Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బంగ్లాదేశ్‌లో ‘మైనారిటీలపై హింస’…భారతదేశ విమర్శలను తిప్పికొట్టిన ఢాకా!

న్యూఢిల్లీ: తమ దేశంలో మైనారిటీల హింసపై… భారతదేశం చేస్తున్న విమర్శలు వాస్తవాలను ప్రతిబింబించవని ఢాకా పేర్కొంది. భారతదేశంలోని కొన్ని వర్గాలు “బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులపై క్రమబద్ధమైన హింసలో భాగంగా ఏవో ఒకటి ఆరా సంఘటనలను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది. బంగ్లాదేశ్‌లో చేనేత కార్మికుడు దీపు దాస్ హత్య తర్వాత తెరపైకి వచ్చిన రెండు వైపులా వివాదం మరింత తీవ్రతరం చేస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాది హత్యలో […]
Read more

క్రిస్మస్ ప్రసంగంలో గాజా బాధలను ప్రముఖంగా ప్రస్తావించిన పోప్‌ లియో!

వాటికన్‌ సిటీ: పోప్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాక జరిగిన తొలి క్రిస్మస్ వేడుకల్లో శాంతి, ప్రేమ, ఐక్యత సందేశాలను ప్రపంచ ప్రజలకు అందించారు. కాగా, ఈ క్రిస్మస్ ప్రసంగంలో పోప్ లియో గాజాలో పాలస్తీనియన్ల కష్టాలను స్మరించుకున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు జననాన్ని క్రిస్మస్‌గా జరుపుకునే రోజున గాజా ప్రజల బాధలను గుర్తు చేయడం సంచలనంగా మారింది. అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ లియో… యేసు ఒక పశువులపాకలో జన్మించిన కథను చెబుతూ…గాజాలోని గుడారాలు […]
Read more

ఇజ్రాయెల్ వైఖరిని ఖండించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్!

ఇస్తాంబుల్‌: ఇజ్రాయెల్ తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, గాజాకు మానవతా సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. “ఇజ్రాయెల్ తన మాట నిలబెట్టుకోవడం లేదు. కల్పిత సాకులతో మానవతా సహాయం ప్రవేశానికి నిరంతరం ఇబ్బందులు, అడ్డంకులు సృష్టిస్తోంది,” అని అంకారాలో జరిగిన జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ (ఏకే) పార్టీ విస్తృత రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ ఎర్డోగాన్ అన్నారు. “అక్టోబర్ 11 నుండి గాజాలో కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ శిథిలాలుగా […]
Read more

ఇస్మాయిల్ హనియే…హత్యకు కొన్ని గంటల ముందు నితిన్ గడ్కరీతో భేటీ!

న్యూఢిల్లీ: ఇటీవల మధ్యప్రాచ్యంలో జరిగిన అత్యంత సంచలనాత్మక హత్యలలో ఒకటైన హమాస్ రాజకీయ అధినేత ఇస్మాయిల్ హనియే హత్యకు సంబంధించి వరుస పరిణామాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… ఇరాన్ రాజధానిలోని అత్యంత కట్టుదిట్టమైన సైనిక సముదాయంలో హమాస్ నాయకుడు హత్యకు గురికావడానికి కేవలం కొన్ని గంటల ముందు తాను హనియేను ఎలా కలిశానో గడ్కరీ వివరించారు. ఇరాన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకార […]
Read more

రెండేళ్ల గాజా యుద్ధం తర్వాత క్రిస్మస్ రోజు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోయిన బెత్లెహం!

బెత్లెహం (వెస్ట్ బ్యాంక్): రెండు సంవత్సరాల గాజా యుద్ధం కారణంగా బెత్లెహంలో నిలిచిపోయిన క్రిస్మస్‌ వేడుకలు ఈసారి ఘనంగా ఆరంభమయ్యాయి. రెండేళ్ల చీకటి వేడుకల తర్వాత క్రిస్మస్ స్ఫూర్తిని పెంపొందించడానికి నగరంలోని మాంగర్ స్క్వేర్ కు వేలాది మంది ప్రజలు కుటుంబాలతో సహా తరలివచ్చారు. యావత్‌ బెత్లెహం విద్యుత్‌ కాంతులతో మెరిసిపోయింది. యేసు జన్మించాడని క్రైస్తవులు విశ్వసించే బెత్లెహం నగరం… గాజా యుద్ధ సమయంలో గత రెండు సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలను రద్దు చేసింది. ఏదో కొన్ని […]
Read more

అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు!

వాషింగ్టన్‌: అమెరికాలో అక్రమంగా ఉంటున్న30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్‌లను అరెస్ట్‌ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జ‌రిగాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో దొంగతనంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ […]
Read more

ఇజ్రాయెల్-గ్రీస్-సైప్రస్ శిఖరాగ్ర సమావేశం…టర్కీని హెచ్చరించిన నెతన్యాహు!

హ్యూస్టన్(USA): తూర్పు మధ్యధరా ప్రాంతంలో టర్కీ ప్రాంతీయ పాత్ర,సైనిక ఉనికి నేపథ్యంలో, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ నాయకులు తాజాగా జెరూసలేంలో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ…”ఓట్టోమన్‌ సామ్రాజ్యాలను పునరుద్ధరించాలని కలలు కనే వారు అలాంటి భావనలను తమ మనస్సుల నుండి తొలగించుకోవాలని” టర్కీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ త్రైపాక్షిక సమావేశం కేవలం దౌత్యపరమైన సమావేశం కాదని, తూర్పు మధ్యధరాలో కొత్త కూటమి అని ఇజ్రాయెల్ ప్రధాన […]
Read more

భారత్‌తో చేదు సంబంధాలు కోరుకోవడం లేదు…బంగ్లాదేశ్‌ నేత!

ఢాకా: భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం “చేదు సంబంధాలు” కోరుకోవడం లేదని, దానికి బదులుగా న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు. బంగ్లాదేశ్ దినపత్రిక ‘దేశ్ రూపాంతర్’ ప్రకారం… ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, న్యూఢిల్లీతో సంబంధాలలో […]
Read more

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’లో తొలిగించిన ట్రంప్ ఫోటోను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ!

వాషింగ్టన్‌: ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాయమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను తిరిగి పునరుద్ధరించారు. ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్‌‌స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా, ఎప్‌స్టీన్, […]
Read more

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ ఆమోదం తెలపడాన్ని ఖండించిన యూకే!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్తగా 19 స్థావరాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని బ్రిటన్‌ ఖండించింది. ఈ మేరకు ఆయన X లో విమర్శించారు. ఇవి అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం” అని బ్రిటిష్ మధ్యప్రాచ్య వ్యవహారాల మంత్రి హమీష్ ఫాల్కనర్ Xలో రాశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 19 కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు, గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మొత్తం కొత్త […]
Read more
1 3 4 5 6 7 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.