Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘మరింత స్వయంప్రతిపత్తి మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరిస్తుంది’…ఎమ్మెల్యే రామ్ ముయివా!

ఇంఫాల్: మణిపూర్‌లో మెయిటీ, కుకీ-జో వర్గాల మధ్య 2023లో ఘర్షణలు జరిగినప్పుడు, ఉఖ్రుల్ జిల్లాలో నాగాలు తటస్థంగా ఉన్నారు. అయితే, నేడు మణిపూర్ నుండి వస్తున్న వార్తల ప్రకారం చాలా హింసాత్మక ఘటనలకు ఉఖ్రుల్, కామ్‌జాంగ్ జిల్లాలు కేంద్రంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో ఉఖ్రుల్‌లో ఇటీవల జరిగిన ఆకస్మిక దాడులు, ఘర్షణలకు కారణమేమిటో, ఈ సంఘర్షణలోకి నాగాలను ఎలా లాగారో మాజీ ఐఏఎస్‌ అధికారి, నాగా పీపుల్స్ ఫ్రంట్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయిన ముయివా వివరించారు. మణిపూర్‌లో… కొండ […]
Read more

సూరత్‌లో ఇళ్ల కూల్చివేతపై విచారణకు మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్!

అహ్మదాబాద్: సూరత్‌లోని నాసిర్ నగర్‌లో 106 ఇళ్ల కూల్చివేతకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని, బాధ్యులపై FIR నమోదు చేయాలని, బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ‘మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ గుజరాత్’ డిమాండ్ చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో, సూరత్‌లోని వేద్ దర్వాజా ప్రాంతంలో ఉన్న జిలానీ బ్రిడ్జ్ సమీపంలోని నివాస ప్రాంతమైన నాసిర్ నగర్‌లో జరిగిన కూల్చివేతపై కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. […]
Read more

మోదీ హయాం…ప్రశ్నపత్రాల లీకుల శకం!

శుచి విశ్వాస్‌, కాంగ్రెస్ ప్రతినిధి…🖋️ గత 12 ఏళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం దేశంలోని దాదాపు ప్రతి సంస్థను, రంగాన్ని దెబ్బతీశాయి. విద్యా వ్యవస్థ కూడా దీనికి మినహాయింపు కాదు. పాఠశాలల మూసివేత, విద్యా బడ్జెట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం, విద్యా సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులను, కార్యకర్తలను నియమించడం, నియామకాలలో అవినీతి, వాణిజ్యీకరణ, సాధారణ నియామకాలను నిలిపివేయడం, కాంట్రాక్టు ఉద్యోగాలపై ఆధారపడటం పెరగడం వంటివి విద్యా వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచాయి. పదేపదే జరుగుతున్న పరీక్ష […]
Read more

వేగంగా క్షీణిస్తున్న ప్రజాస్వామ్యంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని!

రామ్‌ పూనియాని, ప్రముఖ చరిత్రకారులు…🖋️ జవహర్‌లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించి, స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన ప్రతిష్టను మరింత పెంచడానికి బీజేపీ ప్రచార యంత్రాంగం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ కాలంలో సాధించిన ప్రధాన విజయాలను హైలైట్ చేస్తూ…బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి పేజీ ప్రకటనలను ప్రధాన వార్తాపత్రికలలో ప్రచురించారు. 81 కోట్ల మంది పేదలకు […]
Read more

బంగ్లాదేశీయులనే అనుమానంతో థానేలో నలుగురు భారతీయ ముస్లింల అక్రమ నిర్బంధం…విడుదల!

థానే: చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మైనర్‌తో సహా ముగ్గురు మహిళలు, ఒక చిన్నారిని బంగ్లాదేశ్ జాతీయులనే అనుమానంతో అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులు వారిని మంగళవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేశారు. ఈ నలుగురిని ఒక కేంద్రంలో నిర్బంధించారు. ఏఐఎంఐఎం మహిళా యువజన అధ్యక్షురాలు రుబీనా అమ్మర్ పటేల్ ప్రకారం…నిర్బంధంలో ఉన్నవారి వద్ద అసలైన […]
Read more

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మండిపడ్డ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఇది “ప్రజాస్వామ్య హత్య” అని కాంగ్రెస్ ఆరోపించింది. ఆమెను రాజ్యసభలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించింది. తెలంగాణలో ఆమె పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, అక్కడ పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసు గురించి వెల్లడించలేదనే ఆరోపణలపై అభ్యంతరాలు రావడంతో, ఎన్నికల సంఘం పరిశీలన సమయంలో నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించింది. 30 […]
Read more

ముస్లింలు…అవినీతి వ్యతిరేక ప్రచారాలకు దూరంగా ఉండటం అంత మంచిది కాదు!

మహమ్మద్ వజీహుద్దీన్…🖋️ మత పెద్దలు, సామాజిక నాయకులు, ఇమామ్‌ల విజ్ఞప్తులను మన్నించి, జూన్ 6న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొత్తగా ఏర్పడిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP) నిర్వహించిన తొలి నిరసన ప్రదర్శనకు ముస్లిం యువత పెద్ద ఎత్తున దూరంగా ఉన్నారు. నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీకుల నేపథ్యంలో ఏర్పడిన ఈ సంస్థ సమావేశానికి దూరంగా ఉండటాన్ని చాలామంది ముస్లింల “ఆత్మరక్షణ” వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. అవును, “బుల్డోజర్ న్యాయం” అమలులో ఉన్న ఈ […]
Read more

సిమ్లా వీధుల్లో ఇద్దరు ముస్లిం యువకులను అవమానించిన వీహెచ్‌పీ!

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో విశ్వహిందూ పరిషత్ (VHP) అనుబంధ సంస్థ అయిన దేవభూమి సంఘర్ష్ సమితి సభ్యులు… ఇద్దరు ముస్లిం యువకులను వీధుల్లో పబ్లిక్‌గా ఊరేగించి, అవమానించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ముస్లింలు ప్రేమ పేరిట హిందూ మహిళలను క్రమపద్ధతిలో మతం మారుస్తున్నారని ఆరోపించే వివాదాస్పద కుట్ర సిద్ధాంతమైన “లవ్ జిహాద్”కు ఈ చర్యతో ముడిపెట్టారు. అయితే, ఈ ఇద్దరు యువకులకు అసలు ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదు. ఉత్తరప్రదేశ్‌కు […]
Read more

మణిపూర్‌ సహాయ శిబిరాల్లో 700 మందికి పైగా నిర్వాసితులు మృతి!

ఇంఫాల్‌: మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలైనప్పటి (మే 2023లో) నుండి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ శిబిరాలు, తాత్కాలిక గృహాల్లో (prefabricated housing) నివసిస్తున్న కనీసం 731 మంది నిర్వాసితులు (IDPs) మరణించారని ‘సమాచార హక్కు చట్టం’ (RTI) కింద రాష్ట్ర హోం శాఖ వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో ఒక అప్పీల్ కేసులో మణిపూర్ సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, రచయిత,రాజకీయ కార్యకర్త […]
Read more

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇండియా కూటమి డిమాండ్!

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు నిన్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమై, నీట్, సీబీఎస్ఈ పరీక్షలలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఆరోపిత “ఓట్ల దోపిడీ”కి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ పంపాలని కూడా వారు తీర్మానించారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, అఖిలేష్ […]
Read more
1 2 3 4 5 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.