Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

యువతపై పెల్లెట్ గన్‌లు, ఏకే-47లను ఎందుకు ప్రయోగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షం!

న్యూఢిల్లీ: పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతపై పెల్లెట్ గన్‌లు, బాష్పవాయువు, AK-47లు, లాఠీలను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందని ప్రతిపక్షం కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిన మూడు రోజుల తర్వాత లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా, జూలై 20న రాజధానిలో నిరసనకారులపై ప్రభుత్వం ప్రయోగించిన కఠినమైన బలప్రయోగంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. […]
Read more

‘విద్యార్థుల ఎఫ్‌ఐఆర్‌’ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశం ప్రభుత్వ హామీలకు విరుద్ధం…సీజేపీ!

న్యూఢిల్లీ: దేశవ్యాప్త విద్యార్థి నిరసనల సమయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై (FIRs) దర్యాప్తును కొనసాగించడానికి అధికారులకు సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశం అనుమతినిచ్చిందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేర్కొంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలను విరమింపజేసేందుకు జరిగిన చర్చల సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలకు ఈ ఆదేశం విరుద్ధంగా ఉందని CJP తెలిపింది. నిరసనకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందుగా నిలబెట్టుకోవాలని CJP ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటారనేది ప్రభుత్వంతో తమకు […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌కు’దేశభక్తి లేదు, అది’దేశ వ్యతిరేక సంస్థ’…ప్రియాంక్ ఖర్గే!

న్యూఢిల్లీ: బీజేపీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశభక్తి లేని, దేశ వ్యతిరేక సంస్థ”గా అభివర్ణించారు. అలాగే, ఆ ​​సంస్థ చట్టం ప్రకారం తప్పనిసరిగా నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని హెచ్‌కేఎస్ (HKS) భవన్‌లో ‘సమాజ్‌వాదీ సంగం’ ఆధ్వర్యంలో జరిగిన ‘RSS నమోదు ఎందుకు అవసరం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఖర్గే ప్రసంగించారు. RSS తనను […]
Read more

జౌహర్ వర్సిటీకి తాత్కాలిక ఊరట…భవనాల కూల్చివేతపై కోర్టు స్టే!

లక్నో: జౌహర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాంపూర్ క్యాంపస్‌లోని 38 భవనాల కూల్చివేతపై, కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ కోర్టు స్టే విధించింది. ఉపశమనం కోరుతూ విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత ఈ స్టే మంజూరు చేసినట్లు డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు “విశ్వవిద్యాలయం దరఖాస్తును అంగీకరించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఏ కట్టడాన్నీ కూల్చివేయకుండా నిలిపివేసాం. తుది విచారణ జరిగే వరకు ఈ మధ్యంతర […]
Read more

‘ఏ నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం’… ప్రభుత్వంతో చర్చించాక తేల్చిచెప్పిన సీజేపీ!

న్యూఢిల్లీ: “ఏ నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. మనమందరం ఇందులో కలిసే ఉన్నాం,” అని ప్రభుత్వ ప్రతినిధులతో అర్ధరాత్రి జరిగిన సమావేశం అనంతరం కాక్రోచ్‌ జనతా పార్టీ పేర్కొంది. నిరసనకారులకు రక్షణ కల్పించే నోటిఫికేషన్లను మరిన్ని రాష్ట్రాలు జారీ చేస్తాయని వారు తమకు హామీ ఇచ్చారని కూడా ఆ పార్టీ తెలిపింది. ప్రదర్శనకారులపై పోలీసుల చర్యకు సంబంధించి ‘ఒప్పంద ఉల్లంఘన’ జరిగిందని, దీనిపై కొత్తగా నిరసనలు చెలరేగుతాయని సీజేపీ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. […]
Read more

మహ్మద్ ఇర్ఫాన్‌లాంటి యువతే భారతదేశానికి అతిపెద్ద బలం…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిన్న మహ్మద్ ఇర్ఫాన్‌ను కలిశారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన యువజన నిరసన ప్రదర్శనలో భారత రాజ్యాంగ పీఠికను ఉద్వేగభరితంగా పఠించి, ఆ ఉద్యమంలో కీలక స్వరాలలో ఒకరిగా నిలిచిన యువకుడే ఇర్ఫాన్. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇర్ఫాన్‌ “ఢిల్లీలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన యువకుడు, అతని ఆలోచనా విధానం అతని పరిస్థితులకు అతీతమైనది” అని […]
Read more

‘ప్రభుత్వ అహంకారాన్ని ఎలా బద్దలు కొట్టవచ్చో జెన్ జెడ్ చూపించింది’…ఉద్ధవ్‌ థాకరే!

ముంబయి: భారత విద్యా వ్యవస్థలో పేపర్ లీక్‌లు, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెన్ జెడ్‌ను బయటకు వచ్చి సంబరాలు చేసుకోవాలని కోరుతూ శివసేన (ఉద్ధవ్ థాకరే), మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు ఆదివారం ఉదయం పిలుపునిచ్చిన త్రివర్ణ విజయ్ ర్యాలీలో రాజకీయం ఏమాత్రం లేదు. భారతదేశంలో నేటి యువత గౌరవ చిహ్నంగా భావించే ‘ముంబై జెన్ జెడ్’ తరం, నగరంలోని […]
Read more

‘మాదేశంలో మేము నిరాశ్రయులమయ్యాం’…బుందేల్‌ఖండ్‌ గిరిజనులు!

భోపాల్‌: వేరే దేశంలోనైనా, లేదా మన దేశంలోనే వేరొక కాలంలోనైనా, నాయకులు సిగ్గుతో తలదించుకుని ఉండేవారు. మధ్యప్రదేశ్‌లోని ‘కెన్’ నదికి ఉపనది అయిన ‘బరానా’ నదీ తీరంలో, పేద గ్రామస్తులు తమ చావును తామే ప్రదర్శించుకోవడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. మహిళలు చెక్కలతో చేసిన చితిపై పడుకుని ఉన్నారు. పురుషులు, మహిళలు బూడిద పూసుకున్న ముఖాలతో, చెక్క శిలువలకు చేతులు కట్టుకుని ఉన్నారు. యువకులు మెడలో ఉరితాళ్లతో నీటిలో నిలబడి, ‘న్యాయ్ దో యా మృత్యు’ […]
Read more

విద్యార్థులపై అణచివేత ఆరోపణలు… అమిత్‌షా స్పందించాల్సిందేనన్న రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ నిరసన తెలిపిన విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం జరిగిందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జూలై 20న ఢిల్లీలో జరిగిన నిరసనను “క్రూరమైన దాడి”గా అభివర్ణించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాశారు, నిష్పక్షపాత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పరీక్షా విధానాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారని, అయితే భద్రతా సిబ్బంది […]
Read more

ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసన దెబ్బకు మొదటి వికెట్ పడింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రికి తన రాజీనామాను సమర్పించారు. హిందీలో రాసిన రెండు పేజీల లేఖలో ప్రధాన్, మన ప్రజాస్వామ్య శక్తిపై తనకు ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉందని, దేశ యువత ఆకాంక్షలను తాను ఎంతగానో గౌరవిస్తానని పేర్కొన్నారు. అయితే, జంతర్ మంతర్ వద్ద నెలకొన్న ‘పరిస్థితి’ని ప్రస్తావిస్తూ, గత […]
Read more
1 2 3 4 5 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.