read more

సుంకాల వివాదం మధ్య భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రుల భేటి!

న్యూయార్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సందర్భంగా నిన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో… విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, ఖనిజాలు వంటి కీలక రంగాలలో భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఈ భేటీ అనంతరమే మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమెరికా విదేశాంగ […]
Read more

‘గ్రేటర్ ఇజ్రాయెల్’దిశగా అడుగులు వేస్తున్న నెతన్యాహు!

సిడ్నీ: చాలా కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడంపై ప్రపంచంలోని చాలా దేశాలు దృష్టి సారిస్తే… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన “గ్రేటర్ ఇజ్రాయెల్” కలను సాకారం చేసుకోవడానికి అంకితభావంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గాజాలో నెతన్యాహు సాగిస్తున్న యుద్ధంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినప్పటికీ, మిగతా దేశాలు ఇజ్రాయెల్‌ను ఒంటరిగా చేస్తున్నప్పటికీ, ఈ లక్ష్యాన్ని సాధించడంలో నెతన్యాహు సగం దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఈ భావనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి తీవ్రంగా కృషి […]
Read more

బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించిన తాలిబన్!

కాబూల్‌: ఆప్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను తాలిబన్‌లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ ఒప్పందం “సాధ్యం కాదు” అని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు అన్నారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ […]
Read more

పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించిన పోర్చుగల్, బ్రిటన్‌, కెనడా!

లండన్‌: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (UK), కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఈ మూడు కామన్వెల్త్ దేశాలు సంయుక్తంగా తీసుకున్న సమన్వయ చర్య ఇది, అయితే యునైటెడ్ స్టేట్స్ (US), ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకించాయి. ఈమేరకు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ చర్య “పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీయులకు శాంతి ఆశను పునరుద్ధరించడానికి” ఉద్దేశించిందని, ఇది హమాస్‌కు బహుమతి కాదని నొక్కి చెప్పారు, పాలస్తీనా […]
Read more

గాజాలో దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం!

పాలస్తీనా: గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఉధృతం చేసింది. దీంతో గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంత రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. సిటీని వీడాలన్న ఐడీఎఫ్‌ హెచ్చరికలతో ముందుగానే మూడున్నర లక్షల మంది తీరప్రాంతాలకు వెళ్లిపోగా… భూతల దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని విడిచిపెట్టారని సమాచారం. కాగా, గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ చేసిన […]
Read more
1 13 14 15 16 17 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.