Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హర్ముజ్ విషయలో ట్రంప్ డిమాండ్‌పై ద్వైపాక్షికంగా చర్చించలేదు…భారత్!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రభావంపై జరిగిన రోజువారీ అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో, హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంలో సహాయపడటానికి యుద్ధనౌకలను పంపమని యూఎస్ భారత్‌ను సంప్రదించిందా అని అడగగా, వాషింగ్టన్ డిమాండ్‌పై ఇరుపక్షాలు ద్వైపాక్షికంగా చర్చించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఈ ప్రత్యేక విషయంపై పలు దేశాలు చర్చిస్తున్న విషయం మాకు తెలుసు. మేము ఇంకా దీనిపై ద్వైపాక్షికంగా చర్చించలేదు,” అని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. హర్ముజ్ జలసంధి గుండా చమురు […]
Read more

యుద్ధం ముగింపుకు ‘ఇరాన్’ చర్చలు జరపట్లేదు!

టెహ్రాన్‌: యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి రహస్య చర్చలు జరగవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తోసిపుచ్చారు. ఈమేరకు మధ్యప్రాఛ్యంలో అమెరికా రాయబారి విట్కాఫ్‌తో నా చివరి సంభాషణ, ఇరాన్‌పై మరో చట్టవిరుద్ధమైన సైనిక దాడితో దౌత్యాన్ని ముగించకూడదని ఆయన బాస్ నిర్ణయించుకున్నప్పుడు జరిగింది. దీనికి విరుద్ధంగా వచ్చే ఏ వాదనలైనా కేవలం చమురు వ్యాపారులను, సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయని ఇరాన్‌ విదేశాంగమంత్రి అన్నారు. అంతకుముందు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ […]
Read more

ఇరాన్ డ్రోన్ దాడి…దుబాయ్ విమానాశ్రయం వద్ద భారీ అగ్నిప్రమాదం, విమానాల నిలిపివేత!

యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఇరానియన్‌ డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రెస్క్యూ వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని మంటలను అదుపు చేయడానికి వెంటనే మోహరించామని, సమీపంలో భద్రతా చర్యలు ప్రారంభించినందున ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దుబాయ్ మీడియా ఆఫీస్ Xలో ఒక పోస్ట్‌లో “దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన డ్రోన్ సంఘటన ఇంధన ట్యాంక్‌లలో […]
Read more

సోషల్‌మీడియాలో ‘తప్పుడు వార్తలు’…19 మంది భారతీయులపై యుఏఈ అరెస్ట్ వారెంట్!

దుబాయ్: యుఎస్-ఇజ్రాయెల్ దళాలు గత నెల చివర్లో ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తప్పుదోవ పట్టించే విషయాలను పోస్ట్ చేసినందుకు 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్ట్ చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఆదేశించింది. కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంబంధించి…ఈ వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని యుఎఇ అధికారులు ఆరోపించారు. ఈమేరకు UAE అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ […]
Read more

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు…31 మంది మృతి!

బీరూట్‌: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నుండి ఇజ్రాయెల్ కనీసం 31 మందిని చంపిందని, అనేక మందిని గాయపరిచిందని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ (NNA), సాక్షులు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ తూర్పు శివార్లలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేయడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈమేరకు సమీపంలోని ఇర్కీ గ్రామంలో, మొహమ్మద్ టాకీ గురువారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఆరు […]
Read more

ఇరాన్‌ రత్నకిరీటం ఖర్గ్ ద్వీపంపై అమెరికా భారీ బాంబు దాడి!

టెహ్రాన్‌: ఇరాన్‌లో కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలిగితే ఆ దేశ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. “యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్య చరిత్రలో అత్యంత శక్తివంతమైన బాంబు దాడులను నిర్వహించింది. ఇరాన్ రత్న కిరీటంగా పేరొందిన ఖర్గ్ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది” అని ట్రంప్ ఈరోజు సోషల్ మీడియాలో […]
Read more

ఇజ్రాయెల్, గల్ఫ్‌పై ఇరాన్ క్షిపణులు…ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం!

టెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికన్ యుద్ధం నేడు 14వ రోజుకు చేరుకుంది, ఈ సంఘర్షణ కొనసాగుతున్న క్రమంలో పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సైనిక ఇంధనం నింపే విమానం కూలిపోయింది. ఈమేరకు పశ్చిమ ఇరాక్‌లో US సైనిక KC-135 ఎయిర్‌లిఫ్ట్ విమానం కూలిపోయిందని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కనీసం ఐదుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని భావిస్తున్నారు. కాగా, ఈ విమానం ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలో భాగమని, అయితే కాల్పుల వల్ల ఈ ప్రమాదం […]
Read more

అమెరికా-ఇజ్రాయెల్ 10వేల పౌర ప్రదేశాలపై బాంబు దాడులు చేశాయి…ఇరాన్!

న్యూయార్క్: ప్రస్తుత వివాదం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా వేలాది పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించాయని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ అధికారుల ప్రకారం… ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల్లో దాదాపు 10,000 పౌర ప్రదేశాలు బాంబు దాడులకు గురయ్యాయి. ఇది తీవ్రమైన మానవతా ఆందోళనలను లేవనెత్తింది. ఈమేరకు ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ… ఈ దాడుల వల్ల ఇళ్లు, ప్రజా మౌలిక సదుపాయాలు విస్తృతంగా ధ్వంసమయ్యాయని అన్నారు. దాడుల […]
Read more

అమెరికా దృష్టి అంతా మా చమురుపైనే ఉంది…ఇరాన్‌!

టెహ్రాన్‌: ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై అమెరికాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూఎస్‌ ఏకైక లక్ష్యం మా చమురు, సహజ వనరులపై నియంత్రణ సాధించడం, దేశాన్ని విభజించడం అని ఆయన ఆరోపించారు. “మేము పూర్తిగా దౌత్యపరమైన చర్చలో నిమగ్నమై ఉండగా వారు యుద్ధం చేశారు,” అని ఆయన అన్నారు, “కాబట్టి, మేము … మా దేశాన్ని ఒక్క తాటిపై నిలబడి కాపాడుకుంటున్నామని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి అన్నారు.” “మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, మా ప్రజలను […]
Read more

భారీగా పెరిగిన ముడి చమురు ధరలు!

చికాగో : ఇరాన్‌పై యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో చమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలిగడంతో చమురు ధరలు మూడున్నర సంవత్సరాల తరువాత మొదటిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత USD 107.97 వద్ద ఉంది, ఇది శుక్రవారం ముగింపు ధర USD 92.69 నుండి 16.5 శాతం పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, యునైటెడ్ స్టేట్స్‌లో […]
Read more
1 14 15 16 17 18 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.